AP legislative council: మండలి నుంచి మళ్లీ మళ్లీ వైసీపీ వాకౌట్..
- శాసన మండలి నుంచి మళ్లీ మళ్లీ వైసీపీ వాకౌట్..
- హోం మంత్రి అనిత వ్యాఖ్యలకు నిరసనగా వాకౌట్..
- విద్యుత్ ఛార్జీల విషయంలో మరోసారి వాకౌట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP legislative council: శాసన మండలి నుంచి మళ్లీ మళ్లీ వాకౌట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు.. శాసన మండలిలో వైసీపీ ఇచ్చిన ఇసుక కొరత, భవన కార్మికుల కష్టాలపై వాయిదా తీర్మానం, అగ్రిగోల్డ్ బాధితులపై పీడీఎఫ్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు ఛైర్మన్. అయితే, ప్రశ్నోత్తరాల సమయంలోనే సభ్యుల మధ్య వాగ్వాదం మొదలైంది.. రాష్ట్రంలో గత ప్రభుత్వం కంటే ఈ ఐదు నెలల్లో క్రైమ్ రేటు తగ్గిందన్నారు హోం మంత్రి అనిత.. కానీ, మహిళలపై దాడులు, హత్యలు, అత్యారాలు పెరిగిపోయాయన్నారు వరుదు కల్యాణి. దిశ చట్టం తీసుకొస్తారా, దిశ యాప్ కొనసాగిస్తారా లేదా అని ప్రశ్నించారు కల్పలతా రెడ్డి. అయితే, సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ గత ప్రభుత్వ పాలనలో అనేక లోపాలున్నాయన్నారు హోం మంత్రి అనిత.. దిశ చట్టం లేదు. నిర్భయ చట్టం ఉంది.. నిర్భయ కింద కేసులు నమోదు చేయలేదు. కేంద్రం నిధులిచ్చన ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మించలేదు… గంజాయి వినియోగం పెరిగే నేరాలు పెరిగాయంటూ మంత్రి అనిత ఫైర్ అయ్యారు..
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Also Read
- AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
- Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
- COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. ప్రజలకు కీలక సూచనలు
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
దీంతో.. అనిత వ్యాఖ్యలను అడ్డుకున్నారు వైసీపీ సభ్యులు.. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ కారణంతోనే నీలాంటి వాళ్ళు సభకు వస్తున్నారని దువ్వాడను ఉద్దేశించి మంత్రి అనిత వ్యాఖ్యలు చేశారు.. అంతేకాదు.. సమాధానం వినటానికి దమ్ము ధైర్యం కావాలని పేర్కొన్నారు.. దీంతో, మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు వైసీపీ సభ్యులు.. ఆ తర్వాత ప్రశ్నకు మళ్లీ సభలోకి వచ్చారు. అయితే, శాసన మండలిలో మరోసారి వైసీపీ వాకౌట్ చేసింది.. విద్యుత్ ఛార్జీల సవరణ బిల్లును ప్రవేశపెట్టారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.. ఈ బిల్లు పీడీఎఫ్ వ్యతిరేకించింది.. మరోవైపు.. విద్యుత్ ఛార్జీలు పెంచమని అధికారంలోకి వచ్చి ట్రూ అప్ ఛార్జీల విధించడాన్ని వ్యతిరేకించిన వైసీపీ.. సభ నుంచి మరోసారి వాకౌట్ చేసింది.. ఈ నేపథ్యంలో మండలికి టీ విరామం ప్రటించారు చైర్మన్ మోషేను రాజు..
తాజావార్తలు
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
Bhagyashri Borse: వరుస ఫ్లాప్లు ఆపలేకపోయాయి.. ‘లెనిన్’ హిట్తో భాగ్యశ్రీ బోర్సే భారీ రెమ్యునరేషన్ డిమాండ్
-
AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
-
LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
-
Rohit Sharma Retirement Rumours: లార్డ్స్ వన్డే చివరి మ్యాచ్?.. రోహిత్ శర్మ రిటైర్మెంట్పై బీసీసీఐ క్లారిటీ..!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?