Manipur : మందుబాబు మేలుకో.. 30ఏళ్ల నిషేధానికి తెర.. తాగేంత తాగేసెయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur : ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ రాష్ట్రంలో మద్యపాన నిషేధానికి తెరపడింది. ఈ రాష్ట్రంలో దాదాపు 30 సంవత్సరాలుగా మద్యం అమ్మడం, త్రాగడం నిషేధించబడింది. అయితే ఇప్పుడు మణిపూర్లో మద్యం అమ్మకం, వినియోగం చట్టవిరుద్ధం కాదు. ఇష్టానుసారం ప్రజలు ఇప్పుడు మద్యం తాగేయవచ్చు. గ్రేటర్ ఇంఫాల్, జిల్లా ప్రధాన కార్యాలయం, పర్యాటక ప్రదేశాలలో ఇక నుండి మద్యం విక్రయించవచ్చు.. వినియోగించవచ్చు. అలాగే, రిజిస్టర్ చేయబడిన కనీసం 20 కంటే ఎక్కువ గదులు ఉన్న హోటళ్లకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వర్తిస్తుంది.
Read Also:Indian Students: విదేశాల్లో భారతీయ విద్యార్థులు.. ఐదేళ్లలో 403 మంది మృతి
Also Read
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
- Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
- Silver Cleaning Tips: వెండి పాత్రలు, ఆభరణాలు నల్లబడ్డాయా?.. ఇంట్లోనే మెరిపించే ఈజీ టెక్నిక్ ఇదే
1991లో మణిపూర్లో మద్యపాన నిషేధం అమలులోకి వచ్చింది. 1991 నాటి ఆ ఉత్తర్వును ఇప్పుడు రాష్ట్ర గవర్నర్ ఉపసంహరించుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల రాష్ట్రానికి ఏటా కనీసం రూ.600 కోట్ల ఆదాయం వస్తుందని ఈ విషయంపై అవగాహన ఉన్న ఓ అధికారి తెలిపారు. మద్యం అమ్మడం లేదా తాగడంపై నిషేధం ఉన్న అన్ని రాష్ట్రాల్లో మద్యం ద్వారా భారీ ఆదాయాన్ని కోల్పోతున్నారు. దానికి బీహార్ ఉదాహరణ. అయితే, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాత్రం మద్య నిషేధం నిర్ణయం సమాజ ప్రయోజనాల దృష్ట్యా అంటున్నారు.
Read Also:CM Revanth Reddy: కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ ఆరా.. అధికారులకు ఆదేశాలు
మణిపూర్లో మద్యపాన నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని సోమవారం నాడు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ రోజు ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో మద్యం అమ్మకాలు, వినియోగంపై నిషేధాన్ని ఎత్తివేయడానికి అంగీకరించారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి గవర్నర్ ఉత్తర్వులు కూడా వచ్చాయి. ఈ విధంగా మద్యం వినియోగం ఇప్పుడు ఈ రాష్ట్రంలో చట్టబద్ధమైంది. మే నుంచి మణిపూర్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు కూడా రాష్ట్రం నుండి అప్పుడప్పుడు హింసాత్మక నివేదికలు వస్తూనే ఉన్నాయి.
తాజావార్తలు
-
Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
-
Crude Oil Price Today: బ్యారెల్కు 100 డాలర్లకు చేరువలో ముడి చమురు.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం ఎంత?
-
Students Protest : ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ ఘటనపై సల్మాన్ ఖాన్ ట్వీట్ వైరల్
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి