Baba Ramdev Visits Kanaka Durga Temple: బెజవాడ కనకదుర్గమ్మ సేవలో బాబా రాందేవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baba Ramdev Visits Kanaka Durga Temple: విజయవాడ కనకదుర్గమ్మను ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాందేవ్ బాబాకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ ఈవో.. అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సదర్భంగా రాందేవ్ బాబా మాట్లాడుతూ.. అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.. జగన్మాత దర్శనం ఎన్నెన్నో జన్మల పుణ్యఫలమని అన్నారు. అమ్మవారిని దర్శించుకోవడం తనకు సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని తెలిపారు. సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న రాందేవ్ బాబా.. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారు స్వయంభువుగా వెలిశారని, అమరావతి సమీపంలో ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి మహా శక్తి పీఠం ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టమని అన్నారు.
అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై కూడా రాందేవ్ బాబా ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్ అని.. ఆయనను కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అమరావతి దేవతల రాజధానిగా రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు.. ఇక, విద్య, వ్యవసాయం సహా పలు రంగాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని అన్నారు రాందేవ్ బాబా.. ఇక, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి సమీపంలోని ఉండవల్లి గుహల్లో నిర్వహించిన ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ప్రశంసల వర్షం కురిపించారు.
Also Read
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. సీఎం భరోసాతో సంతృప్తి వ్యక్తం చేసిన తల్లి
- YS Jagan: సాయికృష్ణ కుటుంబాన్ని ఓదార్చిన జగన్.. కృష్ణలంక ఘటనలపై సీరియస్.. సీబీఐ విచారణకు డిమాండ్..
- Vijayawada: రౌడీషీటర్ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన సెల్ఫీ వీడియో
- Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యంత వినూత్న, సృజనాత్మక, దూరదృష్టి కలిగిన మరియు అమలు సామర్థ్యం ఉన్న నాయకుడని బాబా రాందేవ్ పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం, ఆధ్యాత్మికత, సాంస్కృతిక వారసత్వాన్ని సమన్వయం చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రత్యేక దృష్టి ఆయనకు ఉందని అన్నారు. చంద్రబాబు నాయుడు వారసత్వాన్ని కాపాడుతూ అభివృద్ధిని సాధించాలనే ఆలోచనతో పనిచేస్తున్నారని రాందేవ్ తెలిపారు. సంపద సృష్టితో పాటు ఆధ్యాత్మిక విలువలను కూడా సమానంగా ప్రోత్సహించడం ద్వారా సమగ్ర అభివృద్ధికి ఆయన కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్దేశించిన ‘వికసిత్ భారత్-2047’ లక్ష్యాన్ని ప్రస్తావించిన బాబా రాందేవ్, దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడిలా అంకితభావం, నిజాయితీ, పట్టుదలతో పనిచేస్తే 2047 కంటే ముందే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Baba Ramdev Visits Kanaka Durga Temple: బెజవాడ కనకదుర్గమ్మ సేవలో బాబా రాందేవ్
-
Currency Notes: పాత రూ.1, రూ.2, రూ.10 నోట్లకు భలే డిమాండ్.. కొనాలన్నా, అమ్మాలన్నా ఇదే ఛాన్స్..
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Shashi Tharoor: మోడీపై శశి థరూర్ ప్రశంసలు.. చిక్కుల్లో రాహుల్ గాంధీ..
-
Prabhas: ప్రభాస్ మొబైల్ వాల్పేపర్ లీక్.. డార్లింగ్ ఫోన్ స్క్రీన్పై అదిరిపోయే ఫోటో!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!