Venkaiah Naidu: ప్రభుత్వం నుంచి స్వర్ణ భారత్ ట్రస్ట్ ఎలాంటి ఆర్థిక సహాయం తీసుకోవడం లేదు
- నెల్లూరు జిల్లాలోని వెంకటాచలంలో గల స్వర్ణ భారత్ ట్రస్టు 23వ వార్షికోత్సవం..
- స్వర్ణ భారత్ ట్రస్ట్ గ్రామీణ సాధికారతే లక్ష్యంగా పని చేస్తోంది..
- ప్రభుత్వం నుంచి ఈ ట్రస్ట్ ఎలాంటి ఆర్థిక సహాయం తీసుకోవడం లేదు: వెంకయ్య నాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venkaiah Naidu: నెల్లూరు జిల్లాలోని వెంకటాచలంలో గల స్వర్ణ భారత్ ట్రస్టు 23వ వార్షికోత్సవంలో భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. గత 23 సంవత్సరాల క్రితం స్వర్ణ భారత ట్రస్ట్ను ప్రారంభించాం.. హైదరాబాద్, విజయవాడలో కూడా స్వర్ణ భారత్ సేవలు అందిస్తోంది అని చెప్పుకొచ్చారు. ఎందరో యువతకు స్వయం ఉపాధికి చేయూతనిస్తోంది.. ఇప్పటి వరకూ లక్ష మంది శిక్షణ తీసుకున్నారు.. గ్రామీణ సాధికారతే లక్ష్యంగా ఈ ట్రస్ట్ పని చేస్తోంది అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వం నుంచి స్వర్ణ భారత్ ట్రస్ట్ ఎలాంటి ఆర్థిక సహాయం తీసుకోవడం లేదు అని పేర్కొన్నారు. కానీ ప్రజల కోసం ప్రభుత్వంతో కలిసి స్వర్ణ భారత్ ట్రస్ట్ పని చేస్తోంది అని వెంకయ్య నాయుడు వెల్లడించారు.
Read Also: Doctors strike: డాక్టర్ల భద్రత కోసం కమిటీ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం..
Also Read
కాగా, స్వర్ణ భారత ట్రస్ట్ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ పని చేస్తోంది అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తోంది.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, అధికారులు, ఎంతో మంది ప్రజా ప్రతినిధులు ఇక్కడికి వచ్చి విద్యార్థులకు ఆశీస్సులులు అందించారు అని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ మాట్లాడుతూ.. సంక్షేమ కార్యక్రమాల కోసం వెంకయ్య నాయుడు జీవితం అంకితం చేశారు.. గ్రామీణ భారతంలో సేవకు ఆయన అంకితమయ్యారని ప్రశంసలు కురిపించారు. అలాగే, స్వర్ణ భారత ట్రస్ట్ గ్రామీణ ప్రాంతాలకు చేస్తున్న సేవలను గుర్తు చేసుకున్నారు.
తాజావార్తలు
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?