COVID-19: మళ్లీ పెరుగుతోన్న కేసులు.. ఫోర్త్ వేవ్ తప్పదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి భారత్లో మరోసారి విజృంభిస్తోంది.. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ రూపంలో.. వివిధ వేరియంట్లుగా ప్రజలపై దాడి చేసిన మహమ్మారి.. మరోసారి పంజా విసిరుతోంది.. గత కొంతకాలంగా వెలుగు చూస్తోన్న రోజువారి పాజిటివ్ కేసులను పరిశీలిస్తే మళ్లీ టెన్షన్ మొదలైనట్టే కనిపిస్తోంది. థర్డ్ వేవ్ తర్వాత వందలకు పరిమితమైన కేసులు.. ఇప్పుడు మళ్లీ వేలను దాటేశాయి.. 10 వేల వైపు పరుగులు పెడుతోంది కరోనా రోజువారి కేసుల సంఖ్య.. దీంతో కరోనా ఫోర్త్ వేవ్ తప్పదా? ఇప్పటికే భారత్లోని వివిధ రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో ఫోర్త్ వేవ్ మొదలైందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Read Also: Rains in Telangana: అలర్ట్.. మరో మూడు రోజులు భారీ వర్షాలు
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
తాజాగా వెలుగుచూస్తోన్న కేసులను పరిశీలిస్తే.. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్ణాటక తదితరల రాష్ట్రాల్లో ఒక్కసారిగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. ఈ పరిస్థితులను గమనిస్తే కోవిడ్ ఫోర్త్వేవ్లోకి అడుగుపెట్టినట్టుగానే భావించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు వైద్యనిపుణులు. ఇక, గత 10-15 రోజులుగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది నరేంద్ర మోడీ సర్కార్.. టెస్టింగ్, ట్రేసిండ్, ట్రీట్మెంట్ కొనసాగించాలని.. టెస్టులు పెంచడంతో పాటు ఇన్ఫ్లుయెంజా వంటి అనారోగ్యాలపై పర్యవేక్షణ పెంచాలని, తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లపై అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. వర్షాకాలం మొదలవుతున్నందున.. సీజనల్ ఏది..? వైరస్ ఏది..? అనే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.
కరోనా థర్డ్వేవ్ సమయంలో బాధితుల్లో కనిపించిన స్వల్పలక్షణాలతో పారాసిటమాల్, దగ్గుమందులతోనే కొన్ని ప్రస్తుత కేసులు తగ్గిపోతుండగా.. ఒకటి, రెండు కేసులు సెకండ్ వేవ్లో మాదిరిగా ఊపిరితిత్తులపై కూడా ప్రభావాన్ని చూపుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక, మళ్లీ కరోనా కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కారణంగా పేర్కొన్నారు.. బీఏ.2 సబ్వేరియెంట్ కారణమని దాదాపు అన్ని శాంపిళ్ల సీక్వెన్సింగ్ను బట్టి స్పష్టమతుందని.. దీంతోపాటు మరో సబ్ వేరియెంట్ బీఏ.2.12.1 కూడా యూఎస్లో బయటపడిందని గుర్తుచేస్తున్నారు.. గతంలోని ఒమిక్రాన్ సబ్వేరియెంట్ల కంటే కూడా ఇది 25 శాతం ఎక్కువ ఇన్ఫెక్షన్కు గురిచేస్తుందని.. గతంలో ఒమిక్రాన్తో కోవిడ్ ఇన్ఫెక్షన్ బారినపడినవారు ఈ సబ్వేరియెంట్తో మరోసారి ఇన్ఫెక్షన్ బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. అయితే, ప్రస్తుతం కేసుల పెరుగుదలతో కరోనా ఫోర్త్ వేవ్ మొదలైనట్టు కాదని కూడా వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!