Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anakapalli Death Mystery: అనకాపల్లి జిల్లాలో ఓ యువకుడి మృతి కేసు సంచలనంగా మారింది. ఎంతో ఆరోగ్యంగా ఉండి.. ఆకస్మికంగా అనారోగ్యానికి గురై మరణించిన తన కుమారుడి మృతిపై అనుమానం వ్యక్తం చేసిన తల్లి న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించడంతో, మూడు నెలల తర్వాత సమాధి నుంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే, అనకాపల్లి జిల్లా దిబ్బపాలెం సెజ్ కాలనీకి చెందిన షేక్ ఖాన్ (30) అనే యువకుడు చికెన్ దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అతను ఆకస్మికంగా అనారోగ్యానికి గురై మృతి చెందాడు. షేక్ ఖాన్ గుండెపోటుతో మరణించినట్లు అతని భార్య కుటుంబ సభ్యులకు తెలియజేసింది. అనంతరం కుటుంబ సభ్యులు మృతదేహాన్ని దిబ్బపాలెం సెజ్ కాలనీలో ఖననం చేశారు.
అయితే కుమారుడి మృతిని జీర్ణించుకోలేకపోయిన తల్లి సైదుబేబీకి ఈ ఘటనపై అనుమానాలు కలిగాయి. తన కుమారుడి మరణం వెనుక ఏదో జరిగి ఉండొచ్చని భావించిన ఆమె ఈ నెల 27న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుమారుడి మృతిపై సమగ్ర దర్యాప్తు చేసి నిజాలు వెలికితీయాలని కోరారు. తల్లి ఫిర్యాదును సీరియస్గా తీసుకున్న పోలీసులు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చర్యలు ప్రారంభించారు. ఖననం చేసిన షేక్ ఖాన్ మృతదేహాన్ని సమాధి నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వైద్య నిపుణుల సమక్షంలో మృతదేహం నుంచి అవసరమైన నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు.
Also Read
- Wife Kills Husband: ఇన్స్ట్రాగ్రామ్ ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య..
- Vijayawada: రౌడీషీటర్ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన సెల్ఫీ వీడియో
- Black Magic: చేతబడి అనుమానం.. పనిమనిషిని దారుణంగా చంపిన డాక్టర్..
- Dowry Harassment: తల్లికి ఫోన్.. తర్వాత గదిలో ఉరి.. పెళ్లయిన 45రోజులకే భార్య ఆత్మహత్య!
మృతదేహం నుంచి సేకరించిన నమూనాల నివేదికలు వచ్చిన తర్వాత మరణానికి గల అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసును అన్ని కోణాల్లో పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మూడు నెలల తర్వాత సమాధి నుంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తల్లి చేసిన ఫిర్యాదుతో కొత్త మలుపు తిరిగిన ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారనుంది.
తాజావార్తలు
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
-
Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
-
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
ట్రెండింగ్
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!