Ambati Rambabu: చరిత్రలో ఇంత దారుణమైన ఎన్నికలు జరగలేదు..
- జడ్పీటీసీ ఉప ఎన్నికలపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు..
- చరిత్రలో ఇంత దారుణమైన ఎన్నికలు ఎప్పుడూ జరగలేదు..
- మాజీమంత్రి అంబటి రాంబాబు ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: చరిత్రలో ఇంత దారుణమైన ఎన్నికలు జరగలేదు అని ఆరోపించారు వైసీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబు.. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలపై విజయవాడలోని ఎన్నికల కమిషన్ ఆఫీసు ముందు ఆందోళన దిగారు వైసీపీ నేతలు.. జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అక్రమాలు జరగుతున్నాయి.. అన్యాయంగా వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు.. ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు.. ఓటర్లు ఓటు వేయటానికి ప్రయత్నించి పోలీసుల కాళ్లు పట్టుకుని నా ఓటు హక్కును వినియోగించుకునేలా అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడాల్సి వస్తుందన్నారు.. ఖాళీ మొత్తం స్థానాల్లో కాకుండా కేవలం పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు మాత్రమే ఎన్నికలు పెట్టారు.. ఇక్కడ గెలిచి వైఎస్ జగన్ పని అయిపోయింది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
Read Also:Bandi Sanjay: అసత్యాలు మాట్లాడారంటూ.. కేంద్రమంత్రి బండి సంజయ్కి లీగల్ నోటీసు!
Also Read
- CM Chandrababu Naidu: యోగాతో హెల్తీ, వెల్తీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం.!
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. నవీన్రెడ్డి హత్యతో లింకులపై ఫోకస్
- Baba Ramdev Visits Kanaka Durga Temple: బెజవాడ కనకదుర్గమ్మ సేవలో బాబా రాందేవ్
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. సీఎం భరోసాతో సంతృప్తి వ్యక్తం చేసిన తల్లి
ఓటరు స్లిప్పులు దౌర్జన్యంగా లాక్కుని వాళ్లు మనుషులతో దొంగ ఓట్లు వేయిస్తున్నారు.. చరిత్రలో ఇంత దారుణమైన ఎన్నికలు జరగలేదన్నారు అంబటి రాంబాబు.. గతంలో నంద్యాలలో ఇదే తరహాలో చేసి గెలిచారు.. ఆ తర్వాత ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు.. ఒక్క గ్రామాల్లోని వ్యక్తులను తీసుకువచ్చి దొంగ ఓట్లు వేయించుకుని గెలవాలని చూస్తున్నారు.. ప్రజాప్రతినిధులను కూడా ఇళ్ల నుంచి బయటకు రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. జమ్మలమడుగు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ నాగేశ్వరరెడ్డి ఇక్కడకు వచ్చి ఓట్లు వేశారు అని ఫైర్ అయ్యారు.. దారుణమైన పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతాయని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశాం.. ఈనెల 5వ తేదీ నుంచి చెవిటి వాడి చెవిలో శంఖం ఊదినట్లుగా చెబుతూనే ఉన్నాం.. టీడీపీ, పోలీసులు, ఎలక్షన్ కమిషన్ కలిసిపోతే ఇంకా ఏం చేస్తాం అంటూ ఆవేదన వెలిబుచ్చారు.. మీరు చేసే దుర్మార్గాలను అర్ధం చేసుకుని ప్రజలు మీకు సమాధానం చెప్పే రోజు వస్తుందని హెచ్చరించారు.
Read Also: Undermine : మిమ్మల్ని చులకనగా చూసే వారికి ఈ ఒక్క సమాధానం..
మా ఓటు మేం వేసుకోలేదని వందల మంది బయటకు వస్తున్నారు.. ప్రజాస్వామ్యాన్ని కూని చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు అంబటి రాంబాబు. మా పులివెందుల అభ్యర్థి గన్ మెన్ ను కూడా ఇవాళ అకస్మాత్తుగా మార్చేశారు.. మీరు చేసిన ప్రతి పనికి మీరు ప్రతిఫలం అనుభవించక తప్పదు.. అధికారాన్ని దుర్వినియోగం చేసి గెలుపుకోసం తాపత్రయపడుతున్నారు అని దుయ్యబట్టారు మాజీ మంత్రి అంబటి రాంబాబు..
తాజావార్తలు
-
SIP Investment: నెలకు రూ.20 వేల పెట్టుబడితో.. రూ.1 కోటి సంపాదించండి.. ఎలా అంటే..
-
Bullet Trains: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం
-
New T20 captain Shreyas Iyer: ‘సింహాల్లా ఆడదాం’.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ తొలి సందేశం..
-
Denmark: డెన్మార్క్లో అజాన్పై బ్యాన్.. ఇస్లామీకీకరణపై ఆందోళన..
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
ట్రెండింగ్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!