Students: విద్యార్థుల అవస్థలు.. గుర్రం ఎక్కితేనే స్కూల్కు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Students: ఈ మధ్య రిలీజైన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాలో మన్యంలో ఉండే అడవి బిడ్డల కష్టాలను కళ్లకు కట్టినట్టు చూపించారు.. ఆ సినిమా ఎంతటి విషయం సాధించింది అనే విషయాన్ని పక్కనపెడితే.. ఇప్పటికే అలా ఎన్నో గ్రామాలు ఉన్నాయి.. కనీస అవరాలకు దూరంగా బతుకు వెళ్లదీస్తున్నాయి.. ఇప్పటి ప్రజలు కష్టాలు వెళ్లదీయడమేకాదు.. నేటి బాలలు.. రేపటి పౌరులకు కూడా ఇవే ఇబ్బందులు.. మంచి భవిష్యత్ కోసం స్కూల్కు వెళ్లి.. చదువుకోవడం వారికి గగనంగా మారిపోయింది.. రోడ్లు లేక, కనీసం నడిచే తోవలు కూడా సరిగా లేక.. గుర్రాలను ఆశ్రయిస్తున్నారు చిన్నారులు.. అయితే, ఆ విద్యార్థుల కష్టాలు ఓ సామాజిక కార్యకర్త దృష్టిలో పడ్డాయి.. వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో.. ఇప్పుడు ఆ చిన్నారుల కష్టాలు వైరల్గా మారిపోయాయి..
Read Also: Dharmana Prasada Rao: కావాలంటే మంత్రి, ఎమ్మెల్యే పదవులు వదిలేస్తా.. కానీ, గోంతెత్తకుండా ఉండను..!
Also Read
- Sajjala Ramakrishna Reddy: రాజధాని పేరుతో ప్రజలపై అప్పుల మోత.. సజ్జల సంచలన వ్యాఖ్యలు.!
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీటీవీ హార్డ్డిస్క్లు మార్చారా..?
- AP Gold Mining: ఏపీలో గోల్డ్ మైనింగ్కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు
- AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం...
ఇది ఎక్కడో అనుకుంటే పొరపాటే.. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా సబ్ ప్లాన్ ఏరియాలో ఈ ఘటన వెలుగు చూసింది.. ఆ విద్యార్థుల కష్టాలకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రావికమతం మండలం గిరిశిఖర గ్రామమైన నేరేడు బందకు చెందిన విద్యార్థులు గుర్రాలపై పాఠశాలకు వెళ్తున్నారు. 15 మంది విద్యార్థులు పక్క గ్రామంలో పాఠశాలకు వెళ్లేందుకు సరైన రహదారి సౌకర్యం లేదు.. వారి చిన్న పాదాలతో కనీసం నడిచి వెళ్లే పరిస్థితి కూడా లేదు.. దీంతో గుర్రాలపై జెడ్. జోగుంపేట పాఠశాలకు వెళ్తున్నారు విద్యార్థులు.. ఆ విద్యార్థులు గుర్రాలపై వెళ్లేందుకు స్థానికులు సాయం చేస్తున్నారు.. అయితే, ఒక్కో గుర్రంపై ముగ్గురు, నలుగురు, ఐదుగురు విద్యార్థులు.. ప్రమాదకరంగా వెళ్లాల్సిన పరిస్థితి.. తమకు రహదారి సౌకర్యం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ఇటీవల గ్రామానికీ వెళ్లిన ఒక సామాజిక కార్యకర్త విద్యార్థుల కష్టాలను తన కెమెరాలో రికార్డ్ చేసి.. సోషల్ మీడియాలో పెట్టారు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది.. ఈ చిన్నారుల బాధలను పట్టించుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు..
తాజావార్తలు
-
Ketan Agarwal Murder Case: సియా, చేతన్ల ఫోన్లలో కోడ్ వర్డ్స్..
-
Defence: రక్షణ శాఖ మరింత బలోపేతం.. అత్యాధునిక ఆయుధాలు కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్
-
ED: ఈడీ సంచలన చర్య.. తొలిసారి విమానం వేలం.. చాలా చీఫ్గా విక్రయం
-
Dhruv Rathee: రాముడు-సీతలపై వ్యాఖ్యలు.. ధ్రువ్ రాఠీ వీడియో తొలగింపుపై హైకోర్టు డెడ్లైన్
-
Bhatti Vikramarka : దమ్ముంటే చర్చకు రండి.. కేసీఆర్ కు భట్టి ఓపెన్ ఛాలెంజ్.!
ట్రెండింగ్
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!