Students: విద్యార్థుల అవస్థలు.. గుర్రం ఎక్కితేనే స్కూల్కు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Students: ఈ మధ్య రిలీజైన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాలో మన్యంలో ఉండే అడవి బిడ్డల కష్టాలను కళ్లకు కట్టినట్టు చూపించారు.. ఆ సినిమా ఎంతటి విషయం సాధించింది అనే విషయాన్ని పక్కనపెడితే.. ఇప్పటికే అలా ఎన్నో గ్రామాలు ఉన్నాయి.. కనీస అవరాలకు దూరంగా బతుకు వెళ్లదీస్తున్నాయి.. ఇప్పటి ప్రజలు కష్టాలు వెళ్లదీయడమేకాదు.. నేటి బాలలు.. రేపటి పౌరులకు కూడా ఇవే ఇబ్బందులు.. మంచి భవిష్యత్ కోసం స్కూల్కు వెళ్లి.. చదువుకోవడం వారికి గగనంగా మారిపోయింది.. రోడ్లు లేక, కనీసం నడిచే తోవలు కూడా సరిగా లేక.. గుర్రాలను ఆశ్రయిస్తున్నారు చిన్నారులు.. అయితే, ఆ విద్యార్థుల కష్టాలు ఓ సామాజిక కార్యకర్త దృష్టిలో పడ్డాయి.. వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో.. ఇప్పుడు ఆ చిన్నారుల కష్టాలు వైరల్గా మారిపోయాయి..
Read Also: Dharmana Prasada Rao: కావాలంటే మంత్రి, ఎమ్మెల్యే పదవులు వదిలేస్తా.. కానీ, గోంతెత్తకుండా ఉండను..!
Also Read
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
- Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
ఇది ఎక్కడో అనుకుంటే పొరపాటే.. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా సబ్ ప్లాన్ ఏరియాలో ఈ ఘటన వెలుగు చూసింది.. ఆ విద్యార్థుల కష్టాలకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రావికమతం మండలం గిరిశిఖర గ్రామమైన నేరేడు బందకు చెందిన విద్యార్థులు గుర్రాలపై పాఠశాలకు వెళ్తున్నారు. 15 మంది విద్యార్థులు పక్క గ్రామంలో పాఠశాలకు వెళ్లేందుకు సరైన రహదారి సౌకర్యం లేదు.. వారి చిన్న పాదాలతో కనీసం నడిచి వెళ్లే పరిస్థితి కూడా లేదు.. దీంతో గుర్రాలపై జెడ్. జోగుంపేట పాఠశాలకు వెళ్తున్నారు విద్యార్థులు.. ఆ విద్యార్థులు గుర్రాలపై వెళ్లేందుకు స్థానికులు సాయం చేస్తున్నారు.. అయితే, ఒక్కో గుర్రంపై ముగ్గురు, నలుగురు, ఐదుగురు విద్యార్థులు.. ప్రమాదకరంగా వెళ్లాల్సిన పరిస్థితి.. తమకు రహదారి సౌకర్యం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ఇటీవల గ్రామానికీ వెళ్లిన ఒక సామాజిక కార్యకర్త విద్యార్థుల కష్టాలను తన కెమెరాలో రికార్డ్ చేసి.. సోషల్ మీడియాలో పెట్టారు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది.. ఈ చిన్నారుల బాధలను పట్టించుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు..
తాజావార్తలు
-
CM Revanth Reddy : మహిళల చేతుల్లోనే తెలంగాణ ప్రగతి
-
DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
-
Protein Foods: ఏ ప్రోటీన్ పౌడర్ అవసరం లేదు.. కేవలం రూ.30లోనే ఉత్తమ పోషకాహారం పొందవచ్చు..!
-
Tragedy: హైదరాబాద్లో భారీ వర్షానికి ఇద్దరు బలి..
-
India A vs Sri Lanka A: ఇండియా ‘ఎ’ సంచలన బోణీ.. లంకపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ!
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!