Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
- కోవిడ్-19 పరిస్థితులపై మంత్రి సత్యకుమార్ సమీక్ష
- వైద్యాధికారులతో పరిస్థితిని సమీక్షించిన మంత్రి
- రాజమహేంద్రవరంలో ప్రత్యేక కోవిడ్ వార్డు ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Covid-19 Alert: ఆంధ్రప్రదేశ్లో మహమ్మారి కొవిడ్-19 పరిస్థితులపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల వైద్యాధికారులతో పరిస్థితిని సమీక్షించిన మంత్రి.. కొవిడ్ పరీక్షలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడెక్కడ కేసులు నమోదవుతున్నాయో నిరంతరం పర్యవేక్షిస్తూ.. కేసుల సంఖ్య పెరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని జిల్లాల వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు.
కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా వైద్యశాఖ అప్రమత్తమైంది. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేక కొవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 10 పడకలతో ప్రత్యేక వార్డును సిద్ధం చేశారు. అవసరమైన వెంటిలేటర్లు, ఆక్సిజన్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వైద్యశాఖ ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.
Also Read
- Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
అలాగే వైద్య సిబ్బందిని కూడా అప్రమత్తం చేసి, అవసరమైన సూచనలు జారీ చేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం పరిధిలో ఒక్క కొవిడ్ కేసు కూడా నమోదు కాలేదని, ప్రజలు అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మహమ్మారి విషయంలో ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచించారు. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి కొవిడ్ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పరిస్థితిని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోందని, ప్రజల సహకారంతో కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
-
Suriya : ఎక్స్పరిమెంట్స్ వద్దు.. రొటీన్ కమర్షియల్ సినిమాలే ముద్దంటున్న సూర్య
-
Fahadh Faasil: టామ్ క్రూజ్ సినిమాను వదులుకున్న ఫహద్ ఫాసిల్.. కారణం తెలిస్తే షాకవుతారు!
-
FIFA World Cup 2026 Final: మెస్సీ వర్సెస్ యమాల్.. అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ పోరు, ఎవరిది పైచేయి?
-
2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!