వంగవీటి రాధా ఆఫీస్ వద్ద స్కూటర్ కలకలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన హత్యకు రెక్కీ జరుగుతోందని ఇటీవల టీడీపీ నేత వంగవీటి రాధా చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో విజయవాడలోని వంగవీటి రాధా కార్యాలయం ముందు గత కొన్నిరోజులుగా పార్క్ చేసిన స్కూటర్ అనుమానాస్పదంగా మారడంతో రాధా అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు స్కూటర్ను స్వాధీనం చేసుకున్నారు. పార్క్ చేసిన స్కూటర్ ఎవరిదన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.
Read Also: బీమా కంపెనీల ఆఫర్… పెళ్లి క్యాన్సిల్ అయితే రూ.10 లక్షలు
Also Read
అయితే ఈ స్కూటర్ నాని అనే వ్యక్తిది అని పోలీసుల విచారణలో వెల్లడైంది. అతడు వంగవీటి రాధా కార్యాలయం పక్కన ఉన్న ఓ స్వీట్ షాపులో పనిచేసే వ్యక్తి స్నేహితుడు అని పోలీసులు గుర్తించారు. దీంతో స్కూటర్ను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు అందులో ఏమీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా రెక్కీ ఆరోపణల నేపథ్యంలో వంగవీటి రాధా కార్యాలయాన్ని కూడా ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్యూరో పోలీసులు పరిశీలించారు. కాగా వంగవీటి రాధాకృష్ణకు టూ ప్లస్ టూ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా.. తనకు పోలీస్ సెక్యూరిటీ వద్దని రాధా తిరస్కరించిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..