Somu Veerraju: సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు.. జూ.ఎన్టీఆర్కు అవన్నీ బాగా తెలుసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somu Veerraju: విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో గురుపూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరును సోము వీర్రాజు ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో నృత్యం చేసిన చిన్నారి గురించి ప్రస్తావిస్తూ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ చక్కటి నటుడు అని.. భరత నాట్యాన్ని అభ్యసించాడని.. బాల రామాయణం జూనియర్ ఎన్టీఆర్ తొలి సినిమా అని.. భరత నాట్యంలో ముద్ర, అంగీకం, భంగిమలు వంటివి జూనియర్ ఎన్టీఆర్కు బాగా తెలుసు అని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. అయితే కళాకారుల గురించి తాను పెద్దగా చెప్పలేనని.. కానీ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తెస్తే అందరికీ అర్థమవుతుందని చెప్పానని పేర్కొన్నారు.
Read Also: Football-Sized Tumour: మహిళ కడుపులో ఫుట్బాల్ సైజులో కణితి.. తొలగించిన వైద్యులు
Also Read
- Motkupalli Narasimhulu: ఎన్టీఆర్ను గుర్తుచేసుకుంటూ మోత్కుపల్లి భావోద్వేగం.. “మనసున్న నాయకుడిని మళ్లీ చూడలేం”
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
- RK Roja: మరోసారి విరుచుకుపడ్డ రోజా.. టీడీపీ మహానాడుపై తీవ్ర విమర్శలు..
- TDP Mahanadu: మహానాడులో చంద్రబాబు కీలక తీర్మానం.. ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలి..
మరోవైపు ఏపీ సీఎం జగన్పై సోము వీర్రాజు విమర్శలు చేశారు. జగన్కు ఉపాధ్యాయుడు అంటే ఎవరో తెలీదని.. విద్యావంతులైన తెలుగు వాళ్లు ప్రపంచం అంతా ఉన్నారని.. ఏ మూలకెళ్లినా కచ్చితంగా పది మందైనా తెలుగు వాళ్లు కన్పిస్తారని.. అలాంటి ఖ్యాతి తెలుగు గడ్డకు ఉందని సోము వీర్రాజు అన్నారు. విద్యకు, ఉపాధ్యాయులకు ఇంత పెద్ద పీట వేసిన రాష్ట్రంలో టీచర్లకు సరైన గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానన్న సీఎం జగన్.. ఇప్పుడు మాట మార్చారని మండిపడ్డారు. ఇప్పుడు సీపీఎస్ గురించి మాట్లాడితే టీచర్లనే కాదు.. వాళ్ల కుటుంబ సభ్యులను జైల్లో వేసేస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులను పాలకులు అర్ధం చేసుకోవాలని.. జాతి భవిష్యత్తును నిర్దేశించింది ఉపాధ్యాయులే అన్నారు. పెద్ద ఎత్తున చైతన్యం కలిగిన టీచర్ల సంఘాలు ఉన్న ఈ రాష్ట్రంలో వైసీపీకి 151 సీట్లు వచ్చాయన్నారు. జగన్కు మంచి బుద్ధి రావాలని టీచర్లు భగవంతుణ్ని కోరుకోవాలని సూచించారు. జగన్ విషయంలో భగవంతుణ్ని కోరుకోవడం మినహా మరే ప్రత్యామ్నాయం లేదని సోము వీర్రాజు అన్నారు.
తాజావార్తలు
-
Motkupalli Narasimhulu: ఎన్టీఆర్ను గుర్తుచేసుకుంటూ మోత్కుపల్లి భావోద్వేగం.. “మనసున్న నాయకుడిని మళ్లీ చూడలేం”
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Vaibhav Suryavanshi: అన్బిలీవబుల్ ప్లేయర్.. వండర్ కిడ్.. పవర్ బ్యాటింగ్కు బ్రాండ్ అంబాసిడర్!
-
Ajit Agarkar: “వైభవ్ ఇంకా చిన్నోడే”.. టీమిండియాలోకి బుడ్డోడి ఎంట్రీపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ సంచలన వ్యాఖ్యలు..
-
Drishyam 3 : మోహన్ లాల్ ఖాతాలో మరో రికార్డ్.. జస్ట్ 7 రోజుల్లో సెన్సేషన్
ట్రెండింగ్
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..