Gold: పడిపోయిన బంగారం వినియోగం.. కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Consumption Drops : మన దేశంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది.. ఏ శుభకార్యం జరిగినా.. బంగారం కొనసాల్సిందే.. వివాహాది శుభకార్యాలు, పండగలకు ఇక చెప్పాల్సిన అవసరమే లేదు.. ఎవరి ఆర్థిక పరిస్థితికి తగ్గట్టుంగా వారి పసిడి కొనుగోలు చేస్తుంటారు.. అయితే, ఈ మధ్య బంగారం ధరలు అమాంతం పెరిగిపోతూనే ఉన్నాయి.. ఇది బంగారం వినియోగంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి… 2022లో భారతదేశం యొక్క బంగారం వినియోగం అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 3 శాతం పడిపోయింది, ఎందుకంటే డిసెంబర్ త్రైమాసికంలో స్థానిక ధరలు దాదాపు రికార్డు స్థాయికి చేరుకోవడం వల్ల పసిడికి డిమాండ్ తగ్గిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) మంగళవారం ప్రకటించింది.. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద బంగారం కొనుగోలుదారుగా ఉన్న భారత్లో తక్కువ వినియోగం ప్రపంచ ధరలపై ప్రభావం చూపుతుంది, అయితే భారతదేశం యొక్క వాణిజ్య లోటును తగ్గించడంలో ఇది సహాయపడుతుంది మరియు రూపాయి బలపడేందుకు మద్దతు ఇస్తుందని అంచనా వేస్తున్నారు..
Read Also: WhatsApp stop working: అలర్ట్.. రేపటి నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. చెక్ చేసుకోండి..
Also Read
- Stock Market: ట్రంప్ దెబ్బ.. స్టాక్ మార్కెట్లో బ్లడ్బాత్
- EPFO EPF Interest: పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. జూలై 15 నాటికి వడ్డీ జమ.. రూ.1.44 లక్షల కోట్లు క్రెడిట్!
- Stock Market Crash: రక్తసిక్తమైన దలాల్ స్ట్రీట్.. స్టాక్ మార్కెట్లో నిమిషాల్లోనే తుడిచిపెట్టుకుపోయిన వేల కోట్లు!
- Crude Oil: ఇరాన్పై అమెరికా వార్.. చమురు ధరలు క్రాష్! భారత్లో లీటర్ పెట్రోల్ రేట్ ఎంతంటే?
2022 డిసెంబర్ త్రైమాసికంలో పసిడి డిమాండ్ 20 శాతం తగ్గి 276.1 టన్నులకు చేరుకోవడంతో గతేడాది భారత్లో బంగారం వినియోగం 774 టన్నులకు తగ్గిందని డబ్ల్యూజీసీ ఒక నివేదికలో పేర్కొంది. మార్చి 2023 త్రైమాసికంలో, వేసవిలో విత్తిన పంటల ధరలు పెరగడం మరియు వివాహాలకు ఎక్కువ శుభ దినాల మధ్య గ్రామీణ డిమాండ్ పెరగడం వల్ల బంగారం వినియోగం మెరుగుపడుతుందని కౌన్సిల్ తెలిపింది. భారతదేశంలో మూడింట రెండు వంతుల బంగారం డిమాండ్ సాధారణంగా గ్రామీణ ప్రాంతాల నుండి వస్తుంది. దేశంలో వధువు కట్నంలో బంగారం ఒక ముఖ్యమైన భాగం.. అంతే కాదు వివాహాలలో కుటుంబ సభ్యులు మరియు అతిథుల నుండి కూడా పసిడి బహుమతిగా ఇస్తుంటారు.. అయితే దేశీయంగా బంగారం ధరలు పెరగడం, గ్రామీణ ద్రవ్యోల్బణం ఎదురుగాలిని ఎదుర్కొంటున్న సమయంలో పసిడికి డిమాండ్ తగ్గిందని డబ్ల్యూజీసీ తెలిపింది. స్థానిక బంగారం ధరలు జనవరిలో 10 గ్రాములకు 57,149 రూపాయలు ($699.63) ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. బంగారం ధరల పెరుగుదల కొంతమంది పెట్టుబడిదారులను బంగారాన్ని విక్రయించడానికి ప్రేరేపించింది, అయితే, కొంతమంది వినియోగదారులు పాత బంగారు ఆభరణాలను కొత్త వాటితో మార్చుకున్నారు, ఇది 2022లో భారతదేశంలో బంగారం రీసైక్లింగ్ను 30 శాతం పెరిగి 97.6 టన్నులకు పెంచిందని డబ్ల్యూజీసీ నివేదక పేర్కొంది.
తాజావార్తలు
-
Bengaluru: రోడ్డుపై నాగుపాము, ట్రాఫిక్ జామ్.. బెంగళూర్ వీడియో వైరల్..
-
Tilak Varma: తిలక్ వర్మకు షాక్.. సంజూ శాంసన్కు గుడ్ న్యూస్..?
-
Swathi: తన సినిమా దర్శకుడిని సైలెంటుగా రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్
-
Tamil Nadu: మతం మారినా రిజర్వేషన్లు ఇవ్వాలి.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్..
-
NATO: ఇరాన్పై దాడులు సమర్థనీయమే.. ట్రంప్కు నాటో చీఫ్ మార్క్ రుట్టే మద్దతు
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..