Somu Veerraju: ఏపీలో ఇసుక కంటే బంగారమే ఈజీగా దొరుకుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somu Veerraju Fires On YCP Govt Over Sand Issue: ఏపీలో ఇసుక కంటే బంగారమే ఈజీగా దొరుకుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగారం షాపుకెళ్తే బంగారం లభిస్తుందని.. కానీ ఏపీలో కళ్ల ముందున్న ఇసుక మాత్రం ప్రజలకు అందుబాటులోకి రావడం లేదని అన్నారు. గత ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం పేరుతో దొపిడీ చేశారని ఆరోపించారు. టీడీపీ హయాంలో రెండు యూనిట్ల ఇసుక రూ. 5 వేలకు దొరికితే.. ఇప్పుడు రూ. 13 వేలు ఉంటోందన్నారు. భవన నిర్మాణాలపై ఆధారపడ్డ కార్మికులు నానా తిప్పలు పడుతున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన టిడ్కో ఇళ్లను ఇప్పటిదాకా ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. పేదలకిచ్చిన ఇళ్ల స్థలాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిర్మించాల్సిన ఇళ్లను ఎందుకు నిర్మించడం లేదని నిలదీశారు.
ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం తన వాటాను ఇవ్వడానికి సిద్దంగా ఉందని.. కానీ జగన్ ప్రభుత్వమే తన వాటా ఇవ్వడం లేదని సోము వీర్రాజు కుండబద్దలు కొట్టారు. బొప్పాయి పళ్లను అమ్మేవాళ్లు పేటీఎంలు పెడుతున్న ఈరోజుల్లో.. మద్యం దుకాణాల్లో ఎందుకు డిజిటల్ పేమెంట్లను అంగీకరించడం లేదని నిలదీశారు. ఈ ప్రభుత్వం ప్రాజెక్టుల గేట్లకు గ్రీజ్ పెట్టే పరిస్థితి లేదని.. ఎప్పుడు చూసినా పోలవరం పోలవరం అంటూ జపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పోలవరానికి రూ. 55 వేల కోట్లు ఇస్తే.. ఆ డబ్బు మొత్తం తినేయొచ్చనే ఆశ ఇక్కడి నేతల్లో కన్పిస్తోందని ఆరోపణలు చేశారు. ఏపీలో ఫ్యామిలీ పార్టీలకు అధికారం అంటే రూలింగ్ కాదు.. ట్రేడింగ్ అని మండిపడ్డారు. రోడ్ల నిర్మాణం కోసం వివిధ మార్గాల ద్వారా రాష్ట్రానికి పెద్దఎత్తున నిధులిచ్చామని, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ. 250 కోట్లు కూడా కేటాయించడం లేదని విమర్శించారు. ఏపీలో అవినీతి, వారసత్వ పార్టీలకు వ్యతిరేకంగా ఈ నెల 18వ తేదీన ప్రచారం చేపడుతున్నామని, ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రచార రథం సిద్ధం చేస్తున్నామని, ఐదు వేల సభలు నిర్వహించాలనే దిశగా కసరత్తు చేస్తున్నామని సోము వీర్రాజు చెప్పారు.
Also Read
- CM Chandrababu: ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. ప్రొటెక్షన్ సెల్, విజిలెన్స్ కమిటీలు.. సీఎం కీలక సమీక్ష
- Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
- CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
తాజావార్తలు
-
Mirzapur The Movie Box Office: జన్మాష్టమి రోజున ‘మీర్జాపూర్’ కి డబ్బుల వర్షం.. మొదటి రోజు ఎంత రాబట్టిందో తెలిస్తే..
-
KTR: ‘జాబులు లేవు.. జవాబులు లేవు’.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
-
Pretorius Breaks T20 Record: వైభవ్ సూర్యవంశీ సహచరుడి చరిత్రాత్మక శతకం.. అరుదైన రికార్డు సొంతం
-
Nayanthara: స్టార్ హీరోయిన్లో సడెన్ ఛేంజ్.. ఫస్ట్ టైమ్ ఇలా!
-
Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!