AP legislative council: మండలి నుంచి మళ్లీ మళ్లీ వైసీపీ వాకౌట్..
- శాసన మండలి నుంచి మళ్లీ మళ్లీ వైసీపీ వాకౌట్..
- హోం మంత్రి అనిత వ్యాఖ్యలకు నిరసనగా వాకౌట్..
- విద్యుత్ ఛార్జీల విషయంలో మరోసారి వాకౌట్..
AP legislative council: శాసన మండలి నుంచి మళ్లీ మళ్లీ వాకౌట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు.. శాసన మండలిలో వైసీపీ ఇచ్చిన ఇసుక కొరత, భవన కార్మికుల కష్టాలపై వాయిదా తీర్మానం, అగ్రిగోల్డ్ బాధితులపై పీడీఎఫ్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు ఛైర్మన్. అయితే, ప్రశ్నోత్తరాల సమయంలోనే సభ్యుల మధ్య వాగ్వాదం మొదలైంది.. రాష్ట్రంలో గత ప్రభుత్వం కంటే ఈ ఐదు నెలల్లో క్రైమ్ రేటు తగ్గిందన్నారు హోం మంత్రి అనిత.. కానీ, మహిళలపై దాడులు, హత్యలు, అత్యారాలు పెరిగిపోయాయన్నారు వరుదు కల్యాణి. దిశ చట్టం తీసుకొస్తారా, దిశ యాప్ కొనసాగిస్తారా లేదా అని ప్రశ్నించారు కల్పలతా రెడ్డి. అయితే, సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ గత ప్రభుత్వ పాలనలో అనేక లోపాలున్నాయన్నారు హోం మంత్రి అనిత.. దిశ చట్టం లేదు. నిర్భయ చట్టం ఉంది.. నిర్భయ కింద కేసులు నమోదు చేయలేదు. కేంద్రం నిధులిచ్చన ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మించలేదు… గంజాయి వినియోగం పెరిగే నేరాలు పెరిగాయంటూ మంత్రి అనిత ఫైర్ అయ్యారు..
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Also Read
- YS Jagan: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ మద్దతు తగ్గుతోంది.. జగన్ ఆవేదన..
- CM Chandrababu: నేను దక్షిణాది రాష్ట్రాల వైపే మాట్లాడుతున్నా.. అందుకే ప్రధాని మోడీకి పూర్తి మద్దతు..
- AP Ministers Singapore Tour: సింగపూర్ చేరుకున్న ఏపీ మంత్రుల బృందం.. 7 రోజుల టూర్..
- Andhra Pradesh: వ్యవసాయ విద్యుత్ సరఫరా వ్యవస్థలో కీలక మార్పులు.. కొత్త కార్పొరేషన్ ఏర్పాటు..
దీంతో.. అనిత వ్యాఖ్యలను అడ్డుకున్నారు వైసీపీ సభ్యులు.. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ కారణంతోనే నీలాంటి వాళ్ళు సభకు వస్తున్నారని దువ్వాడను ఉద్దేశించి మంత్రి అనిత వ్యాఖ్యలు చేశారు.. అంతేకాదు.. సమాధానం వినటానికి దమ్ము ధైర్యం కావాలని పేర్కొన్నారు.. దీంతో, మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు వైసీపీ సభ్యులు.. ఆ తర్వాత ప్రశ్నకు మళ్లీ సభలోకి వచ్చారు. అయితే, శాసన మండలిలో మరోసారి వైసీపీ వాకౌట్ చేసింది.. విద్యుత్ ఛార్జీల సవరణ బిల్లును ప్రవేశపెట్టారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.. ఈ బిల్లు పీడీఎఫ్ వ్యతిరేకించింది.. మరోవైపు.. విద్యుత్ ఛార్జీలు పెంచమని అధికారంలోకి వచ్చి ట్రూ అప్ ఛార్జీల విధించడాన్ని వ్యతిరేకించిన వైసీపీ.. సభ నుంచి మరోసారి వాకౌట్ చేసింది.. ఈ నేపథ్యంలో మండలికి టీ విరామం ప్రటించారు చైర్మన్ మోషేను రాజు..
తాజావార్తలు
-
Nandre Burger: కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన.. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ కు జరిమానా, డీమెరిట్ పాయింట్ కూడా.!
-
Bengal Tiger: రూటు మార్చిన బెంగాల్ టైగర్.. మళ్లీ తూర్పుగోదావరి జిల్లాలోకి ఎంట్రీ!
-
Tollywood – Bollywood : బాలీవుడ్ హీరోలతో టాలీవుడ్ డైరెక్టర్స్
-
Ravindra Jadeja: అయ్యబాబోయ్.. కాస్త ఉంటే అభిమానులను కొట్టేలాగా ఉన్నాడే.! వీడియో వైరల్
-
Rajinikanth: రజినీకాంత్ ఓటు వేస్తుంటే ఈవీఎం వరకు కెమెరాలు.. రికార్డైన ‘తలైవా’ ఓటు..! అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?