Tirumala Fraud: టీటీడీ విజిలెన్స్ ఉచ్చులో మరో అక్రమార్కుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏడుకొండలకు రోజూ వేలాదిమంది భక్తులు పోటెత్తుతుంటారు. తిరుమలలో స్వామి దర్శనం కోసం భక్తులు అక్రమార్కులను ఆశ్రయిస్తుంటారు. టీటీడీ విజిలెలెన్స్ వలలో మరో అక్రమార్కుడు చిక్కడం కలకలం రేపుతోంది. సిఫార్సు లేఖలపై పొందే విఐపి దర్శనాలను పెద్ద మొత్తంలో విక్రయిస్తూ పట్టుబడ్డాడు ఎండోమెంట్ సెల్ ఉద్యోగి శ్రీహరి. గతంలో మాజీ టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కార్యాలయంలో విధులు నిర్వర్తించాడు శ్రీహరి. అక్రమాలకు అలవాటుపడి…..ప్రధానమైన పోస్టులోనే ఉద్యోగం వుండేలా పైరవీలు సాగించాడు శ్రీహరి.
నందిగామ ఎమ్మెల్యే సిఫార్సు లేఖలపై పొందిన 6 వీఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్లను 18 వేల రూపాయలకు విక్రయించాడు టీటీడీ ఉద్యోగి శ్రీహరి. దీంతో రంగంలోకి దిగారు విజిలెన్స్ అధికారులు. అక్రమాలకు పాల్పడిన శ్రీహరిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు విజిలెన్స్ అధికారులు. శ్రీహరి బ్యాంక్ అకౌంట్లో భారీగా నగదు డిపాజిట్ అయినట్టు గుర్తించిన విజిలెన్స్ అధికారులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. ఎండోమెంట్ సెల్ ద్వారా కూడా దర్శన టికెట్లు పొంది అధిక ధరకు విక్రయించినట్లు భావిస్తున్నారు విజిలెన్స్ అధికారులు.
Also Read
- OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Nara Lokesh: బాధిత కుటుంబాలకు భరోసా.. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: మంత్రి నారా లోకేష్
- CGST Superintendent: రూ.50 వేలు లంచం.. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ సీజీఎస్టీ (CGST) సూపరింటెండెంట్..
Read Also: Singareni: సింగరేణి ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి క్లారిటీ..
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. మాజీ మంత్రులు పేర్ని నాని,సిద్ధారాఘవరావు, సినీనటి ప్రణీత వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న వీరికి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుమల కొండపై ఒక కంపార్ట్మెంట్లో వేచివున్నారు భక్తులు, టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 64,163 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తులు 23,709 మంది వున్నారు. మంగళవారం హుండీ ఆదాయం రూ.5.38 కోట్లుగా నమోదైంది.
ఇదిలా ఉంటే.. నకిలి సుప్రభాత సేవా టిక్కెట్లతో దర్శనానికి వెళుతున్న ఘటనలు ఎక్కువయిపోయాయి. తాజాగా ఇలాంటి ఘటనలు గుర్తించింది విజిలెన్స్. నిన్న 21 మంది భక్తులు నకిలీ టికెట్ల పై దర్శనానికి వెళుతుండగా గుర్తించింది విజిలెన్స్. ఇవాళ ఇద్దరు భక్తులు కూడా నకిలీ టిక్కెట్లు పై సుప్రభాత సేవకు వెళుతుండగా గుర్తించిన విజిలెన్స్ దీనిపై ఆరా తీస్తోంది. సేలం కేంద్రంగా నకీలి టిక్కెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించారు విజిలెన్స్ అధికారులు. దర్యాప్తు కోసం సేలంకు ప్రత్యేక బృందాన్ని పంపించింది టీటీడీ విజిలెన్స్.
Read Also: Pawan Kalyan: ఎన్నికల ప్రచార యుద్ధానికి పవన్ వాహనం సిద్ధం
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!