వినోద్ జైన్ ను సస్పెండ్ చేసి టీడీపీ చేతులు దులుపుకుంటోందని.. చిన్నారి ఆత్మహత్య ఘటనపై చంద్రబాబు సమాధానం చెప్పాలని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. టీడీపీ నేత వినోద్ జైన్ చిన్నారిని ఇబ్బంది పెట్టాడని.. మూడు పేజీల సూసైడ్ నోట్ రాసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేని విధంగా కఠినంగా వ్యవహరించాడని…. 54 ఏళ్ల వ్యక్తికి ఈ బుద్ది ఎలా వచ్చిందో అర్ధం కాని పరిస్థితి ఉందన్నారు. వినోద్ కుమార్ జైన్ను కఠినంగా శిక్షిస్తామని.. అందరూ బాధపడుతోన్నారని మంత్రి పేర్కొన్నారు.
Read Also: విజయవాడలో బాలిక ఆత్మహత్య కేసు… టీడీపీ నేత అరెస్ట్
]ఆ కుటుంబానికి ఆ లోటు ఎవ్వరూ తీర్చలేరని.. కేశినేని నానికి ముఖ్య అనుచరుడు, చంద్రబాబు కూడా వినోద్ జైన్ కోసం ప్రచారం చేశారని మంత్రి మండిపడ్డారు. చిన్నారులపై కీచకుడిలా మారాడని ఇలాంటి వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. చంద్రబాబు ఇలాంటీ నీచులను ప్రొత్సహించడం వల్లే ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నాయని ఆడవాళ్ల జోలికెళ్లాలంటే భయపడేలా శిక్షిస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు ఇలాంటి వాళ్లను ప్రొత్సహించకూడదన్నారు. ఒకే అపార్ట్మెంటులో ఉంటూ ఈ విధంగా చేసిన వినోద్ జైన్ లాంటి వాళ్లకు సంఘంలో ఉండే అర్హత లేదని వెల్లంపల్లి తీవ్రంగా విమర్శించారు.