Gold: పడిపోయిన బంగారం వినియోగం.. కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Consumption Drops : మన దేశంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది.. ఏ శుభకార్యం జరిగినా.. బంగారం కొనసాల్సిందే.. వివాహాది శుభకార్యాలు, పండగలకు ఇక చెప్పాల్సిన అవసరమే లేదు.. ఎవరి ఆర్థిక పరిస్థితికి తగ్గట్టుంగా వారి పసిడి కొనుగోలు చేస్తుంటారు.. అయితే, ఈ మధ్య బంగారం ధరలు అమాంతం పెరిగిపోతూనే ఉన్నాయి.. ఇది బంగారం వినియోగంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి… 2022లో భారతదేశం యొక్క బంగారం వినియోగం అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 3 శాతం పడిపోయింది, ఎందుకంటే డిసెంబర్ త్రైమాసికంలో స్థానిక ధరలు దాదాపు రికార్డు స్థాయికి చేరుకోవడం వల్ల పసిడికి డిమాండ్ తగ్గిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) మంగళవారం ప్రకటించింది.. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద బంగారం కొనుగోలుదారుగా ఉన్న భారత్లో తక్కువ వినియోగం ప్రపంచ ధరలపై ప్రభావం చూపుతుంది, అయితే భారతదేశం యొక్క వాణిజ్య లోటును తగ్గించడంలో ఇది సహాయపడుతుంది మరియు రూపాయి బలపడేందుకు మద్దతు ఇస్తుందని అంచనా వేస్తున్నారు..
Read Also: WhatsApp stop working: అలర్ట్.. రేపటి నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. చెక్ చేసుకోండి..
Also Read
- CNG Price Hike: సామాన్యుడిపై ఇంధన భారం.. మరోసారి సీఎన్జీ ధరల పెంపు..
- Zepto: దలాల్ స్ట్రీట్లో క్విక్ కామర్స్ జాతర.. రూ.11 వేల కోట్ల ఐపీఓకు జెప్టో రెడీ!
- Life Insurance Mistakes: లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ 5 తప్పులు చేయకండి!
- Nifty 50: రికవరీ దిశలో స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ 25,000 మార్క్ను దాటుతుందా..?
2022 డిసెంబర్ త్రైమాసికంలో పసిడి డిమాండ్ 20 శాతం తగ్గి 276.1 టన్నులకు చేరుకోవడంతో గతేడాది భారత్లో బంగారం వినియోగం 774 టన్నులకు తగ్గిందని డబ్ల్యూజీసీ ఒక నివేదికలో పేర్కొంది. మార్చి 2023 త్రైమాసికంలో, వేసవిలో విత్తిన పంటల ధరలు పెరగడం మరియు వివాహాలకు ఎక్కువ శుభ దినాల మధ్య గ్రామీణ డిమాండ్ పెరగడం వల్ల బంగారం వినియోగం మెరుగుపడుతుందని కౌన్సిల్ తెలిపింది. భారతదేశంలో మూడింట రెండు వంతుల బంగారం డిమాండ్ సాధారణంగా గ్రామీణ ప్రాంతాల నుండి వస్తుంది. దేశంలో వధువు కట్నంలో బంగారం ఒక ముఖ్యమైన భాగం.. అంతే కాదు వివాహాలలో కుటుంబ సభ్యులు మరియు అతిథుల నుండి కూడా పసిడి బహుమతిగా ఇస్తుంటారు.. అయితే దేశీయంగా బంగారం ధరలు పెరగడం, గ్రామీణ ద్రవ్యోల్బణం ఎదురుగాలిని ఎదుర్కొంటున్న సమయంలో పసిడికి డిమాండ్ తగ్గిందని డబ్ల్యూజీసీ తెలిపింది. స్థానిక బంగారం ధరలు జనవరిలో 10 గ్రాములకు 57,149 రూపాయలు ($699.63) ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. బంగారం ధరల పెరుగుదల కొంతమంది పెట్టుబడిదారులను బంగారాన్ని విక్రయించడానికి ప్రేరేపించింది, అయితే, కొంతమంది వినియోగదారులు పాత బంగారు ఆభరణాలను కొత్త వాటితో మార్చుకున్నారు, ఇది 2022లో భారతదేశంలో బంగారం రీసైక్లింగ్ను 30 శాతం పెరిగి 97.6 టన్నులకు పెంచిందని డబ్ల్యూజీసీ నివేదక పేర్కొంది.
తాజావార్తలు
-
Meenakshi Seshadri: ‘ఏ పాత్రైనా ఓకే.. ఒక్క ఛన్స్ ఇవ్వండి..‘ఆపద్బాంధవుడు’ హీరోయిన్ ఎమోషనల్ వీడియో!
-
Quad Meeting: భారత్ అధ్యక్షతన క్వాడ్ సమావేశం.. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు నాలుగు దేశాల ఐక్యం.!
-
Eggs in Summer: వేసవిలో గుడ్లు తింటున్నారా..? ఈ సమస్యలు తప్పవు..!
-
Rohit Sharma: రోహిత్ శర్మకి పద్మశ్రీ ప్రకటించిన కేంద్రం.. మే 25న ఆ అవార్డును ఎందుకు అందుకోలేదు?
-
IPL 2026 Best Playing 11: ఐపీఎల్ 2026 బెస్ట్ ప్లేయింగ్ 11.. ‘కింగ్’కు చోటే లేదు, జట్టులో ఊహించని పేర్లు!
ట్రెండింగ్
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!