Vijayawada: విషాదం.. హోటల్ కిటికీ నుంచి పడి నాలుగేళ్ల చిన్నారి మృతి
- విజయవాడలో విషాదం
- హోటల్ కిటికీ నుంచి పడి నాలుగేళ్ల చిన్నారి రుహిక మృతి
- గతరాత్రి హోటల్ మినర్వా గ్రాండ్ లో బసచేసిన బద్రీ నాగరాజు కుటుంబం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దుర్గమ్మ దర్శనానికి వచ్చిన ఓ కుటుంబానికి తీరని లోటు కలిగింది. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కుమార్తె మృతి చెందడంతో.. ఆ తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. హాయిగా విహారయాత్రలు, పుణ్యక్షేత్రాలకు వెళ్లి తిరిగి వస్తున్న ఆ కుటుంబం… తీవ్ర దు:ఖ సాగరంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళ్తే… విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. హోటల్ కిటికీ నుంచి పడి నాలుగేళ్ల చిన్నారి (రుహిక) మృతి చెందింది. గతరాత్రి బద్రీ నాగరాజు కుటుంబం హోటల్ మినర్వా గ్రాండ్లో బసచేసింది. అయితే.. వారు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం కోసమని, విశాఖ నుంచి బయల్దేరి శ్రీశైలం వెళ్లి అక్కడ దేవుడిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో విజయవాడకు వచ్చారు. బెజవాడలో ఇంద్రకీలాద్రిపై ఉన్న కనక దుర్గను దర్శించుకునేందుకు.. హోటల్ మినర్వా గ్రాండ్లో దిగారు. అయితే.. ఈరోజు కనక దుర్గ అమ్మవారిని దర్శించుకుని విశాఖ వెళ్లాలనుకుని భావించిన ఆ కుటుంబానికి తీవ్ర విషాదం మిగిలింది.
Read Also: AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వెబ్సైట్లోకి పాత జీవోలు..!
Also Read
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
ఈరోజు ఉదయం తన అన్నతో కలిసి దొంగ పోలీస్ ఆట ఆడుతున్న క్రమంలో చిన్నారి రుహిక.. దాక్కోవానికి కిటికీ తలుపు తెరిచింది. ఈ క్రమంలో నాల్గవ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ కాలు జారిపడి చిన్నారి మృతి చెందింది. మరో గంటలో హోటల్ రూమ్ను చెక్ అవుట్ చేస్తారనే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే.. తమ కళ్ల ముందే కూతురు చనిపోవడంతో నాగరాజు కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం దర్యాప్తు చేపట్టారు. సీఐ ప్రకాష్ మాట్లాడుతూ..
పాప కిటికీలోంచి పడిపోయేటప్పుడు ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారని అన్నారు. వారు హౌస్ కీపింగ్ వర్క్ చేస్తున్నారని తెలిపారు. కాపాడేందుకు పరుగు పరుగున వచ్చినప్పటికీ అప్పటికే పాప కింద పడిపోయిందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
-
Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
-
Ravi Shastri: సూర్యకుమార్ యాదవ్ శకం తర్వాత కెప్టెన్ అతనే.. కీలక వ్యాఖ్యలు చేసిన క్రికెట్ దిగ్గజం.!
-
Maa Inti Bangaram: తెలివిగా తప్పించుకున్న సమంత..!
-
Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!