Ambati Rambabu: చరిత్రలో ఇంత దారుణమైన ఎన్నికలు జరగలేదు..
- జడ్పీటీసీ ఉప ఎన్నికలపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు..
- చరిత్రలో ఇంత దారుణమైన ఎన్నికలు ఎప్పుడూ జరగలేదు..
- మాజీమంత్రి అంబటి రాంబాబు ఆరోపణ..
Ambati Rambabu: చరిత్రలో ఇంత దారుణమైన ఎన్నికలు జరగలేదు అని ఆరోపించారు వైసీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబు.. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలపై విజయవాడలోని ఎన్నికల కమిషన్ ఆఫీసు ముందు ఆందోళన దిగారు వైసీపీ నేతలు.. జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అక్రమాలు జరగుతున్నాయి.. అన్యాయంగా వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు.. ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు.. ఓటర్లు ఓటు వేయటానికి ప్రయత్నించి పోలీసుల కాళ్లు పట్టుకుని నా ఓటు హక్కును వినియోగించుకునేలా అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడాల్సి వస్తుందన్నారు.. ఖాళీ మొత్తం స్థానాల్లో కాకుండా కేవలం పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు మాత్రమే ఎన్నికలు పెట్టారు.. ఇక్కడ గెలిచి వైఎస్ జగన్ పని అయిపోయింది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
Read Also:Bandi Sanjay: అసత్యాలు మాట్లాడారంటూ.. కేంద్రమంత్రి బండి సంజయ్కి లీగల్ నోటీసు!
Also Read
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
- Fire Services Week: అగ్నిమాపక శాఖ వారోత్సవాలకు శ్రీకారం.. నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందే..
ఓటరు స్లిప్పులు దౌర్జన్యంగా లాక్కుని వాళ్లు మనుషులతో దొంగ ఓట్లు వేయిస్తున్నారు.. చరిత్రలో ఇంత దారుణమైన ఎన్నికలు జరగలేదన్నారు అంబటి రాంబాబు.. గతంలో నంద్యాలలో ఇదే తరహాలో చేసి గెలిచారు.. ఆ తర్వాత ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు.. ఒక్క గ్రామాల్లోని వ్యక్తులను తీసుకువచ్చి దొంగ ఓట్లు వేయించుకుని గెలవాలని చూస్తున్నారు.. ప్రజాప్రతినిధులను కూడా ఇళ్ల నుంచి బయటకు రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. జమ్మలమడుగు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ నాగేశ్వరరెడ్డి ఇక్కడకు వచ్చి ఓట్లు వేశారు అని ఫైర్ అయ్యారు.. దారుణమైన పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతాయని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశాం.. ఈనెల 5వ తేదీ నుంచి చెవిటి వాడి చెవిలో శంఖం ఊదినట్లుగా చెబుతూనే ఉన్నాం.. టీడీపీ, పోలీసులు, ఎలక్షన్ కమిషన్ కలిసిపోతే ఇంకా ఏం చేస్తాం అంటూ ఆవేదన వెలిబుచ్చారు.. మీరు చేసే దుర్మార్గాలను అర్ధం చేసుకుని ప్రజలు మీకు సమాధానం చెప్పే రోజు వస్తుందని హెచ్చరించారు.
Read Also: Undermine : మిమ్మల్ని చులకనగా చూసే వారికి ఈ ఒక్క సమాధానం..
మా ఓటు మేం వేసుకోలేదని వందల మంది బయటకు వస్తున్నారు.. ప్రజాస్వామ్యాన్ని కూని చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు అంబటి రాంబాబు. మా పులివెందుల అభ్యర్థి గన్ మెన్ ను కూడా ఇవాళ అకస్మాత్తుగా మార్చేశారు.. మీరు చేసిన ప్రతి పనికి మీరు ప్రతిఫలం అనుభవించక తప్పదు.. అధికారాన్ని దుర్వినియోగం చేసి గెలుపుకోసం తాపత్రయపడుతున్నారు అని దుయ్యబట్టారు మాజీ మంత్రి అంబటి రాంబాబు..
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!