Home Minister Anitha: ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే.. మాజీ సీఎం గనుక జగన్కు భద్రత ఇచ్చాం..
- మాజీ సీఎం గనుక వైఎస్ జగన్కు భద్రత ఇచ్చాం..
- ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే..
- వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ మాత్రమే ఆయనకు వర్తిస్తుంది..
- హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Minister Anitha: శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించిందని వైసీపీ నేతలు అంటున్నారు.. అంతే కాదు.. వైఎస్ జగన్ను లేకుండా చేసే కుట్రలు కూడా జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు.. అయితే, జగన్కు తగినంత పోలీసు బందోబస్తు ఇచ్చామని చెప్పింది ప్రభుత్వం.. మాజీ సీఎం గనుక వైఎస్ జగన్కు భద్రత ఇచ్చాం.. ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే.. వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ మాత్రమే ఆయనకు వర్తిస్తుందన్నారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. అయితే, కేవలం రచ్చ చేయాలనే నాటకాలు ఆడారంటూ ఫైర్ అయ్యారు.. ముందు సాంకేతిక సమస్యలు ఉన్నాయి అన్న హెలికాప్టర్.. 10 నిమిషాల తరువాత ఎలా గాలిలోకి ఎగిరింది..? అని ప్రశ్నించారు.. విజయనగరం, మన్యం , శ్రీకాకుళం జిల్లా పోలీసు అధికారులతో రివ్యూ నిర్వహించిన హోం మంత్రి అనిత.. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు..
Read Also: Murder : ములుగు జిల్లాలో దారుణం.. గొడ్డలితో నరికి గిరిజన యువకుడిని హత్య
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Dharmana Prasada Rao: ఇలా చేస్తే.. ఇంకో రాష్ట్రం కోసం ఉద్యమం..! వాటికి ఆజ్యం పోయకండి..
- Social Boycott: శ్రీకాకుళంలో సామాజిక బహిష్కరణ.. పనులకు, శుభకార్యాలకు పిలవద్దు అంటూ దండోరా..
- Dharmana Prasada Rao: కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదు..
కేసుల ఇన్వెస్టిగేషన్ లో సాంకేతికత వినియోగిస్తున్నాం అన్నారు అనిత.. ఎక్కడ గ్యాప్స్ లేకుండా చర్యలు చేపడుతున్నాం.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉంని స్పష్టం చేశారు.. శ్రీకాకుళంలో నాలుగు కోట్ల ప్రాపర్టీని రికవరీ చేశాం.. పాడేరు, మన్యం వంటి చోట్ల గంజాయి సాగుని నివారించాం. మాదకద్రవ్యాల కేసులలో మూలాలు కనుక్కొని, ఆస్తులు జప్తు చేస్తున్నాం. గంజాయి సాగు చేసినా, స్మగ్లింగ్ చేసినా, కొనుగోలు చేసినా.. పీడీ యాక్ట్ పెడుతున్నాం. పాక్సో కేసులలో బెయిల్ లేకుండా , శిక్ష పడేలా చూస్తున్నాం అన్నారు.. డ్రోన్, సీసీ కెమెరాలు ఉపయోగిస్తూ నేరస్తులను పట్టుకుంటున్నాం. ఈగల్ టీమ్ , సంకల్ప ప్రోగ్రాం తీసుకుంటున్నాం. యాక్టివ్ రౌడీ షీటర్ పై నిఘా ఉంచాం… స్కూళ్ల వద్ద కూడా ఈగల్ టీమ్ ఏర్పాటు చేశాం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.. సైబర్ క్రైమ్ స్టేషన్ జిల్లాకు ఒక స్టేషన్ పెట్టాలి అనుకుంటున్నట్టు వెల్లడించారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత..
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..