Dharmana Prasada Rao: కావాలంటే మంత్రి, ఎమ్మెల్యే పదవులు వదిలేస్తా.. కానీ, గోంతెత్తకుండా ఉండను..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmana Prasada Rao: కావాలంటే మంత్రి, ఎమ్మెల్యే పదవులు వదిలేస్తా.. కానీ, మా ప్రాంత ప్రజలకోసం గోంతెత్తకుండా ఉండలేను అని ప్రకటించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం పట్టణంలోని పోట్టి శ్రీరాములు మార్కేట్లో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ధర్మాన ప్రసాద్ భూములు దోబ్బేశాడని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారు.. రేవిన్యూ మినిష్టర్ గా.. సెంటు భూమి ఇచ్చే అధికారం కూడా నాకు లేదు.. ఇక, రెవెన్యూ మినిస్టర్గా భూములు దోబ్బే అవకాశం ఉందా..? అని ప్రశ్నించారు.. కేబినెట్లో మాత్రమే ఏవరికైనా భూములు ఇవ్వగలదని స్పష్టం చేసిన ఆయన.. నా రాజకీయ జీవితంలో ఏపని కైనా నయా పైసా ప్రతిఫలం తీసుకున్నట్టు రుజువు చేస్తే.. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు..
Read Also: CM KCR : సీఎం కేసీఆర్తో సీఎస్ సోమేష్ కుమార్ భేటీ
Also Read
- Road Accident: రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు-ఆటో ఢీ..
- ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
- Vijay Sai Reddy: నేను వైసీపీని వీడటానికి అసలు కారణం ఇదే.. విజయసాయిరెడ్డి లేఖలో కీలక విషయాలు..
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
ఇక, దమ్ముంటే నా పక్కన చంద్రబాబుని నిజాయితీగా నిలబడమనండి అని మరోసవాల్ చేశారు ధర్మాన.. నేను నిరూపిస్తా చంద్రబాబు ఏన్నింటిలో అక్రమాలు చేసాడోనని.. మా ప్రాంతం కోసం మాట్లాడితే.. నేను అవినితి పరుడనని ముద్ర వేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. మంత్రి, ఎమ్మెల్యే పదవులు వదిలేస్తా కావాలంటే.. కానీ, మా ప్రాంత ప్రజలకోసం గోంతెత్తకుండా ఉండబోనని స్పష్టం చేశారు.. అధికార పార్టీలో ఉన్నా.. ప్రజలకోసం అధికారపార్టీనైనా ప్రశ్నిస్తానని ప్రకటించారు. నేను ఓటేయమని అడగను వేస్తేవేస్తారు లేకపోతే లేదు.. కానీ, ఓటేసినందుకు ప్రజలకోసం కష్టపడి పనిచేస్తానన్నారు.
మీలాంటి దోపిడీదారులను కంట్రోల్ చేస్తున్నందుకు సీఎం వైఎస్ జగన్ పిచ్చోడా..? అని ఫైర్ అయ్యారు మంత్రి ధర్మాన.. దోపీడీని కంట్రోల్ చేస్తేనే ప్రజలకు, బీదవారికి పంచవచ్చన్న ఆయన.. చంద్రబాబు ఓకే రాజధాని అని అమరావతిగా ప్రకటిస్తే.. మా రాష్ట్రం అక్కడ ఉండటానికి ఒప్పుకోబోమని స్పష్టం చేశారు.. విశాఖ కేంద్రంగా మాకు రాష్ట్రం కావాలి అని మరోసారి డిమాండ్ చేశారు.. పూర్తిగా వేనకపడే ఉన్నాం, జెట్టీలు లేవు, హార్బర్లులేవు, గ్రామాల్లో త్రాగునీరు లేదు.. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా మా పరిస్థితి మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!