Vidadala Rajini: చంద్రబాబుకు అది తప్ప.. మరే ధ్యాసే లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vidadala Rajini Fires On Chandrababu Naidu: టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మంత్రి విడదల రజిని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీలను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో బీసీల సంక్షేమం కోసం కేవలం రూ. 19 వేల కోట్లను మాత్రమే ఖర్చు చేశారని అన్నారు. కానీ.. వైసీపీ ప్రభుత్వం మాత్రం గత మూడున్నరేళ్లలోనే బీసీలకు రూ. 1.63 లక్షల కోట్లను ఖర్చు చేసిందని పేర్కొన్నారు. చంద్రబాబు బీసీలను కేవలం ఓటు బ్యాంక్గా వినియోగించుకున్నారని మండిపడ్డారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ తర్వాత వారిని నిర్లక్ష్యం చేశారని చెప్పారు.
Big Twist in Vaishali Case: వైశాలి కేసులో బిగ్ ట్విస్ట్.. మాకు ఏడాది క్రితమే పెళ్లైందంటున్న నవీన్
Also Read
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
- Poleramma Jatara 2026: వెదురుపాకలో పోలేరమ్మతల్లి జాతర.. సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్!
తమ వైసీపీ ప్రభుత్వం సంక్షేమానికి కట్టుబడి ఉందని.. వారి ఉన్నతి కోసం ఎన్నో సంక్షేమ ఫథకాలను అమలు చేస్తున్నామని విడదల రజిని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందడం కోసం, ప్రతి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అంటగట్టి, విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకి వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడమే పని అని, అది తప్ప ఆయనకు మరో ధ్యాసే లేదని విమర్శించారు. ఇక మంగళగిరిలో త్వరలోనే ఎయిమ్స్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ పథకం ద్వారా బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని, ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలను అందించే వీలు కలుగుతుందని అన్నారు. ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నట్టు ఎయిమ్స్ని నీటి సమస్య లేనే లేదని, విజయవాడ మున్సిపల్ కమిషనరేట్, తాడేపల్లి-మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి మూడు లక్షల లీటర్ల చొప్పున నీరు సరఫరా అవుతోందని స్పష్టం చేశారు.
Husband Forced Wife: కీచక భర్త.. ఫ్రెండ్స్తో పడుకోమని బలవంతం.. రికార్డ్ కూడా చేశాడు
అంతకుముందు కూడా.. చంద్రబాబు తన పాలనలో బీసీలకు వెన్నుపోటు పొడిచారని విడదల రజిని ఆరోపించారు. బీసీలకు రాజకీయ గౌరవం ఇచ్చింది ఒక్క సీఎం జగన్ మాత్రమేనన్నారు. జగన్ బీసీ బాంధవుడని.. చంద్రబాబు బీసీల పట్ల రాబందు చెప్పారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకి బీసీలు గుర్తొస్తారని, మూడున్నరేళ్లలోనే బీసీల్లో జగన్ సంపాదించిన పేరు చూసి టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని అన్నారు. బీసీలకు ఏం చేశామ తాము ధైర్యంగా చెప్పగలమని, మరి చంద్రబాబుకు ఆ ధైర్యం ఉందా? అని సవాల్ చేశారు. అసలు బీసీల గురించి మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదని తేల్చి చెప్పారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: రికార్డుల వేటలో అభిషేక్ శర్మ.. ఆ క్లబ్లోకి కూడా చేరిన అభిషేక్.
-
Malayalam sequels : మలయాళ ఇండస్ట్రీలో సత్తా చాటుతోన్న సీక్వెల్స్.. వందల కోట్ల వసూళ్లతో రికార్డ్స్
-
Amanpreet Singh Gill: విరాట్ కోహ్లీ సహచరుడు.. పంజాబ్ కింగ్స్ ఆటగాడు కన్నుమూత
-
Heinrich Klaasen: ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న కాటేరమ్మ పెద్ద కొడుకు.. టాప్ 5లో ముగ్గురు హైదరాబాద్ ఆటగాళ్లే..
-
KING : షారూఖ్ ఖాన్ కింగ్ను వదలని లీక్స్.. నెట్టింట వైరల్ అవుతున్న రొమాంటిక్ సీన్
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!