Srikanth Reddy: రాష్ట్రంలో చంద్రబాబు సామాజిక వర్గం మాత్రమే బాగుపడాలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srikanth Reddy: మూడు రాజధానుల అంశంలో టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరిని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తప్పుబట్టారు. అమరావతి రైతుల పాదయాత్రను తాను తప్పుపట్టడం లేదని.. పాదయాత్రలో మాట్లాడిన వాళ్ల మాటలు రాయలసీమ వాసిగా తనకు బాధ కలిగించాయని తెలిపారు. మూడు రాజధానులు చేస్తే రాయలసీమకు చుక్క నీరు ఇవ్వమని అంటున్నారని.. మూడు రాజధానులు అమలు చేస్తే మధ్య ఆంధ్ర ప్రదేశ్ కోసం ఉద్యమం చేస్తామంటున్నారని.. ఈ వ్యాఖ్యల వెనుక చంద్రబాబు ఉన్నారని శ్రీకాంత్రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర విభజనకు ముఖ్య కారణం చంద్రబాబు అని.. ఇప్పుడు ప్రాంతాల మధ్య విద్వేషాలు ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించారు. అమరావతి పేరుతో ప్రజల్ని మభ్యపెట్టిన వ్యక్తి చంద్రబాబు అని.. కర్నూలులో న్యాయ రాజధాని వస్తుంది అంటే చంద్రబాబుకు ఎందుకు అంత ద్వేషమని నిలదీశారు.
చంద్రబాబు హయాంలో ఏపీకి ఎన్ని పెట్టుబడులు వచ్చాయని శ్రీకాంత్రెడ్డి ప్రశ్నించారు. ఇవాళ ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లోనే దేశంలోని 45 శాతం పెట్టుబడులు వచ్చాయని కేంద్రమే చెప్పిందన్నారు. అమరావతి ప్రాంతంలో రూ.12వేల కోట్లు ఖర్చు చేశామని చంద్రబాబు అంటున్నారని.. ఇవాళ అమరావతి ప్రాంతంలో ఒక టీ కొట్టు ఆయినా వచ్చిందా అని నిలదీశారు. అదే డబ్బులు విశాఖలో పెట్టి ఉంటే ఎంతో అభివృద్ధి జరిగి ఉండేదన్నారు. విశాఖలో ఒక భవనం కట్టినా ఎందుకు తట్టుకోలేనితనం అని.. కోర్టులకు వెళ్ళి ఎందుకు అడ్డుకుంటున్నారని సూటి ప్రశ్న వేశారు. అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే అడ్డుకుంటున్నారన.. రాష్ట్రంలో చంద్రబాబు సామాజిక వర్గం మాత్రమే బాగుపడాలా అని శ్రీకాంత్రెడ్డి చురకలు అంటించారు.
Also Read
- APSP Constable: గోదావరిలో దూకిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ మృతదేహం లభ్యం.. వేధింపులే కారణమా?
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- President Murmu AP Visit: విశాఖ పర్యటనకు రాష్ట్రపతి.. గిరిజన వర్సిటీ స్నాతకోత్సవానికి ముర్ము..
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్..
Read Also:Andhra Pradesh: దేశంలోనే ఏపీ నంబర్వన్.. ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో రికార్డు స్థాయిలో పెట్టుబడులు
మరోవైపు రాజధాని అసైన్డ్ భూముల విషయంలో కుంభకోణం జరిగిందని తాము ముందు నుంచీ ఆరోపిస్తున్నామని ఎన్టీవీతో శాసనసభ వ్యవహారాల సమన్వయకర్త శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజధాని పేరు చెప్పి చంద్రబాబు, లోకేష్ బినామీలతో వేల కోట్ల రూపాయల కుంభకోణం చేశారన్నారు. దీనికి తగిన ఆధారాలు ఉన్నాయి కాబట్టే ఇవాళ సీఐడీ ఐదుగురిని అరెస్ట్ చేసిందన్నారు. చంద్రబాబు, లోకేష్కు ధైర్యం ఉంటే విచారణకు సిద్ధం కావాలన్నారు. వార్తా ఛానెళ్ల లైవ్లో విచారణ చేద్దామన్నారు. తమ బండారం అంతా బయట పడుతుందనే భయంతోనే చంద్రబాబు పాదయాత్రలంటూ డ్రామాలు ఆడుతున్నారని.. రేపు అసెంబ్లీ వేదికగా కూడా వీటిపై చర్చిస్తామన్నారు. చంద్రబాబు పారిపోకుండా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని.. చంద్రబాబు హయాంలో చేసిన మరిన్ని కుట్రలు బయటపడతాయని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Hyderabad: చిన్న పొరపాటు.. నిండు ప్రాణం బలి! పాము కాటుకు గురై వ్యాపారవేత్త మృతి..
-
APSP Constable: గోదావరిలో దూకిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ మృతదేహం లభ్యం.. వేధింపులే కారణమా?
-
Faf du Plessis: 41 ఏళ్ల వయసులోనూ డు ప్లెసిస్ విధ్వంసం.. ప్రపచంలోనే తొలి ప్లేయర్గా రికార్డ్..
-
Maa Inti Bangaaram Day 1 Collections : ‘మా ఇంటి బంగారం’ ఫస్ట్ డే కలెక్షన్స్… అనుష్క, రష్మిక సినిమాలను మించిన వసూళ్లు
-
Instagram: ఇన్స్టాగ్రామ్లో కొత్త ఫీచర్.. కంటెంట్ క్రియేటర్లకు మరింత ప్రయోజనం
ట్రెండింగ్
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!