Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anakapalli Death Mystery: అనకాపల్లి జిల్లాలో ఓ యువకుడి మృతి కేసు సంచలనంగా మారింది. ఎంతో ఆరోగ్యంగా ఉండి.. ఆకస్మికంగా అనారోగ్యానికి గురై మరణించిన తన కుమారుడి మృతిపై అనుమానం వ్యక్తం చేసిన తల్లి న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించడంతో, మూడు నెలల తర్వాత సమాధి నుంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే, అనకాపల్లి జిల్లా దిబ్బపాలెం సెజ్ కాలనీకి చెందిన షేక్ ఖాన్ (30) అనే యువకుడు చికెన్ దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అతను ఆకస్మికంగా అనారోగ్యానికి గురై మృతి చెందాడు. షేక్ ఖాన్ గుండెపోటుతో మరణించినట్లు అతని భార్య కుటుంబ సభ్యులకు తెలియజేసింది. అనంతరం కుటుంబ సభ్యులు మృతదేహాన్ని దిబ్బపాలెం సెజ్ కాలనీలో ఖననం చేశారు.
అయితే కుమారుడి మృతిని జీర్ణించుకోలేకపోయిన తల్లి సైదుబేబీకి ఈ ఘటనపై అనుమానాలు కలిగాయి. తన కుమారుడి మరణం వెనుక ఏదో జరిగి ఉండొచ్చని భావించిన ఆమె ఈ నెల 27న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుమారుడి మృతిపై సమగ్ర దర్యాప్తు చేసి నిజాలు వెలికితీయాలని కోరారు. తల్లి ఫిర్యాదును సీరియస్గా తీసుకున్న పోలీసులు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చర్యలు ప్రారంభించారు. ఖననం చేసిన షేక్ ఖాన్ మృతదేహాన్ని సమాధి నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వైద్య నిపుణుల సమక్షంలో మృతదేహం నుంచి అవసరమైన నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు.
Also Read
- Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
- Karnataka: కన్న కూతురుపై తండ్రి పగ.. కాలేజీకెళ్లి కత్తి దాడి.. దేనికోసమో తెలిస్తే..!
- Bihar Crime: బట్టలూడదీసి.. నగ్నంగా...! భర్తను లవర్తో కలిసి కడతేర్చిన భార్య ఎపిసోడ్లో ట్విస్ట్
- Bihar: భోజనం ఆలస్యమైందని.. వదిన తల నరికి, ఇంటి ముందు వేలాడదీసిన వ్యక్తి..
మృతదేహం నుంచి సేకరించిన నమూనాల నివేదికలు వచ్చిన తర్వాత మరణానికి గల అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసును అన్ని కోణాల్లో పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మూడు నెలల తర్వాత సమాధి నుంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తల్లి చేసిన ఫిర్యాదుతో కొత్త మలుపు తిరిగిన ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారనుంది.
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!