Somu Veerraju: నాపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు.. వైఎస్ వివేకా కేసులో ఎవ్వరినీ కాపాడం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somu Veerraju: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. తిరుపతిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు నిస్పక్షపాతంగా జరుగుతోందన్నారు.. అయితే, ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం ఎవ్వరినీ కాపాడదు అని.. సీబీఐ తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు.. ఇక, వెయ్యి కోట్ల రూపాయలు అంటూ ఏపీలో బ్లాక్ మెయిల్ రాజకీయాలు నడుస్తున్నాయి.. వీటికి చరమగీతం పాడుతాం అన్నారు సోము వీర్రాజు. మరోవైపు.. ఇప్పుడు నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యే లు ఉంటున్నారు.. ఎమ్మెల్యేల కుటుంబీకులు అరాచకాలు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: YS Jagan Tenali Tour: రేపు తెనాలి పర్యటనకు సీఎం జగన్.. వారికి గుడ్న్యూస్
Also Read
- AP Cabinet Meeting: కేబినెట్ ముందు 25కి పైగా కీలక ప్రతిపాదనలు.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
- Andhra Pradesh: సర్కార్ కీలక నిర్ణయం.. భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్..
ఎమ్మెల్సీ ఎన్నికలకు తిరుపతిలో దొంగ ఓట్లను నమోదు చేయించారని ఆరోపణలు గుప్పించారు సోము వీర్రాజు.. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎవరికీ ఏజెంట్గా పనిచేయదన్న ఆయన.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి తీరుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఇక, తనపై మా పార్టీ నేతలు ఎవరూ అధిష్టానానికి ఫిర్యాదు చేయలేదన్నారు వీర్రాజు.. మరోవైపు.. అప్పర్ భద్ర ప్రాజెక్ట్ వల్ల సీమకు ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేశారు.. కాగా, గత కొంత కాలంగా ఏపీ బీజేపీలో పరణామాలు హాట్ టాపిక్గా మారిపోయాయి.. బీజేపీకి గుడ్బై చెప్పారు మాజీ మంత్రి, బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.. ఆయన దారిలోనే మరికొందరు నేతలు కూడా రాజీనామా చేస్తారనే చర్చ సాగుతోంది.. ఇంకోవైపు.. కొందరు ఏపీకి చెందిన బీజేపీ నేతలు.. సోము వీర్రాజుపై గుర్రుగా ఉన్నారని.. వీర్రాజుపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారనే ప్రచారం సాగింది.. ఈ తరుణంలో.. తనపై అధిష్టానికి ఎవరూ ఫిర్యాదు చేయలేదంటూ సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Objection My Lord Trailer : మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ‘అబ్జెక్షన్ మై లార్డ్’ ట్రైలర్ విడుదల
-
Rahul Gandhi on NEET Paper Leak: “యువత భవిష్యత్తును ఎక్కువగా దెబ్బతీసింది మీరే”.. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ కౌంటర్
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
AP Cabinet Meeting: కేబినెట్ ముందు 25కి పైగా కీలక ప్రతిపాదనలు.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
-
US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
ట్రెండింగ్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!