YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Viveka M*urder Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక ప్రకటన జారీ చేసింది. హైదరాబాద్, కడప జిల్లాల్లోని ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. సోదాల్లో నేరానికి సంబంధించిన కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. CBI నమోదు చేసిన FIR, దాఖలు చేసిన చార్జ్షీట్ల ఆధారంగా ఈ కేసులో ECIR నమోదు చేసినట్లు ED తెలిపింది. IPCలోని సంబంధిత సెక్షన్లు, PMLA కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొంది.
వైఎస్ అవినాష్ రెడ్డి నివాసంలో రూ.24 లక్షలు సీజ్
సోదాల్లో భాగంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసంలో లెక్కల్లో చూపని రూ.24 లక్షల నగదును గుర్తించి సీజ్ చేసినట్లు ED వెల్లడించింది. ఆ నగదుకు సంబంధించి సరైన వివరాలు ఇవ్వలేదని అధికారులు పేర్కొన్నారు. అదే సమయంలో అవినాష్ రెడ్డికి చెందిన రెండు బ్యాంక్ లాకర్ల తాళాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ED తెలిపింది. సోదాల్లో లభించిన కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ పరికరాలను తదుపరి దర్యాప్తులో పరిశీలించనున్నట్లు పేర్కొంది.
Also Read
- Drug Syndicate : డ్రగ్స్ రాజధానిపై 'ఈగల్ ఫోర్స్' ఉక్కుపాదం.. రూ.6 కోట్ల ఆస్తులు జప్తు.!
- Raidurg Land: రాయదుర్గం TGIIC భూమికి జాక్పాట్.. ఎకరం రూ.264 కోట్లు.!
- Telugu Film Industry : తెలుగు సినిమాకు తెలంగాణ సర్కార్ బిగ్ బూస్ట్.. కొత్త జీవోతో గేమ్చేంజ్.!
- CM Revanth Reddy US visit: రేవంత్ యూకే పర్యటనకు ఓకే.. యూఎస్ టూర్కు నో.. ఎందుకంటే..? కేంద్రం క్లారిటీ
హత్యకు నెల రోజుల ముందే కుట్ర జరిగిందని..
వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలాలను కూడా ED తన ప్రకటనలో ప్రస్తావించింది. హత్యకు నెల రోజుల ముందే కుట్ర జరిగినట్లు దస్తగిరి వెల్లడించినట్టు తెలిపింది. హత్య కోసం దేవిరెడ్డి శివశంకర్రెడ్డి రూ.40 కోట్లు ఆఫర్ చేసినట్లు దస్తగిరి వెల్లడించారని ED పేర్కొంది. ఆ మొత్తం నుంచి తనకు రూ.5 కోట్లు వాటాగా ఇస్తానని ఎర్ర గంగిరెడ్డి ప్రలోభపెట్టినట్లు దస్తగిరి చెప్పిన విషయాన్ని కూడా ED ప్రస్తావించింది.
సోదాల్లో కీలక ఆధారాల సేకరణ
హైదరాబాద్, కడప జిల్లాల్లో కీలక నిందితులకు సంబంధించిన నివాసాలు, ఇతర ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో పలు కీలక ఆధారాలను సేకరించినట్లు ED తెలిపింది. ముఖ్యంగా పత్రాలు, డిజిటల్ పరికరాలు, నగదు, లాకర్లకు సంబంధించిన వివరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్న ED.. CBI దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలను ఆధారంగా చేసుకుని తదుపరి చర్యలు చేపడుతున్నట్లు తన ప్రకటనలో వెల్లడించింది.
తాజావార్తలు
-
YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
-
Drug Syndicate : డ్రగ్స్ రాజధానిపై ‘ఈగల్ ఫోర్స్’ ఉక్కుపాదం.. రూ.6 కోట్ల ఆస్తులు జప్తు.!
-
Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్కు ఆయుర్వేద థెరపీ.. రేపు కేరళకు డిప్యూటీ సీఎం
-
Makkah: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్కు ముప్పు పొంచి ఉందా?
-
Tata Cars Price Hike: టాటా కార్లు కొనేవారికి ఇదే చివరి ఛాన్స్..! పెరగనున్న పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఈవీ కార్ల ధరలు
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!