ఒంగోలు సమీపంలో టీడీపీ మహానాడు అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. రెండు రోజుల పాటు మహానాడు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో మహానాడు కార్యక్రమానికి వచ్చే అతిథుల కోసం టీడీపీ భారీ ఫుడ్ మెనూ సిద్ధం చేసింది. మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పర్యవేక్షణలో ఆహార కమిటీ రుచికరమైన వంటకాలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే వెయ్యి మంది నిష్ణాతులైన వారు మహానాడు ప్రాంగణంలో వంటకాలను సిద్ధం చేస్తున్నారు. మొత్తం 11 ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారు. ఒక్కో ఫుడ్ కోర్టుకు ఒక్కో ఆహార కమిటీ సభ్యుడిని ఇంఛార్జిగా నియమించి వారికి వాకీటాకీలు అందచేశారు. ఫుడ్ కోర్టు వద్ద ఎలాంటి సమస్య ఎదురైనా వాళ్లు పరిష్కరించనున్నారు.
27వ తేదీ లంచ్: యాపిల్ హల్వా, జిలేబీ, అజ్వాన్ పకోడి, వెజిటబుల్ బుల్లెట్, కొబ్బరి అన్నం, కడాయి వెజిటబుల్ కుర్మా, రైతా, మామిడికాయ పప్పు, వంకాయ పకోడి ఫ్రై, మునగకాయ డబుల్ బీన్స్ కర్రీ, బీరకాయ శనగపప్పు కర్రీ, దోసకాయ వంకాయ చట్నీ, మామిడికాయ పచ్చడి, డైమండ్ చిప్స్, అప్పడాలు, సాంబారు, పచ్చిపులుసు, మజ్జిగచారు, వైట్ రైస్, నెయ్యి, పెరుగు, ఐస్ క్రీమ్
27వ తేదీ స్నాక్స్ (సాయంత్రం 4 గంటలకు): అల్లూరయ్య మైసూర్ పాక్, సమోసా లేదా పకోడి, టీ, కాఫీ
27వ తేదీ డిన్నర్: సేమ్యా కేసరి, అరటికాయ భజ్జీ, టమోటా పప్పు, బంగాళదుంప ఫ్రై, మిక్సుడ్ వెజిటబుల్ కర్రీ, దొండకాయ చట్నీ, పప్పుచారు, అప్పడాలు, వడియాలు, వైట్ రైస్, నెయ్యి, పెరుగు
28వ తేదీ బ్రేక్ ఫాస్ట్:
నేరేడు హల్వా (స్వీట్), ఇడ్లీ, గారె, పొంగల్, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, కారప్పొడి, నెయ్యి, సాంబారు, టీ, కాఫీ
28వ తేదీ లంచ్:
చక్కెర పొంగలి, తాపేశ్వరం కాజా, మసాల వడ లేదా మిర్చి భజ్జీ లేదా పుదీనా ఫింగర్, వెజిటబుల్ బిర్యానీ, వెజ్ జైపూర్ కుర్మా, రైతా, దోసకాయ పప్పు, దొండకాయ పకోడి ఫ్రై లేదా బెండకాయ కొబ్బరి ఫ్రై, అరటికాయ గ్రేవీ కర్రీ, గోంగూర ఉల్లిపాయ చట్నీ, మిక్సుడ్ వెజిటబుల్ చట్నీ, డైమండ్ చిప్స్, అప్పడాలు, సాంబారు, పచ్చిపులుసు, వైట్ రైస్, నెయ్యి, పెరుగు, ఐస్ క్రీమ్