Bus Charges: చార్జీలు పెంచండి.. ఏపీఎస్ ఆర్టీసీకి టీఎస్ ఆర్టీసీ రిక్వెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గాడిలో పెట్టి.. లాభాల బాట పట్టించేందుకు టీఎస్ ఆర్టీసీ తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది… వినూత్న తరహాలో కొత్త పథకాలకు శ్రీకారం చుడుతూనే.. మరోవైపు పెరిగిన డీజిల్ ధరలకు అనుగుణంగా సంస్థపై భారం పడకుండా చార్జీలను కూడా వడ్డిస్తోంది.. అయితే, ఇది ఏపీఎస్ ఆర్టీసీకి కలిసివచ్చినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.. టీఎస్ ఆర్టీసీ సర్వీసుల్లో చార్జీలు పెరడంతో.. ప్రయాణికులు క్రమంగా ఏపీ ఆర్టీసీ సర్వీసులను ఆశ్రయిస్తున్నారట.. దీంతో, ఏపీ-తెలంగాణ మధ్య తిరిగే సర్వీసుల్లో చార్జీలు పెంచాలని ఏపీఎస్ ఆర్టీసీని కోరింది టీఎస్ ఆర్టీసీ.. తెలంగాణలో ఆర్టీసీ రెండోసారి పెంచిన చార్జీలతో ఏపీ, తెలంగాణ మధ్య తిరిగే బస్సు సర్వీసు టికెట్ల రేట్లలో తేడా వచ్చింది.. అయితే, రెండు రాష్ట్రాల రవాణా సంస్థల మధ్య జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య నడిపే సర్వీసుల్లో ఒకే విధమైన చార్జీలుండాలి.. దానికి అనుగుణంగా చార్జీలు పెంచాలని ఏపీఎస్ ఆర్టీసీని కోరింది టీఎస్ ఆర్టీసీ.
Read Also: COVID-19: మళ్లీ పెరుగుతోన్న కేసులు.. ఫోర్త్ వేవ్ తప్పదా..?
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
- Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
కాగా, ఈ మధ్య ఏపీఎస్ ఆర్టీసీకి దూరప్రాంత సర్వీసులు లాభాలు తెచ్చిపెడుతున్నాయి.. తెలంగాణకు వెళ్లే దూర ప్రాంత సర్వీసులు ముఖ్యంగా హైదరాబాద్ సిటీ రూట్లో ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోయిందట.. టీఎస్ ఆర్టీసీ డీజిల్ సెస్ పెంపు.. ఏపీఎస్ ఆర్టీసీ ఆదాయం పెరిగేందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.. నాలుగైదు రోజుల్లోనే అత్యధిక ఓఆర్ తో ఏపీఎస్ ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరినట్టు గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో చార్జీలు పెరగడంతో.. ఆ రాష్ట్రానికి చెందిన ప్రయాణికులు సైతం ఏపీ ఆర్టీసీ బస్సుల ఆశ్రయించడంతో.. ఆ సంస్థపై సిరులు కురిపిస్తోంది.. ఇక రిజర్వేషన్ సమస్యలు కూడా తలెత్తకుండా అధికారులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ నెల 9న టీఎస్ ఆర్టీసీ రెండోసారి భారీగా డీజిల్ సెస్ పెంచింది.. పల్లెవెలుగు సర్వీసుల నుంచి ఏసీ బస్సుల వరకు కిలో మీటర్ల వారీగా రూ.5 నుంచి రూ.170 వరకు పెంచేసింది.. దీంతో రెండు రాష్ట్రాల బస్సుల మధ్య చార్జీల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది.. ఇదే ఏపీ బస్సుల వైపు ప్రజలు మొగ్గు చూపడానికి ప్రధాన కారణంగా మారింది. ఇది గమనించిన టీఎస్ ఆర్టీసీ.. అంతరాష్ట్ర ఒప్పందాల ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య తిరిగే సర్వీసుల్లో చార్జీలు పెంచాలని కోరింది.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!