Somu Veerraju: ఏపీలో ఇసుక కంటే బంగారమే ఈజీగా దొరుకుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somu Veerraju Fires On YCP Govt Over Sand Issue: ఏపీలో ఇసుక కంటే బంగారమే ఈజీగా దొరుకుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగారం షాపుకెళ్తే బంగారం లభిస్తుందని.. కానీ ఏపీలో కళ్ల ముందున్న ఇసుక మాత్రం ప్రజలకు అందుబాటులోకి రావడం లేదని అన్నారు. గత ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం పేరుతో దొపిడీ చేశారని ఆరోపించారు. టీడీపీ హయాంలో రెండు యూనిట్ల ఇసుక రూ. 5 వేలకు దొరికితే.. ఇప్పుడు రూ. 13 వేలు ఉంటోందన్నారు. భవన నిర్మాణాలపై ఆధారపడ్డ కార్మికులు నానా తిప్పలు పడుతున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన టిడ్కో ఇళ్లను ఇప్పటిదాకా ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. పేదలకిచ్చిన ఇళ్ల స్థలాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిర్మించాల్సిన ఇళ్లను ఎందుకు నిర్మించడం లేదని నిలదీశారు.
ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం తన వాటాను ఇవ్వడానికి సిద్దంగా ఉందని.. కానీ జగన్ ప్రభుత్వమే తన వాటా ఇవ్వడం లేదని సోము వీర్రాజు కుండబద్దలు కొట్టారు. బొప్పాయి పళ్లను అమ్మేవాళ్లు పేటీఎంలు పెడుతున్న ఈరోజుల్లో.. మద్యం దుకాణాల్లో ఎందుకు డిజిటల్ పేమెంట్లను అంగీకరించడం లేదని నిలదీశారు. ఈ ప్రభుత్వం ప్రాజెక్టుల గేట్లకు గ్రీజ్ పెట్టే పరిస్థితి లేదని.. ఎప్పుడు చూసినా పోలవరం పోలవరం అంటూ జపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పోలవరానికి రూ. 55 వేల కోట్లు ఇస్తే.. ఆ డబ్బు మొత్తం తినేయొచ్చనే ఆశ ఇక్కడి నేతల్లో కన్పిస్తోందని ఆరోపణలు చేశారు. ఏపీలో ఫ్యామిలీ పార్టీలకు అధికారం అంటే రూలింగ్ కాదు.. ట్రేడింగ్ అని మండిపడ్డారు. రోడ్ల నిర్మాణం కోసం వివిధ మార్గాల ద్వారా రాష్ట్రానికి పెద్దఎత్తున నిధులిచ్చామని, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ. 250 కోట్లు కూడా కేటాయించడం లేదని విమర్శించారు. ఏపీలో అవినీతి, వారసత్వ పార్టీలకు వ్యతిరేకంగా ఈ నెల 18వ తేదీన ప్రచారం చేపడుతున్నామని, ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రచార రథం సిద్ధం చేస్తున్నామని, ఐదు వేల సభలు నిర్వహించాలనే దిశగా కసరత్తు చేస్తున్నామని సోము వీర్రాజు చెప్పారు.
Also Read
- ‘తప్పుడు కేసులతో వేధిస్తున్నారు’.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు
- Tirupati: జాతర వేళ తీవ్ర విషాదం.. బ్యానర్ కడుతుండగా విద్యుత్ షాక్.. స్పాట్లో ఇద్దరు మృతి..
- Amaravati Land Pooling Case: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. రాజకీయ పోరాటాలు కోర్టులో వద్దు..!
- Amaravati Farmers: అమరావతి రైతుల హక్కులను పరిరక్షిస్తాం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Venky Atluri: త్రివిక్రమ్ ఛాయలు.. వెంకీ అట్లూరి రైటింగ్పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Red Fort: ఎర్రకోట ఎందుకు అంత ముఖ్యమైంది? మొఘలుల నుంచి బ్రిటిష్ వరకు.. చరిత్రలోని ఆసక్తికర నిజాలు
-
TV Ad Cap: 12 నిమిషాల యాడ్ రూల్కు కేంద్రం గుడ్బై.. టీవీ ఛానళ్లకు కొత్త నిబంధనలు
-
PM Modi: “మనం ఇతర దేశాలపై ఆధారపడకూడదు”.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ కీలక సందేశం..
ట్రెండింగ్
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..