Bhatti Vikramarka: ప్రధాని మోడీ, అమిత్ షాతో సీఎం రేవంత్ చర్చలు.. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వినతిపత్రం
- ప్రధాని మోడీ.. అమిత్ షాతో సీఎం రేవంత్
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చలు
- రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వినతిపత్రం
- సాధ్యమైనంత వరకు అన్ని అంశాలను పరిష్కరిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది- భట్టి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, సింగరేణి బొగ్గు గనులు, పెండింగ్ లో ఉన్న విభజన హామీలు, రక్షణ శాఖ భూముల బదిలీతో పాటు మొత్తం 12 అంశాలపై వినతి పత్రాలు అందించారు.
Hemant Soren: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణం
Also Read
- Pakistan: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు..!
- Chicken and Egg Prices: నాన్వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
- Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..
- Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి, విభజన చట్టం అంశాలపై ప్రధాని మోడీ, అమిత్ షాకి విజ్ఞాపనలు ఇచ్చామని తెలిపారు. అలాగే.. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న సింగరేణి కోల్ బ్లాక్స్ వేలం లేకుండా ఇవ్వాలని కోరామన్నారు. తెలంగాణకు ఒక ఐఐఎం ఇవ్వాలని కోరామని.. ఐటీఐఆర్ ప్రాజెక్ట్, తెలంగాణలో సెమి కండక్టర్ ప్లాంట్ ఏర్పాటు, ప్రతి జిల్లాకు నవోదయ విద్యాలయం ఇవ్వాలని కోరామన్నారు. అంతేకాకుండా.. కస్తూర్బా విద్యాలయాలు, రక్షణ శాఖ భూములను కోరామన్నారు.
PM Modi: వచ్చే వారం రష్యా, ఆస్ట్రియా దేశాల్లో పర్యటించనున్న ప్రధాని మోడీ
విభజన చట్టం షెడ్యూల్ 9,10 అపరిష్కృతంగా ఉన్న అంశాలను వెంటనే పరిష్కారం చూపాలని కోరామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలని, రీజనల్ రింగ్ రోడ్ కు ఒకే నంబర్ ఇవ్వాలని ప్రధానిని కోరామని చెప్పారు. రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా తయారు చేయాలన్నది తమ లక్ష్యమని పేర్కొన్నారు. అంతేకాకుండా.. భద్రాచలం నియోజకవర్గంలోని 5 గ్రామాలు తెలంగాణలో కలపాలని కోరామన్నారు. సాధ్యమైనంత వరకు అన్ని అంశాలను పరిష్కరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని భట్టి విక్రమార్క చెప్పారు. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ సాధించడం కోసం తమ ప్రయత్నం చేస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు.
తాజావార్తలు
-
Pakistan: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు..!
-
K. Bhagyaraj : ప్రముఖ దర్శకులు, నటుడు కే భాగ్యరాజ్ మృతి..
-
Chicken and Egg Prices: నాన్వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
-
Samantha : సమంత వర్సెస్ శోభితా-చైతూ.. విడిపోయినా ఆగని సోషల్ మీడియా వార్!
-
Rahul Dev: భార్య మరణంతో కుప్పకూలిపోయా.. కొడుకే నా జీవితాన్ని మార్చేశాడు: రాహుల్ దేవ్
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!