Dharmana Prasada Rao: కావాలంటే మంత్రి, ఎమ్మెల్యే పదవులు వదిలేస్తా.. కానీ, గోంతెత్తకుండా ఉండను..!
Dharmana Prasada Rao: కావాలంటే మంత్రి, ఎమ్మెల్యే పదవులు వదిలేస్తా.. కానీ, మా ప్రాంత ప్రజలకోసం గోంతెత్తకుండా ఉండలేను అని ప్రకటించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం పట్టణంలోని పోట్టి శ్రీరాములు మార్కేట్లో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ధర్మాన ప్రసాద్ భూములు దోబ్బేశాడని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారు.. రేవిన్యూ మినిష్టర్ గా.. సెంటు భూమి ఇచ్చే అధికారం కూడా నాకు లేదు.. ఇక, రెవెన్యూ మినిస్టర్గా భూములు దోబ్బే అవకాశం ఉందా..? అని ప్రశ్నించారు.. కేబినెట్లో మాత్రమే ఏవరికైనా భూములు ఇవ్వగలదని స్పష్టం చేసిన ఆయన.. నా రాజకీయ జీవితంలో ఏపని కైనా నయా పైసా ప్రతిఫలం తీసుకున్నట్టు రుజువు చేస్తే.. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు..
Read Also: CM KCR : సీఎం కేసీఆర్తో సీఎస్ సోమేష్ కుమార్ భేటీ
Also Read
- Off The Record : తిరుపతి కలెక్టర్ వైఖరితో రెవెన్యూ శాఖలో వణుకు.. స్పాట్ లోనే అధికారులు సస్పెండ్..
- Pawan Kalyan : ఇది కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం
- Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్పై కేంద్రం మెగా ప్లాన్..
- Off The Record : పార్టీతో పాటు శెట్టిబలిజ సామాజికవర్గంలో మంత్రి సుభాష్ ఒంటరి అయ్యారా?
ఇక, దమ్ముంటే నా పక్కన చంద్రబాబుని నిజాయితీగా నిలబడమనండి అని మరోసవాల్ చేశారు ధర్మాన.. నేను నిరూపిస్తా చంద్రబాబు ఏన్నింటిలో అక్రమాలు చేసాడోనని.. మా ప్రాంతం కోసం మాట్లాడితే.. నేను అవినితి పరుడనని ముద్ర వేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. మంత్రి, ఎమ్మెల్యే పదవులు వదిలేస్తా కావాలంటే.. కానీ, మా ప్రాంత ప్రజలకోసం గోంతెత్తకుండా ఉండబోనని స్పష్టం చేశారు.. అధికార పార్టీలో ఉన్నా.. ప్రజలకోసం అధికారపార్టీనైనా ప్రశ్నిస్తానని ప్రకటించారు. నేను ఓటేయమని అడగను వేస్తేవేస్తారు లేకపోతే లేదు.. కానీ, ఓటేసినందుకు ప్రజలకోసం కష్టపడి పనిచేస్తానన్నారు.
మీలాంటి దోపిడీదారులను కంట్రోల్ చేస్తున్నందుకు సీఎం వైఎస్ జగన్ పిచ్చోడా..? అని ఫైర్ అయ్యారు మంత్రి ధర్మాన.. దోపీడీని కంట్రోల్ చేస్తేనే ప్రజలకు, బీదవారికి పంచవచ్చన్న ఆయన.. చంద్రబాబు ఓకే రాజధాని అని అమరావతిగా ప్రకటిస్తే.. మా రాష్ట్రం అక్కడ ఉండటానికి ఒప్పుకోబోమని స్పష్టం చేశారు.. విశాఖ కేంద్రంగా మాకు రాష్ట్రం కావాలి అని మరోసారి డిమాండ్ చేశారు.. పూర్తిగా వేనకపడే ఉన్నాం, జెట్టీలు లేవు, హార్బర్లులేవు, గ్రామాల్లో త్రాగునీరు లేదు.. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా మా పరిస్థితి మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!