Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Rk Roja Fires On Kutami Government

RK Roja: తప్పచేస్తే కేసులు పెట్టండి.. దొంగ కేసులు పెడితే ఊరుకోం..

Published Date :November 18, 2024 , 2:40 pm
By Sudhakar Ravula
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు..
  • వైసీపీ కార్యకర్తలు తప్పచేస్తే కేసులు పెట్టండి..
  • దొంగ కేసులు పెడితే మేం ఊరుకోబోమని రోజా హెచ్చరిక..
  • హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్..
RK Roja: తప్పచేస్తే కేసులు పెట్టండి.. దొంగ కేసులు పెడితే ఊరుకోం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

RK Roja: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తప్పచేస్తే కేసులు పెట్టండి.. అలాగని దొంగ కేసులు పెడితే మేం ఊరుకోం అని హెచ్చరించారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నేత ఆర్కే రోజా.. సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైసీపీ నాయకులపై అసభ్యకర పోస్టులు పెట్టిన కూటమి కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలంటూ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి రోజా, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, చెవి రెడ్డి మోహిత్ రెడ్డి తదితర నేతలు ఫిర్యాదు చేశారు.. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ తో నెట్టుకొస్తున్నారని విమర్శించారు.. మహిళలపై నీచాతినీచంగా పోస్టులు పెడుతున్నారు.. ఫిర్యాదు చేస్తే రిప్లే ఇవ్వడానికే వందసార్లు ఉన్నత అధికారులతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు..

Read Also: Pushpa -2 : పుష్ప -2 ట్రైలర్ పై టాలీవుడ్ సెలెబ్రిటీస్ ఏమన్నారంటే..?

పోలీసులు నెత్తిపై ఉన్న మూడు సింహాలకు సెల్యూట్‌ చెసే విధంగా ప్రవర్తించండి అని సూచించారు రోజా.. చంద్రబాబు తప్పులు చేసి ఎదుటి వారిపై బురద చల్లడం అలవాటు.. వ్యక్తిత్వ హననం అనేది చంద్రబాబుకు అలవాటే అన్నారు.. సీఎం హోదాలో జగన్ ఉన్న సందర్భాలలోనే నీచమైన పోస్ట్ లను పెట్టారు. ఇప్పుడు వైసీపీ నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు.. సుధారాణి ఆడపిల్ల అని చూడకుండా పోలీసులు ఎలా కొట్టారో కోర్టులో తెలిపారు.. కడపలో సునిత వాళ్ల ఇంటికి అర్థరాత్రి వెళ్లి హింసించారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తప్పచేస్తే కేసులు పెట్టండి, అలాగని దొంగకేసులు పెడితే మేము ఊరుకోం అని హెచ్చరించారు.. మహిళపై జరుగుతున్న దాడులను ఆపడానికి పోలీసులను వాడండి, అలా కాకుండా వైఎస్ఆర్ పార్టీపై వాడితే తిరుగుబాటు తప్పదని అని వార్నింగ్‌ ఇచ్చారు .. వైసీపీ హయంలో 36 వేలమంది మిస్ అయ్యారు అని పవన్ కల్యాణ్‌ ఆరోపణలు చేశారు.. కానీ, అసెంబ్లీ సాక్షిగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం 36 మందే అని హోం మినిస్టర్ తెలిపారు.. మరి దీనికి కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా..

Read Also: AP legislative council: మండలి నుంచి మళ్లీ మళ్లీ వైసీపీ వాకౌట్‌..

ఇక, నారాయణ స్వామి మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ పై దారుణమైన పోస్టులు పెట్టారు.. మానవ జన్మ ఎత్తిన వారు ఇలాంటి పోస్టులు పెట్టారు అని ఫైర్ అయ్యారు.. పోలీసులు ప్రజల కోసం పనిచేయాలని సూచించారు.. పేదవాడి హృదయం స్థానం సంపాదించింన జగన్ పై లాంటి పోస్టులు పెట్టడం దారుణం.. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. మరోవైపు.. ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. 45 నిముషాలు పోలీస్ స్టేషను లో ఉన్నాం.. ఫిర్యాదు చేసిన దానికి రిసివ్ట్ కాపీ ఇవ్వడానికి డ్రామాలు చేశారు.. ఎంపీ, మేయర్‌గా మేం స్వయంగా వస్తేనే ప్రోటోకాల్ వ్యతిరేకంగా ప్రవర్తించారు. కూటమి ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే ప్రజలు తగిన‌ బుద్ది చెబుతారని హెచ్చరించారు ఎంపీ గురుమూర్తి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • bjp
  • cm chandrababu
  • janasena
  • Kutami government

తాజావార్తలు

  • CM Chandrababu: అమరావతి నిర్మాణంలో రాజీ పడొద్దు.. నిర్మాణ సంస్థలకు సీఎం ఆదేశాలు!

  • Ragi Ambali: అమ్మమ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. హాట్ హాట్ వేసవిలో శక్తిని ఇచ్చే హెల్తీ, టేస్టీ రాగి అంబలి!

  • Ranbir Kapoor: రామాయణలో రణబీర్ ‘డబుల్’ ధమాకా.. రాముడితో పాటు ఆ పవర్‌ఫుల్ రోల్‌లోనూ ఆయనే!

  • Rashmika: హిస్టరీ క్రియేట్ చేసిన రష్మిక మందన్న.. వరుసగా రెండోసారి జపాన్ నుంచి పిలుపు!

  • Ibrahimpatnam: ఉత్కంఠకు తెర.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఛైర్మన్ పీఠం ఎవరికి దక్కిందంటే..?

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions