విజయవాడ నుంచి ప్రత్యేక టూరిస్ట్ రైళ్లు
రైల్వే ప్రయాణికులకు ఐఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఉత్తర భారతదేశం సందర్శించుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. విజయవాడ నుంచి పర్యాటకుల కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు IRCTC డిప్యూటీ జనరల్ మేనేజర్ కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వీటికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. కొత్త ఏడాదిలో మూడు నెలల పాటు 3 ప్రత్యేక టూరిస్ట్ ట్రైన్లు ప్రారంభిస్తున్నామన్నారు. తీర్థయాత్ర ప్రత్యేక పర్యాటక రైలు ద్వారా గుజరాత్ యాత్ర ప్రారంభం కానుందని తెలిపారు. మొదటి టూర్ జనవరి 21 నుంచి ప్రారంభమవుతుందని, 31తో ముగుస్తుందన్నారు. టూర్లో సోమనాథ్, ద్వారక, నాగేశ్వర్, బెట్ ద్వారక, అహ్మదాబాద్, స్టాట్యూ ఆఫ్ యూనీటి సందర్శించే అవకాశం ఉందని తెలిపారు. టిక్కెట్ ధరలు కూడా అందుబాటు ధరల్లోనే ఉంటాయన్నారు.
Also Read:ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ఎంఎం నరవాణే నియామకం
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
ఒక వ్యక్తికి స్లీపర్ క్లాస్ కి 10400, కంఫర్ట్ కి 17,330 రూపాయల కాస్ట్ అవుతుందన్నారు. దీంతో పాటు ఆగ్రా, అమృత్సర్, హరిద్వార్, వాఘా బార్డర్, గోవా, హంపి ఇలా అనేక టూరిస్ట్ ప్రదేశాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు వెల్లడించారు. స్టే నుండి ఫుడ్ వరకు అన్ని రైల్వేశాఖ అందజేస్తుందన్నారు. ఒక్కో రైళ్లలో 500 నుండి 600 వరకు ప్రయాణించే అవకాశం ఉందన్నారు. ఇక ఇప్పటికే దక్షిణ భారత యాత్ర సక్సెస్పుల్గా కొనసాగిందని పేర్కొన్నారు.
కరోనా నిబంధనల పాటిస్తూనే ఐఆర్టీసీ యాత్ర సదుపాయాలను కల్పిస్తుందన్నారు. రెండు, మూడు రోజుల టూర్ ప్యాకెజీలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. రూ. 3000 ధరతో టూర్స్ను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. తిరుపతి దర్శనం కూడా ట్రైన్ టూర్ ప్యాకేజ్ ద్వారా సులువుగా అవ్వడమే గాక త్వరగా దర్శన సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు చెప్పారు. 3,220 రూపాయలకు విజయవాడ నుండి తిరుపతి దర్శనం వరకు ఇబ్బంది లేకుండా చేయించనున్నట్టు వెల్లడించారు. గ్రూప్ టూర్స్ కూడా అందుబాటులోకి తీసుకు వచ్చామని, Irctc వెబ్ సైట్ లో ప్యాకేజ్ డీటెయిల్స్ చూసుకుని బుక్ చేసుకోవచ్చని కిషోర్ తెలిపారు.
తాజావార్తలు
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
-
Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో