DMK Leader Stokes Row: కుక్క కూడా బీఏ పట్టా పొందగలదు.. డీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు
- డీఎంకే నేత ఆర్ఎస్ భారతి వివాదాస్పద వ్యాఖ్యలు
- నేడు కుక్కలు కూడా బీఏ పట్టాలు పొందుతున్నాయన్న డీఎంకే నేత
- దుమారం రేపిన ఆర్ఎస్ భారతి వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DMK Leader Stokes Row: నీట్ పరీక్షకు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలో డీఎంకే నేత ఆర్ఎస్ భారతి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తమిళనాడులో అందరికీ విద్య అందుబాటులోకి తెచ్చింది ద్రవిడ ఉద్యమమేనని భారతి చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైంది. నేడు కుక్కలు కూడా బీఎ పట్టాలు పొందుతున్నాయని వ్యాఖ్యానించారు. నీట్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డీఎంకే విద్యార్థి విభాగం కార్యదర్శి, కాంచీపురం ఎమ్మెల్యే ఎజిలరసన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా భారతి ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Hemant Soren: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణం
Also Read
- MK Stalin: 'డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్'.. విజయ్పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
- Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్మీట్పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
- Tamil Politics: కరుణానిధి, జయలలితకు తప్పలేదు.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు..
- MK Stalin: ‘అహంకారం.. వినాశనానికే’.. విజయ్ ప్రభుత్వంపై ఎంకే. స్టాలిన్ ఆగ్రహం
“నేను బి.ఎల్తో న్యాయవాదిని. ఎళిలరాసన్ బి.ఇ., బి.ఎల్. ఇవేవీ ఏ వంశం లేదా తెగ నుండి వచ్చినవి కావు. నేను బి.ఏ చేస్తున్నప్పుడు సిటీలో ఒకరే చదివేవారు. ఇంటి ముందు నేమ్ బోర్డు పెట్టేవారు. ఈరోజు నగరంలో అందరూ డిగ్రీ చదువుతున్నారు, కుక్క కూడా బీఏ పట్టా పొందగలదు. ఈ ప్రగతి వెనుక ద్రవిడ ఉద్యమం ఉంది’’ అని ఆర్ఎస్ భారతి అన్నారు. ఆర్ఎస్ భారతి ప్రకటనపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఆర్ఎస్ భారతి ప్రకటన తమిళనాడు విద్యార్థులందరినీ అవమానించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అన్నారు. తమిళనాడులో ద్రవిడ ఉద్యమమే ప్రధాన కారణమని డీఎంకే సంస్థాగత కార్యదర్శి ఆర్ఎస్ భారతి అన్నారు. కుక్క కూడా బీఎ పట్టా పొందే పరిస్థితి నేడు నెలకొందని అన్నారు. నీట్-యూజీ వైద్య పరీక్షకు వ్యతిరేకంగా నిరసన సందర్భంగా భారతి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. డీఎంకె నేతపై చర్య తీసుకోవాలని బీజేపీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను కోరింది.
எப்போதெல்லாம், திமுக ஆட்சிக்கு, பொதுமக்களிடையே பலத்த எதிர்ப்பு வருகிறதோ, அப்போதெல்லாம், அறிவாலய வாசலிலேயே இருக்கும் திரு. ஆர்.எஸ்.பாரதியை ஏவி விடுவார்கள் போல. கள்ளக்குறிச்சியில், திமுக ஆதரவோடு நடந்த கள்ளச்சாராய விற்பனையில் 65 உயிர்கள் பலியானதை மடைமாற்ற, திரு. ஆர்.எஸ்.பாரதியைக்… pic.twitter.com/yLjpcK9Lkh
— K.Annamalai (@annamalai_k) July 3, 2024
తాజావార్తలు
-
Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
-
MK Stalin: ‘డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్’.. విజయ్పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!