Hindupuram: ఎన్టీఆర్ ఉచిత వైద్య రథాన్ని ప్రారంభించిన బాలయ్య.. వాహనం పాడవకుండా ముందుచూపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hindupuram: హిందూపురం నియోజకవర్గ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నడుం బిగించారు. ఈ మేరకు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం చలివెందులలో ఆయన ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ.. నేను హిందూపురం వాడినే అని… మనలో మనకి అమరికలు ఉండకూడదని వ్యాఖ్యానించారు. చలివెందులలో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం శుభపరిణామం అని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా సేవలు అందించే బృహత్తర కార్యక్రమాన్ని తాము చేపట్టామని తెలిపారు. ఇందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని బాలయ్య పిలుపునిచ్చారు.
Read Also: South Central Railway: రేపటి నుంచి పట్టాలెక్కనున్న గుంటూరు-తిరుపతి ఎక్స్ప్రెస్
Also Read
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
- Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
- Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
తొలిసారిగా మొబైల్ వాహనంలో ఈసీజీ, ఆక్సీమీటర్, అత్యాధునికమైన మైక్రోస్కోప్ వంటి పరికరాలు ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే బాలకృష్ణ వివరించారు. ఈ వాహనం ద్వారా ప్రజలకు సుమారు 200 పరీక్షలు చేసే వెసులుబాటు ఉందన్నారు. అటు 107 రకాల మందులు ఉచితంగా సరఫరా చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో ప్రజల జబ్బులు నయం అయ్యేవరకు ఈ వైద్య సేవలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బసవతారకం క్యాన్సర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు.
గతంలో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిని ఎంతో అభివృద్ధి చేశామని.. ప్రస్తుతం ఆసుపత్రిలో 20 ఇంక్యూబేటర్లు నిరుపయోగంగా ఉన్నాయని బాలయ్య గుర్తుచేశారు. ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలని.. మనుషులను మనుషులుగా గుర్తించాలని.. అది సంస్కారం అని హితవు పలికారు. అందుకే టీడీపీ పుట్టిందన్నారు. ఎన్టీఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ సహకారంతో భవిష్యత్లో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని బాలయ్య వెల్లడించారు. అందరూ ఎన్టీఆర్ వైద్యరథాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వాహనానికి ఎవరైనా అపకారం చేసే ప్రమాదం ఉందని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని బాలయ్య తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్టు సహకారంతో హిందూపురంను ఆరోగ్యపురంగా చేస్తామన్నారు. చంద్రబాబు సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను విస్తరిస్తామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!