కృష్ణా జిల్లా గుడివాడలో కేసినో వ్యవహారంపై ఇంకా రచ్చ కొనసాగుతూనే ఉంది.. ఈ వ్యవహారం వైసీపీ, టీడీపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనిపిస్తోంది… ఘాటు విమర్శలు, ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉండగా.. మరోవైపు ఫిర్యాదులు కూడా వెళ్తున్నాయి.. ఇప్పటికే ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ను కలిసి ఫిర్యాదు చేసింది టీడీపీ.. ఇక, డీజీపీ, కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు టీడీపీ నేతలు.. మరోవైపు.. ఈ వ్యవహారంపై గవర్నర్కు లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇక, ఇవాళ ఏకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టికి గుడివాడ కేసినో వ్యవహారం వెళ్లింది.. ఈడీకి ఫిర్యాదు చేశారు తెలుగుదేశం పార్టీ నేతలు… దేశ రాజధాని ఢిల్లీలో ఈడీ అధికారులను కలిసిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్… గుడివాడ కేసినో విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. ఈడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.. టీడీపీ ఫిర్యాదుతో కేసులు నమోదు చేసే అవకాశం ఉందా? అనేది ఆసక్తికరంగా మారింది.
Read Also: విజయవాడ జిల్లాకు రంగా పేరు పెట్టాల్సిందే.. రేపు ఆందోళన..