Home Minister Anitha: ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే.. మాజీ సీఎం గనుక జగన్కు భద్రత ఇచ్చాం..
- మాజీ సీఎం గనుక వైఎస్ జగన్కు భద్రత ఇచ్చాం..
- ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే..
- వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ మాత్రమే ఆయనకు వర్తిస్తుంది..
- హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు..
Home Minister Anitha: శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించిందని వైసీపీ నేతలు అంటున్నారు.. అంతే కాదు.. వైఎస్ జగన్ను లేకుండా చేసే కుట్రలు కూడా జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు.. అయితే, జగన్కు తగినంత పోలీసు బందోబస్తు ఇచ్చామని చెప్పింది ప్రభుత్వం.. మాజీ సీఎం గనుక వైఎస్ జగన్కు భద్రత ఇచ్చాం.. ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే.. వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ మాత్రమే ఆయనకు వర్తిస్తుందన్నారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. అయితే, కేవలం రచ్చ చేయాలనే నాటకాలు ఆడారంటూ ఫైర్ అయ్యారు.. ముందు సాంకేతిక సమస్యలు ఉన్నాయి అన్న హెలికాప్టర్.. 10 నిమిషాల తరువాత ఎలా గాలిలోకి ఎగిరింది..? అని ప్రశ్నించారు.. విజయనగరం, మన్యం , శ్రీకాకుళం జిల్లా పోలీసు అధికారులతో రివ్యూ నిర్వహించిన హోం మంత్రి అనిత.. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు..
Read Also: Murder : ములుగు జిల్లాలో దారుణం.. గొడ్డలితో నరికి గిరిజన యువకుడిని హత్య
Also Read
- Dharmana Prasada Rao: ఇలా చేస్తే.. ఇంకో రాష్ట్రం కోసం ఉద్యమం..! వాటికి ఆజ్యం పోయకండి..
- Social Boycott: శ్రీకాకుళంలో సామాజిక బహిష్కరణ.. పనులకు, శుభకార్యాలకు పిలవద్దు అంటూ దండోరా..
- Dharmana Prasada Rao: కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదు..
- Gunda Appala Suryanarayana Passes Away: కాలుజారి పడిపోయిన మాజీ మంత్రి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత..
కేసుల ఇన్వెస్టిగేషన్ లో సాంకేతికత వినియోగిస్తున్నాం అన్నారు అనిత.. ఎక్కడ గ్యాప్స్ లేకుండా చర్యలు చేపడుతున్నాం.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉంని స్పష్టం చేశారు.. శ్రీకాకుళంలో నాలుగు కోట్ల ప్రాపర్టీని రికవరీ చేశాం.. పాడేరు, మన్యం వంటి చోట్ల గంజాయి సాగుని నివారించాం. మాదకద్రవ్యాల కేసులలో మూలాలు కనుక్కొని, ఆస్తులు జప్తు చేస్తున్నాం. గంజాయి సాగు చేసినా, స్మగ్లింగ్ చేసినా, కొనుగోలు చేసినా.. పీడీ యాక్ట్ పెడుతున్నాం. పాక్సో కేసులలో బెయిల్ లేకుండా , శిక్ష పడేలా చూస్తున్నాం అన్నారు.. డ్రోన్, సీసీ కెమెరాలు ఉపయోగిస్తూ నేరస్తులను పట్టుకుంటున్నాం. ఈగల్ టీమ్ , సంకల్ప ప్రోగ్రాం తీసుకుంటున్నాం. యాక్టివ్ రౌడీ షీటర్ పై నిఘా ఉంచాం… స్కూళ్ల వద్ద కూడా ఈగల్ టీమ్ ఏర్పాటు చేశాం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.. సైబర్ క్రైమ్ స్టేషన్ జిల్లాకు ఒక స్టేషన్ పెట్టాలి అనుకుంటున్నట్టు వెల్లడించారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత..
తాజావార్తలు
-
New OTT Rules 2026 : ఓటీటీలో కొత్త రూల్స్.. నిర్మాతలకు ‘షాక్’.. వసూళ్లు లేకపోతే రైట్స్ కట్!
-
Ashu Reddy: ప్రేమ, పెళ్లి పేరుతో 9 కోట్లు స్వాహ.. బిగ్ బాస్ అషు రెడ్డి పై సైబర్ కేసు
-
న్యూ లుక్లో YS Jagan.. యూరప్ టూర్కు బయల్దేరిన మాజీ సీఎం.!
-
Lungi Ngidi Injury: లుంగి ఎంగిడికి తీవ్ర గాయం.. 11 నిమిషాల్లోనే ఆస్పత్రికి అంబులెన్స్, తాజా అప్డేట్ ఇదే!
-
Amani: అందుకే మెగాస్టార్ సరసన నటించలేదు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!