Ind W vs Eng W: సెంచరీతో రెచ్చిపోయిన టీమిండియా కెప్టెన్.. 6 వికెట్లతో సత్తా చాటిన క్రాంతి గౌడ్.. ఇంగ్లాండ్పై సిరీస్ కైవసం..!
- సెంచరీతో రెచ్చిపోయిన టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్..
- 6 వికెట్లతో సత్తా చాటిన క్రాంతి గౌడ్..
- 13 పరుగుల తేడాతో గెలుపు.
- వన్డే సిరీస్ను 2-1తో భారత్ కైవసం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ind W vs Eng W: ఇంగ్లాండ్ లోని చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్ను 13 పరుగుల తేడాతో ఓడించి వన్డే సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. ఇప్పటికే టీ20 సిరీస్ ను కైవసం చేసుకోగా.. వన్డే సిరీస్ను కూడా తన కథలో వేసుకుంది. ఈ మ్యాచ్ లో బ్యాట్తో హర్మన్ప్రీత్ కౌర్ సెంచరీతో అలరించగా, బౌలింగ్లో క్రాంతి గౌడ్ ఆరు వికెట్లు తీసి ఇంగ్లాండ్ ను దెబ్బ తీశారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత జట్టు 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 318 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ ప్రతీకా రావాల్ (26), స్మృతి మంధాన (45) మొదట్లో మంచి ప్రారంభం ఇచ్చారు. ఆ తర్వాత హర్లీన్ డియోల్ (45) సపోర్ట్ తో, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 84 బంతుల్లో 14 ఫోర్లతో 102 పరుగుల సూపర్ సెంచరీ చేసింది. చివర్లో జెమీమా రోడ్రిగ్స్ 45 బంతుల్లో 50 పరుగులతో ఫినిషింగ్ ఇచ్చింది. అలాగే రిచా ఘోష్ 18 బంతుల్లో 38 పరుగులు చేయడంతో భారత్ భారీ స్కోర్ సాధించింది.
Also Read
- Pawan Kalyan: ‘నా అన్నయ్యే నా ఏకైక హీరో’.. 'చిరు' పుట్టినరోజున తమ్ముడు ఎమోషనల్ పోస్ట్..!
- Toxic Censor Report: 'టాక్సిక్'కు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చిందా.?
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 31 నుంచే ప్రారంభం..
- H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
Gold Rate Today: గోల్డ్ ప్రియులకు భారీ షాక్.. నేడు తులం బంగారం రేటు ఎంతో తెలుసా?

ఇక 319 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ తొలుత రెండు వికెట్లు త్వరగా కోల్పోయింది. అయితే ఎమ్మా లాంబ్ 68 పరుగులు, కెప్టెన్ నాట్ సివర్ బ్రంట్ 98 పరుగులతో మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. చివర్లో ఆలిస్ డేవిడ్సన్ (44) మినహా ఎవరూ నిలబడలేకపోయారు. దీనితో ఇంగ్లాండ్ జట్టు 49.5 ఓవర్లలో 305 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక భారత బౌలర్లలో క్రాంతి గౌడ్ 9.5 ఓవర్లలో 52 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసి భారత్ విజయానికి మద్దతు అందించింది. ఆమెకు తోడుగా శ్రీ చరణి 2 వికెట్లు, దీప్తి శర్మ 1 వికెట్ తీశారు.
Suriya : సూర్య ‘కరుప్పు’ టీజర్ రిలీజ్.. ఓల్డ్ స్కూల్ కమర్షియల్ ట్రీట్

ఇక ఈ సిరీస్ లో.. మ్యాచ్ సంబంధించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా హర్మన్ప్రీత్ కౌర్ (102 పరుగులు) ఎంపిక కాగా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా కూడా హర్మన్ప్రీత్ కౌర్ (126 పరుగులు) ఎన్నికైంది. ఈ విజయం ద్వారా భారత్ మూడు వన్డేల సిరీస్ను 2–1 తేడాతో గెలుచుకుని ఇంగ్లాండ్ గడ్డపై మరో సిరీస్ విజయాన్ని అందుకుంది. నిజానికి ఇంగ్లాండ్ను వారి దేశంలో ఓడించడం ఒక సవాల్. కానీ భారత మహిళల జట్టు ఈ విజయలతో తన సత్తాను నిరూపించుకుంది.
తాజావార్తలు
-
Pawan Kalyan: ‘నా అన్నయ్యే నా ఏకైక హీరో’.. ‘చిరు’ పుట్టినరోజున తమ్ముడు ఎమోషనల్ పోస్ట్..!
-
Mugguru Kothulu First Look: గాంధీజీ మూడు సూత్రాలతో ‘ముగ్గురు కోతులు’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్
-
TVS Ronin Price Hike: టీవీఎస్ Ronin ఆరు వేరియంట్ల ధరలు పెంపు.. కొత్త ప్రైస్ లిస్ట్ ఇదే
-
Toxic Censor Report: ‘టాక్సిక్’కు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చిందా.?
-
Gachibowli Bike Accident: గచ్చిబౌలిలో ఘోరం.. బైక్ ప్రమాదంలో ఐటీ ఉద్యోగి మృతి..
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?