CM Chandrababu: చిట్చాట్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన మహానాడు విజయవంతంగా ముగిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో మీడియాతో చిట్చాట్ సందర్భంగా ఆయన పలు రాజకీయ అంశాలపై స్పందించారు. ఈసారి నిర్వహించిన మహానాడుకు ప్రత్యక్షంగా, వర్చువల్గా భారీ స్థాయిలో స్పందన లభించిందని పేర్కొన్నారు. 24 లక్షల మందికిపైగా వర్చువల్గా మహానాడులో పాల్గొనడం విశేషమని చెప్పారు. పార్టీ కార్యకర్తలు, నాయకుల భాగస్వామ్యం మహానాడును విజయవంతం చేసిందన్నారు.
రాజకీయాలపై మాట్లాడిన చంద్రబాబు, నేర చరిత్ర ఉన్న వ్యక్తి రాష్ట్రాన్ని పాలించవచ్చని చెప్పేవారు, కానీ జిల్లాల్లో నాయకులు రాజకీయాలు చేయకూడదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదని స్పష్టం చేసిన ఆయన, నక్సలైట్లు తుపాకులతో రాజ్యాధికారం సాధించవచ్చని భావించారని, కానీ ఆ ఆలోచన విఫలమైందన్నారు. హింసే నక్సలిజం వైఫల్యానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. “గొడ్డలితో పరిపాలన సాగిస్తామంటే కుదరదు. ఇది ప్రజాస్వామ్యం” అని సీఎం వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టబద్ధమైన మార్గాల ద్వారానే ప్రజల మద్దతు పొందాలని సూచించారు.
Also Read
- AP Liquor Case: లిక్కర్ కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు.. కీలక వివరాలు వెల్లడి
- Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..
- Pawan Kalyan : పోలవరం అడవుల్లో పులి సంచారం.. అధికారులతో పవన్ అత్యవసర సమీక్ష.!
- Pawan Kalyan: గోదావరి పుష్కరాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కార్యాచరణ ప్రకటన..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నేపథ్యంలో కూడా చంద్రబాబు స్పందించారు. వివేకా ఆత్మశాంతి కోసం ఆయన కుమార్తె సునీత పోరాటం చేస్తున్నారని, ఆమె చేస్తున్న న్యాయపోరాటం వల్ల అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. తవ్వేకొద్దీ మరిన్ని అంశాలు బయటపడుతున్నాయని, ఇంకా ప్రజలు ఊహించని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘సైకో’ అనే పదం కంటే ‘గొడ్డలి పార్టీ’ అనే అంశాన్ని ప్రజలు ఎక్కువగా గుర్తిస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ అంశం ప్రజల్లోకి వెళ్తున్న కొద్దీ వైసీపీ అధినేత జగన్లో అసహనం, నిరాశ పెరుగుతోందని అన్నారు. దాదాపు 30 ఏళ్ల క్రితం కడప జిల్లాలో ప్రచురితమైన ‘పాలెగాళ్ల రాజ్యం’ పుస్తకాన్ని ఇప్పుడు చాలామంది చదువుతున్నారని, అందులో ప్రస్తావించిన విషయాలపై చర్చ జరుగుతోందని చెప్పారు.
వైఎస్ కుటుంబానికి సంబంధించిన అనేక విషయాలు తనకు కూడా తెలియవని, ఇప్పుడు అవి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి ధోరణులు ఉన్నవారు ఎలా సరిపోతారనే ప్రశ్న ప్రజల్లో తలెత్తుతోందన్నారు. మహిళా రిజర్వేషన్ల అంశంపై కూడా సీఎం స్పందించారు. 33 శాతం మహిళా రిజర్వేషన్ల ప్రకటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిందని చెప్పారు. భవిష్యత్తులో అన్ని రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేసే పరిస్థితి వస్తుందని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే మహిళలకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని, రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలని ఆకాంక్షించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
CM Chandrababu: చిట్చాట్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
-
Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
-
IPL 2026 Final: ఫైనల్ కు వర్షం గండం.. మరి రిజర్వ్ డే సంగతేంటి.?
-
Shubman Gill Vs Vaibhav Suryavanshi: గిల్ మ్యాచ్ గెలిచాడు.. మనస్సులను గెలిచింది మాత్రం వైభవ్ సూర్యవంశే..!
-
Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..