TTD Vaikunta Ekadasi 2025 Tickets: వైకుంఠ ద్వార దర్శనం టికెట్లకు ఫుల్ డిమాండ్.. నిమిషాల్లోనే కోటా పూర్తి..
- శ్రీవారి వైకుంఠద్వార దర్శనం టికెట్లకు ఫుల్ డిమాండ్..
- ఆన్ లైన్ లో విడుదల చేసిన నిమిషాల వ్యవధిలోనే టికెట్లు బుకింగ్ పూర్తి..
- 1,40,000 టికెట్లను 18 నిమిషాల వ్యవధిలోనే కొనుగోలు చేసిన భక్తులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD Vaikunta Ekadasi 2025 Tickets: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు తరలివస్తు ఉంటారు. శ్రీవారి ఆలయంలో ఏడాదికి పది రోజులపాటు మాత్రమే భక్తులను అనుమతించే వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రతి హిందూ భక్తుడు పరితపిస్తూ ఉంటారు. దీనితో వైకుంఠ ద్వార దర్శనానికి డిమాండ్ ఎప్పటికప్పుడు పెరిగిపోతూ వస్తూ ఉంది. ఈ ఏడాది కూడా టికెట్లు కలిగిన భక్తులను మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించాలని నిర్ణయించింది టీటీడీ. గత ఏడాది తరహలోనే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టికెట్లను ముందస్తుగానే కేటాయించేలా ఏర్పాటు చేస్తుంది టీటీడీ.. ఆన్లైన్ సంబంధించిన టికెట్లను 23 ,24వ తేదీలలో విడుదల చేయగా ఆఫ్లైన్కు సంబంధించిన టికెట్లను జనవరి ఎనిమిదో తేదీ రాత్రి నుంచి విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ. 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లను రోజుకు 18 వందల చొప్పున 10 రోజులకు సంబంధించి 18 వేల టికెట్లను విడుదల చేయగా.. పదివేల 500 విలువచేసే శ్రీవాణి టికెట్లను భక్తులు గంటన్నర సమయంలోనే కొనుగోలు చేసేశారు. ఇక, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి పది రోజులకు సంబంధించి 1,40,000 టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయగా కేవలం 18 నిమిషాల వ్యవధిలోనే భక్తులు వాటిని కొనుగోలు చేసేశారు. లక్షా 40 వేల టికెట్ల కోసం టీటీడీ వెబ్ సైట్ కి 14 లక్షల హిట్లు వచ్చాయంటేనే అర్థం చేసుకోవచ్చు.. స్వామివారి దర్శన టికెట్లకు ఉన్న డిమాండ్. కోటా ముగిసిన భక్తులు టిక్కెట్లు కోసం ప్రయత్నిస్తూనే వున్నారు.
Read Also: Pushpa 2: బాలీవుడ్ స్టార్ హీరోలకు బిగ్ టార్గెట్ ఇచ్చిన పుష్పరాజ్!
Also Read
ఇక, సర్వదర్శనం భక్తులకు సంబంధించి ప్రతినిత్యం 40,000 చొప్పున 10 రోజులకు సంబంధించి నాలుగు లక్షల టికెట్లను ఆఫ్ లైన్ విధానంలో జారీ చేసేలా టీటీడీ ఏర్పాటు చేస్తుంది. 8వ తేదీ రాత్రి ముందుగా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, ఆ తర్వాత రోజులకు సంబంధించిన టికెట్లను 1,20,000 టికెట్లను తిరుపతిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ.. తిరుపతిలోని ఎనిమిది ప్రాంతాలతో పాటు తిరుమలలో ఒక ప్రాంతం కలిపి మొత్తంగా 91 కౌంటర్ల ద్వారా ఈ టికెట్లను భక్తులకు జారీ చేసేలా టీటీడీ ముందస్తుగా ఏర్పాటు చేస్తుంది. అటు తర్వాత మిగిలిన ఏడు రోజులకు సంబంధించి ఏ రోజు ఆరోజు కోటాను ముందస్తుగా విడుదల చేయనున్నారు. దీంతో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ముందస్తుగానే తిరుపతికి చేరుకునే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!