Varla Ramaiah: చికోటి ప్రవీణ్తో వైసీపీ నేతలకు సంబంధాలు..! కొడాలి, వల్లభనేని ఇళ్లపై ఈడీ రైడ్స్ జరగాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్యాసినో వ్యవహారంలో చికోటి ప్రవీణ్ చుట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగిస్తున్నట్టు తెలుస్తోంది.. మొత్తం 8 ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రవీణ్ చికోటి, మాధవరెడ్డి ఇళ్లలో సోదాలు జరిగాయి.. తెలంగాణలోని సైదాబాద్, బోయిన్పల్లి, కడ్తాల్లో ఈడీ సోదాలు జరిగాయి. సుమారు 20 గంటల పాటు తనిఖీలు నిర్వహించారు అధికారులు.. నేపాల్లో లీగల్గా క్యాసినో నిర్వహించినట్టు ఈడీ అధికారులకు ప్రవీణ్ తెలిపాడు. దీంతో ప్రవీణ్ ల్యాప్టాప్లో అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీస్తున్నారు.. పలువురు వీఐపీలతో పాటు సినిమా పరిశ్రమకు సబంధించినవారికి కూడా సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది.. అయితే, చికోటి ప్రవీణ్తో వైసీపీ నేతలకు కూడా సంబంధాలున్నాయని ఆరోపించారు టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య.. గత సంక్రాంతి పండుగ సందర్బంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ నేతృత్వంలో గుడివాడలో చికోటీ ప్రవీణ్ క్యాసినో నిర్వహించి ప్రజలను నిలువు దోపిడి చేశారన్న ఆయన.. చికోటి ప్రవీణ్ ఇప్పడు నేపాల్ లో నిర్వహించిన క్యాసినోలో వేల కోట్ల హవాలా ధనం చేతులు మారినట్లు గుర్తించి ఈడీ సోదాలు నిర్వహించిందని.. నేపాల్ క్యాసినోకి రాష్ట్రం నుంచి వేలాది మంది వెళ్లారు. ఇందులో సగం మంది అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలున్నారని అంటున్నారని పేర్కొన్నారు.
Read Also: Rain Alert : హైదరాబాద్వాసులు అలర్ట్.. నేడు భారీ వర్ష సూచన..
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
ఇక, ఒక్కక్కరికి దగ్గర చికోటి ప్రవీణ్ రూ. 3 లక్షలు వసూలు చేసి మందు, విందు, సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారని విమర్శించారు వర్ల రామయ్య.. క్యాసినో క్రీడతో వైసీపీ నేతలు బ్లాక్ మనినీ వైట్ మనీగా మార్చుకుంటున్నారని ఆరోపించిన ఆయన.. గుడివాడ క్యాసినో కేరళ నుంచి వచ్చిన పెద్దలు కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారని.. దీనిపై కేరళ ప్రభుత్వం స్పందించినా.. జగన్ మాత్రం కనీసం విచారణ జరపలేదని.. పైగా టీడీపీ నిజనిర్దారణ కమిటీపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు.. చికోటి ప్రవీణ్తో వైసీపీ నేతలకు సంబంధం ఉంది. వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ తదితర ఇళ్లలో కూడా ఈడీ సోదాలు జరపాలని డిమాండ్ చేశారు.. క్యాసినో పేరుతో ఎన్నో కుటుంబాలను నాశనం చేసిన పాపం ఊరికే పోదని.. ఇది రావణ కాష్టంలా రగులుతుందన్నారు. దీనికి బాద్యులైన వైసీపీ నేతలకు, పోలీసులకు ముసళ్ల పండుగ ముందుందని హెచ్చరించారు.. ఈడీ అందరి భాగోతం బయటపెడుతుంది.. గుడివాడ క్యాసినో ద్వారా వచ్చిన విపరీతమైన డబ్బుతో హైదరాబాద్ లో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఏ వ్యాపారాలు చేస్తున్నారో త్వరలో బయటపెడతానంటూ వార్నింగ్ ఇచ్చారు వర్ల రామయ్య.
తాజావార్తలు
-
Kalyani Priyadarshan: రణవీర్ సింగ్ ‘ప్రళయ్’లో కళ్యాణి ప్రియదర్శన్? బాలీవుడ్లో మరో పెద్ద అవకాశం దక్కనున్నదా!
-
Astrology: జూలై 23 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..!
-
Samsung Galaxy Z Flip 8: 4300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో సామ్ సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 8 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!