Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ys Jagan Interesting Comments On Ysrcp Defeat In 2024 Elections

YS Jagan: అందుకే ఓడిపోయాం.. జగన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Published Date :July 4, 2024 , 5:35 pm
By Sudhakar Ravula
  • వైసీపీ ఓటమిపై వైఎస్‌ జగన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
  • ప్రజల్లో వ్యతిరేకతతో వైసీపీ ఓడిపోలేదు.. మంచి చేసిన ఓడిపోయమన్న మాజీ సీఎం..
  • చంద్రబాబు మోసపూరిత హామీలు ఇచ్చారు.. దాంతో 10 శాతం ఓట్లు ఆయనకు అదనంగా వచ్చాయన్న జగన్..
  • నెల్లూరు సెంట్రల్‌ జైలులో పిన్నెల్లిని కలిసిన వైసీపీ అధినేత..
YS Jagan: అందుకే ఓడిపోయాం.. జగన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

YS Jagan: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసులో అరెస్ట్‌ అయ్యి.. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ములాఖత్‌లో కలిసిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద 307 సెక్షన్ కింద కేసు పెట్టారు.. అన్యాయంగా జైల్లో నిర్బంధించారు.. రాష్ట్రవ్యాప్తంగా ఇవే కార్యక్రమాలు జరుగుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.. టీడీపీకి ఓటు వేయలేదనే కారణంతోనే ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు దొంగ కేసులు పెడుతున్నారు.. వాళ్లే దాడి చేసి వైసీపీ నేతలపై కేసులు పెడుతున్నారు.. ఇంత దారుణంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని మండిపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఏం చేశాడు.. కులం మతం ప్రాంతం చూడలేదు.. ఏ పార్టీకి ఓటు వేశారు అనే విషయాన్ని కూడా చూడకుండా అందరికీ ప్రభుత్వ పథకాలను ఇంటికి అందించామని గుర్తుచేసుకున్నారు.

Read Also: DMK Leader Stokes Row: కుక్క కూడా బీఏ పట్టా పొందగలదు.. డీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు

అయితే, ఈరోజు టీడీపీకి ఓటు వేయలేదని మనుషులను కొట్టి కేసులు పెడుతున్నారు.. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారు.. వైయస్సార్ విగ్రహాలను పగలగొడుతున్నారు.. ఈ విధంగా దౌర్జన్యాలు చేసి తప్పుడు కేసులు పెట్టి ఆస్తులు ధ్వంసం చేసి రాజకీయాలు చేస్తున్నారు అని మండిపడ్డారు వైఎస్ జగన్.. ఇలానే పరిస్థితి కొనసాగితే చంద్రబాబుకు బుద్ధి చెబుతారు అని హెచ్చరించారు.. ప్రజలు ఎందుకు ఓటు వేశారు చంద్రబాబు ఆలోచించాలన్న ఆయన.. ప్రజల్లో వ్యతిరేకతతో వైసీపీ ఓడిపోలేదు.. ప్రజలకు మంచి చేసిన ఓడిపోయాం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు మోసపూరిత హామీలను ఇచ్చారు.. అందువల్లే 10 శాతం ఓట్లు ఆయనకు అధనంగా వచ్చాయి అన్నారు జగన్.. ఇక, రైతులకు భరోసా ఇస్తామని చెప్పారు.. ఇంతవరకు అతీగతి తెలియదు.. ఎంతమంది పిల్లలు ఉన్నా అమ్మ ఒడి ఇస్తానని చెప్పారు.. తల్లికి వందనం అని పేరు మార్చారు.. కానీ, ఆ డబ్బులు ఏమయ్యాయి? అని నిలదీశారు.

Read Also: Bhatti Vikramarka: ప్రధాని మోడీ, అమిత్ షాతో సీఎం రేవంత్ చర్చలు.. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వినతిపత్రం

18 ఏళ్లు పైబడిన మహిళలకు నెలకు 15 వందల ఆర్థిక సాయం చేస్తామన్నారు.. వీటి మీద దృష్టి పెట్టే పని చంద్రబాబు చేయాలి.. ఇవేవి పట్టించుకోకుండా భయాందోళనలకు గురిచేస్తున్నారు అని ఆరోపించారు జగన్.. కారంపూడిలో ఘటన ఎన్నికలు జరిగిన మరుసటి రోజు జరిగింది.. డీఎస్పీ అనుమతి తీసుకుని దళిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎమ్మెల్యే వెళ్లారు.. మే 14న ఘటన జరిగితే తొమ్మిది రోజుల తర్వాత రామకృష్ణారెడ్డి పై హత్యాయత్నం కేసు పెట్టారు.. ఒక పథకం ప్రకారమే కేసులు పెట్టారు.. ఎన్నికల రోజున పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో వద్ద జరిగిన ఘటన కేసు పెట్టారని.. దళితులను ఓటు వేయకుండా అడ్డుకున్నారు.. దాన్ని ప్రశ్నించేందుకు పిన్నెల్లి వెళ్లారు.. దానిపై కేసు పెట్టారని విమర్శించారు. సిట్ నివేదికలో ఏం జరిగిందో చెప్పలేదని ఫైర్‌ అయ్యారు.. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా రామకృష్ణారెడ్డి గెలిచారు.. మంచివాడు కాబట్టే కాదా? ఆయన విజయం సాధించింది..? అలాంటి వ్యక్తిని తప్పుడు కేసుల్లో ఇరికించడం ఎంతవరకూ ధర్మం? అని ప్రశ్నించారు. ఎల్లకాలం చంద్రబాబు అధికారంలో ఉండరు.. చంద్రబాబు పాపంపండుతుంది.. ప్రజల బుద్ధి చెప్పే రోజులు వస్తాయి.. ఇదే మాదిరిగా కొనసాగితే ఇప్పుడు కొత్త సంప్రదాయానికి నాంది పలుకుతుంది.. ఈ రోజు ఏమైతా విత్తనం వేస్తావో అదే పండుతుంది.. చంద్రబాబు ఇప్పటికైనా ధోరణి మార్చుకోవాలని హెచ్చరించారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Elections 2024
  • Pinnelli Ramakrishna Reddy
  • ys jagan
  • YSRCP

తాజావార్తలు

  • Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.174 కోట్లు తిరిగి చెల్లింపు

  • Off The Record : కాంగ్రెస్ నేత ప్రపోజల్ విని కేటీఆర్ షాక్?

  • Off The Record: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?

  • Deve Gowda: కాంగ్రెస్‌తో అందుకే విడాకులు.. ఖర్గే పంచ్‌లపై దేవెగౌడ కౌంటర్

  • Hyderabad: ఇలా చేస్తుంటే సిలిండర్ల కొరత ఎందుకు రాదు? భారీ దందా!

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions