Amit Shah and Junior NTR: అమిత్షా, ఎన్టీఆర్ భేటీలో జరిగిన చర్చ ఇదే.. బయటపెట్టిన కిషన్రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్తో సమావేశం కావడం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చర్చకు దారితీసింది.. ఎన్టీఆర్ను స్వయంగా అమిత్షానే ఆహ్వానంచడంతో ఏం జరుగుతోంది? ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ రాజకీయాల్లో కీలక భూమిక పోషించబోతున్నారా? ఇలా అనేక రకాల చర్చకు దారితీసింది.. మునుగోడు బహిరంగ సభలో పాల్గొన్న అమిత్షా.. ఆ తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలోని నోవాటెల్కు చేరుకున్న తర్వాత.. ఎన్టీఆర్ ఆయనతో సమావేశం అయ్యారు.. దాదాపు అరగంట పాటు ఇద్దరి మధ్య చర్చలు సాగాయి.. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన అమిత్షా.. అందులో ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉందని.. అభినందించేందుకే పిలిచారానే ప్రచారం సాగింది.. కానీ, పొలిటికల్ సర్కిల్లో దీనిపై అనేక రకాలుగా చర్చ సాగుతోంది. అయితే, అమిత్షా-ఎన్టీఆర్ భేటీకి సంబంధించిన అసలు విషయాలను బయటపెట్టారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి..
Read Also: VishnuVardhan Reddy:అమిత్ షా-జూ.ఎన్టీఆర్ భేటీ ఆహ్వానించదగింది
Also Read
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
- Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
- YS Jagan: 'సీఎంగా ఏం చేస్తున్నా' అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
- YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
ఏపీలో పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.. మీడియాతో మాట్లాడుతోన్న సమయంలో.. అమిత్ షా, ఎన్టీఆర్ సమావేశంపై ప్రశ్నించారు మీడియా ప్రతినిధులు.. దానికి ఆయన సమాధానం ఇస్తూ.. ఇద్దరి భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు.. రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని సమావేశం అదన్న ఆయన.. సినిమాలకు సంబంధించిన చర్చ మాత్రమే జరిగిందన్నారు. ఈ సమావేశంలో.. సీనియర్ ఎన్టీఆర్ గురించి అమిత్ షా ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారని వెల్లడించారు కిషన్ రెడ్డి.. ఇక, జూనియర్ ఎన్టీఆర్తో కలిసి డిన్నర్ మీట్ అవ్వాలని అమిత్ షా కోరారని స్పష్టం చేశారు. మరోవైపు, వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యల గురుంచి స్పందించడానికి నిరాకరించారు కిషన్రెడ్డి.
కాగా, అమిత్ షా, ఎన్టీఆర్ సమావేశంపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఉపయోగం లేకుండా ఎవరితో నిమిషం కూడా మాట్లాడరని వ్యాఖ్యానించిన ఆయన.. బీజేపీని విస్తరించేందుకే జూనియర్ ఎన్టీఆర్తో అమిత్ షా భేటీ అయ్యారని.. ఎన్టీఆర్ మద్దతుతో బీజేపీని బలపర్చుకోవడానికి షా ప్రయత్నిస్తున్నారని తాను భావిస్తున్నట్టుగా.. తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేశారు.. ఇక, జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్.. దీంతో, దేశవ్యాప్తంగా ప్రచారం చేయించుకునే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.. ఇదే సమయంలో.. చంద్రబాబును కూడా మధ్యలోకి లాగారు కొడాలి.. చంద్రబాబుతో ప్రయోజనం లేకపోవడంతోనే నరేంద్ర మోడీ, అమిత్ షాలు అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు కొడాలి నాని.
తాజావార్తలు
-
UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
-
Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
-
Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
-
Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
-
Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..