YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Viveka M*urder Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక ప్రకటన జారీ చేసింది. హైదరాబాద్, కడప జిల్లాల్లోని ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. సోదాల్లో నేరానికి సంబంధించిన కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. CBI నమోదు చేసిన FIR, దాఖలు చేసిన చార్జ్షీట్ల ఆధారంగా ఈ కేసులో ECIR నమోదు చేసినట్లు ED తెలిపింది. IPCలోని సంబంధిత సెక్షన్లు, PMLA కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొంది.
వైఎస్ అవినాష్ రెడ్డి నివాసంలో రూ.24 లక్షలు సీజ్
సోదాల్లో భాగంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసంలో లెక్కల్లో చూపని రూ.24 లక్షల నగదును గుర్తించి సీజ్ చేసినట్లు ED వెల్లడించింది. ఆ నగదుకు సంబంధించి సరైన వివరాలు ఇవ్వలేదని అధికారులు పేర్కొన్నారు. అదే సమయంలో అవినాష్ రెడ్డికి చెందిన రెండు బ్యాంక్ లాకర్ల తాళాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ED తెలిపింది. సోదాల్లో లభించిన కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ పరికరాలను తదుపరి దర్యాప్తులో పరిశీలించనున్నట్లు పేర్కొంది.
Also Read
హత్యకు నెల రోజుల ముందే కుట్ర జరిగిందని..
వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలాలను కూడా ED తన ప్రకటనలో ప్రస్తావించింది. హత్యకు నెల రోజుల ముందే కుట్ర జరిగినట్లు దస్తగిరి వెల్లడించినట్టు తెలిపింది. హత్య కోసం దేవిరెడ్డి శివశంకర్రెడ్డి రూ.40 కోట్లు ఆఫర్ చేసినట్లు దస్తగిరి వెల్లడించారని ED పేర్కొంది. ఆ మొత్తం నుంచి తనకు రూ.5 కోట్లు వాటాగా ఇస్తానని ఎర్ర గంగిరెడ్డి ప్రలోభపెట్టినట్లు దస్తగిరి చెప్పిన విషయాన్ని కూడా ED ప్రస్తావించింది.
సోదాల్లో కీలక ఆధారాల సేకరణ
హైదరాబాద్, కడప జిల్లాల్లో కీలక నిందితులకు సంబంధించిన నివాసాలు, ఇతర ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో పలు కీలక ఆధారాలను సేకరించినట్లు ED తెలిపింది. ముఖ్యంగా పత్రాలు, డిజిటల్ పరికరాలు, నగదు, లాకర్లకు సంబంధించిన వివరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్న ED.. CBI దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలను ఆధారంగా చేసుకుని తదుపరి చర్యలు చేపడుతున్నట్లు తన ప్రకటనలో వెల్లడించింది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?