విజయవాడ నుంచి ప్రత్యేక టూరిస్ట్ రైళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైల్వే ప్రయాణికులకు ఐఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఉత్తర భారతదేశం సందర్శించుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. విజయవాడ నుంచి పర్యాటకుల కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు IRCTC డిప్యూటీ జనరల్ మేనేజర్ కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వీటికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. కొత్త ఏడాదిలో మూడు నెలల పాటు 3 ప్రత్యేక టూరిస్ట్ ట్రైన్లు ప్రారంభిస్తున్నామన్నారు. తీర్థయాత్ర ప్రత్యేక పర్యాటక రైలు ద్వారా గుజరాత్ యాత్ర ప్రారంభం కానుందని తెలిపారు. మొదటి టూర్ జనవరి 21 నుంచి ప్రారంభమవుతుందని, 31తో ముగుస్తుందన్నారు. టూర్లో సోమనాథ్, ద్వారక, నాగేశ్వర్, బెట్ ద్వారక, అహ్మదాబాద్, స్టాట్యూ ఆఫ్ యూనీటి సందర్శించే అవకాశం ఉందని తెలిపారు. టిక్కెట్ ధరలు కూడా అందుబాటు ధరల్లోనే ఉంటాయన్నారు.
Also Read:ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ఎంఎం నరవాణే నియామకం
Also Read
- Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
- Pawan Kalyan: ప్రపంచ ఏనుగుల దినోత్సవం.. ఏనుగుల సంరక్షణపై పవన్ కల్యాణ్ కీలక సందేశం
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
- CM Chandrababu: సైబర్ క్రైమ్, గంజాయి, బ్లేడ్ బ్యాచ్లపై ఉక్కుపాదం.. నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష..
ఒక వ్యక్తికి స్లీపర్ క్లాస్ కి 10400, కంఫర్ట్ కి 17,330 రూపాయల కాస్ట్ అవుతుందన్నారు. దీంతో పాటు ఆగ్రా, అమృత్సర్, హరిద్వార్, వాఘా బార్డర్, గోవా, హంపి ఇలా అనేక టూరిస్ట్ ప్రదేశాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు వెల్లడించారు. స్టే నుండి ఫుడ్ వరకు అన్ని రైల్వేశాఖ అందజేస్తుందన్నారు. ఒక్కో రైళ్లలో 500 నుండి 600 వరకు ప్రయాణించే అవకాశం ఉందన్నారు. ఇక ఇప్పటికే దక్షిణ భారత యాత్ర సక్సెస్పుల్గా కొనసాగిందని పేర్కొన్నారు.
కరోనా నిబంధనల పాటిస్తూనే ఐఆర్టీసీ యాత్ర సదుపాయాలను కల్పిస్తుందన్నారు. రెండు, మూడు రోజుల టూర్ ప్యాకెజీలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. రూ. 3000 ధరతో టూర్స్ను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. తిరుపతి దర్శనం కూడా ట్రైన్ టూర్ ప్యాకేజ్ ద్వారా సులువుగా అవ్వడమే గాక త్వరగా దర్శన సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు చెప్పారు. 3,220 రూపాయలకు విజయవాడ నుండి తిరుపతి దర్శనం వరకు ఇబ్బంది లేకుండా చేయించనున్నట్టు వెల్లడించారు. గ్రూప్ టూర్స్ కూడా అందుబాటులోకి తీసుకు వచ్చామని, Irctc వెబ్ సైట్ లో ప్యాకేజ్ డీటెయిల్స్ చూసుకుని బుక్ చేసుకోవచ్చని కిషోర్ తెలిపారు.
తాజావార్తలు
-
Janhvi Kapoor : పా. రంజిత్ పర్యవేక్షణలో కోలీవుడ్కి జాన్వీ కపూర్ గ్రాండ్ ఎంట్రీ
-
IND vs AFG Schedule: భారత్, అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ ఖరారు.. పూర్తి షెడ్యూల్ ఇదే.. బంగ్లాదేశ్కు భారీ షాక్?
-
Best FD Interest Rates August 2026: FDపై 8.50 శాతం వరకు వడ్డీ.. ఆగస్టు 2026లో టాప్ రేట్లు అందిస్తున్న బ్యాంకుల పూర్తి జాబితా
-
Srinu Vaitla : జార్జ్క్రిష్తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్
-
Mallika Sherawat: ‘టామ్ క్రూజ్కు నాపై క్రష్’.. వీడియో కూడా ఉంది.. 49 ఏళ్ల మల్లికా కామెంట్స్ వైరల్
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!