Kesineni Nani: దూకుడు పెంచిన ఎంపీ నాని.. వ్యూహం అదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ రాజకీయాలు టీడీపీ ఎంపీ కేశినేని నాని చుట్టూ తిరుగుతాయి. ఏపీ రాజకీయాలకు కేంద్రంగా భావించే బెజవాడలో గెలిచి తన సత్తా చాటారు నాని. అయితే కొద్దికాలంగా ఆయన వ్యూహం ఏంటనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. తాజాగా దూకుడు పెంచిన ఎంపీ కేశినేని నాని,సుమారు నాలుగేళ్ళ తర్వాత నియోజకవర్గ కేంద్రమైన మైలవరంలో అడుగుపెట్టారు. మైలవరం లో బొమ్మసాని సుబ్బారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమానికి ముందు ఆసక్తికర పరిణామం జరిగింది.
మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కి,ఎంపీ కేశినేని నానికి పొసగడంలేదనే ఊహాగానాల మద్య తెలుగుదేశం పార్టీలో కాకరేపిన ఎంపీ కదలికలు హాట్ టాపిక్ అయ్యాయి. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నాని సోదరుడు చిన్ని తో కార్యక్రమాలు నిర్వహిస్తుండగా,మాజీ మంత్రి కి వ్యతిరేక వర్గంగా పేరు బడిన బొమ్మసాని సుబ్బారావు కార్యక్రమాలకు హాజరౌతున్నారు కేశినేని నాని. బొమ్మసానికే తన మద్దతు అని ఇటీవల బహిరంగంగానే ప్రకటించిన నాని.. అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు.
Also Read
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
Read Also: SRH vs MI: సోసోగా రాణిస్తున్న ముంబై ఇండియన్స్.. 10 ఓవర్లలో స్కోరు ఇది!
రంజాన్ తోఫా పంపిణీ వేదికగా గత మూడురోజులుగా నియోజకవర్గంలో బొమ్మసాని ఆధ్వర్యంలో జరుగుతున్న తోఫా పంపిణీ కార్యక్రమానికి హాజరౌతున్నారు ఎంపీ నాని. నాని తో పాటు తెలుగుదేశం పార్టీ అభిమానులు, క్రియాశీలక నేతలు కార్యక్రమానికి హాజరవుతుండడంతో ఆసక్తిగా మారాయి రాజకీయ పరిణామాలు. ముందుగా ద్వారకాతిరుమల వంశపారంపర్య ధర్మకర్త,పాలకమండలి చైర్మన్ రాజా ఎస్వీ సుధాకరరావు(ఎస్వీఎస్) దివాణానికి వెళ్ళిన నాని..దివాణానికి వెళ్ళి ఎస్వీఎస్ ఆశీర్వాదం తీసుకున్నారు ఎంపీ కేశినేని నాని. మైలవరంలో గతంలో జమీందార్లు గా వ్యవహరించి, ఇప్పటికీ మైలవరం ప్రజలకు పెద్దదిక్కుగా కొనసాగుతున్న రాజా ఎస్వీఎస్ కుటుంబం దగ్గరకు నాని వెళ్ళడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
Read Also:Mahamood Ali: ఈద్గాను ప్రారంభించిన మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి
మైలవరంలో రాజకీయ పార్టీలకు అతీతంగా పెద్ద తలగా వ్యవహరిస్తుంది మైలవరం జమీందార్ కుటుంబం. మైలవరంలో పోటీ చేసే ఆయా పార్టీల నేతలకు రాజకీయంగా చక్రం తిప్పే జమీందార్ కుటుంబ మద్దతు కీలకం అనే చెప్పాలి. కేశినేని నానిని దుశ్శలువాతో సత్కరించారు జమీందార్ ఎస్వీఎస్. జమీందార్ ఎస్వీ ఎస్ తో అంతరంగికంగా సుమారు అరగంట పాటు గడిపిన ఎంపీ కేశినేని నాని ఏం మాట్లాడారోనని అంతా చెవులు కొరుక్కుంటున్నారు.
అనంతరం మైలవరం హాజీపేటలోని జామియా మసీద్ కి వెళ్ళి నమాజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు కేశినేని నాని. ప్రార్థనల అనంతరం ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బొమ్మసాని సుబ్బారావు సౌజన్యంతో ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా పంపిణీని కొనసాగించారు ఎంపీ కేశినేని నాని. పేదవారికి సహాయం చేయడమే రంజాన్ ఉపవాస దీక్షల సారాంశమన్నారు ఎంపీ. ఆయనతో పాటు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కీలక నేత ఖాజా రాజ్ కుమార్ మరియు పలువురు తెలుగుదేశం పార్టీ క్రియాశీలక,ద్వితీయ శ్రేణి నాయకులు పాల్గొన్నారు. జమీందార్ కుటుంబంతో కలయిక నేపథ్యంలో నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది నాని వ్యూహం.
తాజావార్తలు
-
PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
-
RR vs LSG: ప్లేఆఫ్ స్థానం కోసం రాజస్థాన్.. పరువు కోసం లఖ్నవూ సూపర్ జెయింట్స్.. గెలిచేదెవరో.?
-
Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
-
Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..
-
CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!