Kesineni Nani: దూకుడు పెంచిన ఎంపీ నాని.. వ్యూహం అదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ రాజకీయాలు టీడీపీ ఎంపీ కేశినేని నాని చుట్టూ తిరుగుతాయి. ఏపీ రాజకీయాలకు కేంద్రంగా భావించే బెజవాడలో గెలిచి తన సత్తా చాటారు నాని. అయితే కొద్దికాలంగా ఆయన వ్యూహం ఏంటనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. తాజాగా దూకుడు పెంచిన ఎంపీ కేశినేని నాని,సుమారు నాలుగేళ్ళ తర్వాత నియోజకవర్గ కేంద్రమైన మైలవరంలో అడుగుపెట్టారు. మైలవరం లో బొమ్మసాని సుబ్బారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమానికి ముందు ఆసక్తికర పరిణామం జరిగింది.
మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కి,ఎంపీ కేశినేని నానికి పొసగడంలేదనే ఊహాగానాల మద్య తెలుగుదేశం పార్టీలో కాకరేపిన ఎంపీ కదలికలు హాట్ టాపిక్ అయ్యాయి. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నాని సోదరుడు చిన్ని తో కార్యక్రమాలు నిర్వహిస్తుండగా,మాజీ మంత్రి కి వ్యతిరేక వర్గంగా పేరు బడిన బొమ్మసాని సుబ్బారావు కార్యక్రమాలకు హాజరౌతున్నారు కేశినేని నాని. బొమ్మసానికే తన మద్దతు అని ఇటీవల బహిరంగంగానే ప్రకటించిన నాని.. అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు.
Also Read
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
- Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
Read Also: SRH vs MI: సోసోగా రాణిస్తున్న ముంబై ఇండియన్స్.. 10 ఓవర్లలో స్కోరు ఇది!
రంజాన్ తోఫా పంపిణీ వేదికగా గత మూడురోజులుగా నియోజకవర్గంలో బొమ్మసాని ఆధ్వర్యంలో జరుగుతున్న తోఫా పంపిణీ కార్యక్రమానికి హాజరౌతున్నారు ఎంపీ నాని. నాని తో పాటు తెలుగుదేశం పార్టీ అభిమానులు, క్రియాశీలక నేతలు కార్యక్రమానికి హాజరవుతుండడంతో ఆసక్తిగా మారాయి రాజకీయ పరిణామాలు. ముందుగా ద్వారకాతిరుమల వంశపారంపర్య ధర్మకర్త,పాలకమండలి చైర్మన్ రాజా ఎస్వీ సుధాకరరావు(ఎస్వీఎస్) దివాణానికి వెళ్ళిన నాని..దివాణానికి వెళ్ళి ఎస్వీఎస్ ఆశీర్వాదం తీసుకున్నారు ఎంపీ కేశినేని నాని. మైలవరంలో గతంలో జమీందార్లు గా వ్యవహరించి, ఇప్పటికీ మైలవరం ప్రజలకు పెద్దదిక్కుగా కొనసాగుతున్న రాజా ఎస్వీఎస్ కుటుంబం దగ్గరకు నాని వెళ్ళడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
Read Also:Mahamood Ali: ఈద్గాను ప్రారంభించిన మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి
మైలవరంలో రాజకీయ పార్టీలకు అతీతంగా పెద్ద తలగా వ్యవహరిస్తుంది మైలవరం జమీందార్ కుటుంబం. మైలవరంలో పోటీ చేసే ఆయా పార్టీల నేతలకు రాజకీయంగా చక్రం తిప్పే జమీందార్ కుటుంబ మద్దతు కీలకం అనే చెప్పాలి. కేశినేని నానిని దుశ్శలువాతో సత్కరించారు జమీందార్ ఎస్వీఎస్. జమీందార్ ఎస్వీ ఎస్ తో అంతరంగికంగా సుమారు అరగంట పాటు గడిపిన ఎంపీ కేశినేని నాని ఏం మాట్లాడారోనని అంతా చెవులు కొరుక్కుంటున్నారు.
అనంతరం మైలవరం హాజీపేటలోని జామియా మసీద్ కి వెళ్ళి నమాజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు కేశినేని నాని. ప్రార్థనల అనంతరం ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బొమ్మసాని సుబ్బారావు సౌజన్యంతో ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా పంపిణీని కొనసాగించారు ఎంపీ కేశినేని నాని. పేదవారికి సహాయం చేయడమే రంజాన్ ఉపవాస దీక్షల సారాంశమన్నారు ఎంపీ. ఆయనతో పాటు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కీలక నేత ఖాజా రాజ్ కుమార్ మరియు పలువురు తెలుగుదేశం పార్టీ క్రియాశీలక,ద్వితీయ శ్రేణి నాయకులు పాల్గొన్నారు. జమీందార్ కుటుంబంతో కలయిక నేపథ్యంలో నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది నాని వ్యూహం.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్న.. హ్యారీ బ్రూక్ సమాధానం ఇదే!
-
OPPO K14x 5G: ఒప్పో K14x 5G.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్!
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
-
Rohit Sharma: ఇంగ్లండ్తో మూడో వన్డే మ్యాచ్.. అదే రోహిత్కు ప్రధాన సమస్య!
-
Bollywood: బాలీవుడ్లో కోట్లు కురిపిస్తున్న కామెడీ చిత్రాలు
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!