Undavalli Arun Kumar: సినిమా ఇండస్ట్రీ నిజంగా పిచ్చుకే.. కానీ చిరంజీవి పిచ్చుక కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Undavalli Arun Kumar Interesting Comments On Chiranjeevi And Polavaram Projects: ఇటీవల ‘వాల్తేరు వీరయ్య’ 200 రోజుల దినోత్సవ వేడుకల సమయంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సమర్థించారు. చిరు చెప్పినట్లు సినీ పరిశ్రమ నిజంగా పిచ్చుకే కానీ.. చిరంజీవి మాత్రం కాదన్నారు. ఎందుకంటే.. రాష్ట్ర విభజన సమయంలో ఆయన కేంద్రమంత్రిగా పార్లమెంట్లో గట్టిగా మాట్లాడారని గుర్తు చేశారు. మంత్రిగా ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది అంత ఆషామాషీ విషయం కాదన్నారు. చిరంజీవి మాట్లాడటం వల్లే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా వచ్చిందన్నారు. అలాంటి వ్యక్తి ప్రత్యేక హోదాపై పోరాడమని మంత్రులకు సలహా ఇవ్వడంలో ఏమాత్రం తప్పు లేదని చెప్పుకొచ్చారు. రాజమండ్రిలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Sanjay Raut: అప్పుడు బీజేపీ తిరస్కరించినందుకే షిండేను సీఎం చేయలేదు..
Also Read
- 'Thara' Mantra: సైబర్ దొంగల వేటలో ‘టాలీవుడ్ తారలు’.. వైజాగ్ పోలీసుల ‘తార’ మంత్రం మామూలుగా లేదుగా!
- AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 1వ తేదీ ఉదయం నుంచే ప్రారంభం..
- CM Chandrababu: చిట్చాట్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
- Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
ఉండవల్లి ఇంకా మాట్లాడుతూ.. ఆంధ్ర కంటే తెలంగాణ ఈ ఏడాది ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల ద్వారానే ఇది సాధ్యమైందన్నారు. వాస్తవానికి టీడీపీ హాయంలో కంటే వైసీపీ హాయంలోనే 18 శాతం అదనంగా ఆహార ధాన్యాల ఉత్పత్తులు పెరిగాయన్నారు. పత్రికను, ఛానల్స్ను అడ్డు పెట్టుకుని రామోజీరావు అక్రమాలు, అవకతవకాలు పాల్పడ్డారని ఆరోపించారు. విదేశాలకు కళాంజలి కళకృతులు అని కేంద్ర ప్రభుత్వ చర్యలను పత్రికలో రాసినందుకు సీనియర్ పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్పై కేసు పెట్టారన్నారు. ఈ కేసులో రామోజీరావుపై పోరాడలేక ఏబీకే ఫైన్ కట్టి బయటపడ్డారని చెప్పారు. డబ్బున్న వారికే కోర్టులో న్యాయం జరుగుతుందన్నారు. లీగల్గా మార్పు అవసరమని సూచించారు. ప్రభుత్వం సహకరిస్తోంది కాబట్టి మార్గదర్శిపై పోరాటం చేస్తున్నానన్నారు. ఇక పోలవరం ప్రాజెక్ట్ ముందుకు కదలడం లేదని, ప్రభుత్వాలు మారిన ఈ ప్రాజెక్టు పూర్తి కాదని రుజువైందని అన్నారు. టీడీపీ, వైసీపీ కాకుండా వేరే ప్రభుత్వం రావాలన్నారు.
Rahul Gandhi: మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోడీ టార్గెట్గా రాహుల్ గాంధీ విమర్శలు
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..