COVID-19: మళ్లీ పెరుగుతోన్న కేసులు.. ఫోర్త్ వేవ్ తప్పదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి భారత్లో మరోసారి విజృంభిస్తోంది.. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ రూపంలో.. వివిధ వేరియంట్లుగా ప్రజలపై దాడి చేసిన మహమ్మారి.. మరోసారి పంజా విసిరుతోంది.. గత కొంతకాలంగా వెలుగు చూస్తోన్న రోజువారి పాజిటివ్ కేసులను పరిశీలిస్తే మళ్లీ టెన్షన్ మొదలైనట్టే కనిపిస్తోంది. థర్డ్ వేవ్ తర్వాత వందలకు పరిమితమైన కేసులు.. ఇప్పుడు మళ్లీ వేలను దాటేశాయి.. 10 వేల వైపు పరుగులు పెడుతోంది కరోనా రోజువారి కేసుల సంఖ్య.. దీంతో కరోనా ఫోర్త్ వేవ్ తప్పదా? ఇప్పటికే భారత్లోని వివిధ రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో ఫోర్త్ వేవ్ మొదలైందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Read Also: Rains in Telangana: అలర్ట్.. మరో మూడు రోజులు భారీ వర్షాలు
Also Read
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
తాజాగా వెలుగుచూస్తోన్న కేసులను పరిశీలిస్తే.. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్ణాటక తదితరల రాష్ట్రాల్లో ఒక్కసారిగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. ఈ పరిస్థితులను గమనిస్తే కోవిడ్ ఫోర్త్వేవ్లోకి అడుగుపెట్టినట్టుగానే భావించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు వైద్యనిపుణులు. ఇక, గత 10-15 రోజులుగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది నరేంద్ర మోడీ సర్కార్.. టెస్టింగ్, ట్రేసిండ్, ట్రీట్మెంట్ కొనసాగించాలని.. టెస్టులు పెంచడంతో పాటు ఇన్ఫ్లుయెంజా వంటి అనారోగ్యాలపై పర్యవేక్షణ పెంచాలని, తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లపై అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. వర్షాకాలం మొదలవుతున్నందున.. సీజనల్ ఏది..? వైరస్ ఏది..? అనే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.
కరోనా థర్డ్వేవ్ సమయంలో బాధితుల్లో కనిపించిన స్వల్పలక్షణాలతో పారాసిటమాల్, దగ్గుమందులతోనే కొన్ని ప్రస్తుత కేసులు తగ్గిపోతుండగా.. ఒకటి, రెండు కేసులు సెకండ్ వేవ్లో మాదిరిగా ఊపిరితిత్తులపై కూడా ప్రభావాన్ని చూపుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక, మళ్లీ కరోనా కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కారణంగా పేర్కొన్నారు.. బీఏ.2 సబ్వేరియెంట్ కారణమని దాదాపు అన్ని శాంపిళ్ల సీక్వెన్సింగ్ను బట్టి స్పష్టమతుందని.. దీంతోపాటు మరో సబ్ వేరియెంట్ బీఏ.2.12.1 కూడా యూఎస్లో బయటపడిందని గుర్తుచేస్తున్నారు.. గతంలోని ఒమిక్రాన్ సబ్వేరియెంట్ల కంటే కూడా ఇది 25 శాతం ఎక్కువ ఇన్ఫెక్షన్కు గురిచేస్తుందని.. గతంలో ఒమిక్రాన్తో కోవిడ్ ఇన్ఫెక్షన్ బారినపడినవారు ఈ సబ్వేరియెంట్తో మరోసారి ఇన్ఫెక్షన్ బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. అయితే, ప్రస్తుతం కేసుల పెరుగుదలతో కరోనా ఫోర్త్ వేవ్ మొదలైనట్టు కాదని కూడా వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!