Dharmana Prasada Rao: పేదలకు మంచి వైద్యం అందించేందుకే జగన్ మెడికల్ కాలేజీలు తెచ్చారు..
- మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రాష్ట్రం మొత్తం వ్యతిరేకిస్తుంది..
- ఏపీలో పేదలకు మెరుగైన వైద్యం అందించడం లేదన్న మాజీ మంత్రి..
- పేదలకు మంచి వైద్యం అందించేందుకే జగన్ మెడికల్ కాలేజీలు తెచ్చారు: ధర్మాన ప్రసాద్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmana Prasada Rao: ప్రజల ఆరోగ్యం రాజ్యాంగ హక్కు అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ప్రాథమిక బాధ్యతల నుంచి తప్పించుకుంటాం అంటే ఎలా?.. 17 మెడికల్ కాలేజీలు తీసుకు వచ్చాం.. కాలేజీతో పాటు హాస్పిటల్ అందుబాటులో ఉంది.. గవర్నమెంట్ చేయలేనిది ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు చేస్తారు.. ప్రైవేట్ వ్యక్తులు దోచుకోవడానికే చూస్తారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు.. కావాలంటే ప్రభుత్వం సర్వే నిర్వహిస్తే వాస్తవాలు తెలుస్తాయి.. ప్రజల కష్టాల నుంచి దోపిడీ చేయాలనుకుంటున్నారు.. విద్య , ఆరోగ్యం ప్రజలకు చాలా అవసరం.. వైద్యం కోసమే మధ్య తరగతి కుటుంబాలు అప్పుల పాలైతున్నాయి.. కూటమి ప్రభుత్వ విధానాలు ఘోరమైన తప్పిదం.. కరోనాతో చాలా కుటుంబాలు సర్వనాశనం అయ్యాయి.. వైద్య ఖర్చులు భరించలే , అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉండేవి.. అందుకే నాడు వైఎస్సార్ ఆరోగ్య శ్రీ వంటి పథకాలు తీసుకొచ్చారు.. నేడు ఆరోగ్య శ్రీ అంటే గౌరవం లేకుండా చేశారని ప్రసాద్ రావు ఆరోపించారు.
Read Also: Maganti Sunitha: బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత, కూతురిపై కేసు నమోదు
Also Read
- Chintada Ravi Kumar Arrest: పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ రవికుమార్.. సర్కార్పై సంచలన వ్యాఖ్యలు
- YS Jagan Srikakulam Tour: శ్రీకాకుళంలో జగన్ పర్యటన పూర్తి షెడ్యూల్.. పోలీసుల కఠిన ఆంక్షలు..!
- YS Jagan Srikakulam Visit: వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ.. పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్..
- Dharmana Krishnadas: 'ఈరోజు అప్పలరాజు.. రేపు మేమే'.. కూటమి ప్రభుత్వంపై ధర్మాన సంచలన వ్యాఖ్యలు
ఇక, కూటమి ప్రభుత్వం ఆరోగ్య శ్రీ ని డైల్యూట్ చేస్తుందని మాజీ మంత్రి ప్రసాద్ రావు అన్నారు. లక్షల కోట్ల రూపాయలు ఎంబీబీఎస్ సీటు కోసం ఖర్చు చేసిన విద్యార్థులు డాక్టర్ అయ్యాక ప్రజల వద్ద నుంచి డబ్బులు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని తెలిపారు. ఉద్దానం కిడ్నీ వ్యాధితో బాధపడేవారిని రాజకీయంగా అన్ని పార్టీలు వాడుకున్నారు.. వైసీపీ ప్రభుత్వం కోట్ల రూపాయల ఖర్చు చేసి, మంచి నీరు, కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ కట్టించాం.. వైద్యం కోసం టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. సామాన్యులు కుటుంబాలకు ఆరోగ్యం పొందే అవకాశం లేదా?.. స్వతంత్రం వచ్చిన 76 ఏళ్ల తరువాత కూడా గిరిజన ప్రాంతాలలో మెడికల్ కాలేజీ అందుబాటులో లేదు.. మెడికల్ కళాశాలలు ప్రైవేట్ చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. పోరాటం చేస్తాం, ప్రభుత్వం తమ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజలను దోచేస్తున్నాయి.. చచ్చిపోయిన తరువాత కూడా వైద్యం చేస్తూ దోపిడే చేస్తున్నారని ప్రసాద్ రావు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Venkatesh VP : “కింగ్డమ్” ఫేమ్ వెంకటేష్.వి.పి. హీరోగా తెలుగు సినిమా
-
Sugar Price Hike: ఇథనాల్ వల్లే చక్కెర ధరలు పెరిగాయా.? కేంద్రం క్లారిటీ..
-
Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
-
Khelo India : ఖేలో ఇండియాకి భారీ నిధులు.. భారత క్రీడారంగానికి సరికొత్త వెలుగులు..
-
YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!