ఏపీ సర్కార్ తీరుపై ఈమధ్యకాలంలో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. హిందువుల భూములను ఆక్రమించుకుని మసీదులు కట్టాలని ఎస్డీపీఐ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఎస్డీపీఐ రాష్ట్ర అధ్యక్షులు హఫీజ్ అహ్మదుల్లా అవాకులు చవాకులు పేలుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల ఓట్ల కోసం కక్కుర్తి పడుతుందన్నారు.
ఏపీని అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష సీఎంకు లేదు. సంపూర్ణ మద్య నిషేధం అన్న జగన్ మద్యం తాగటానికి మరో గంట పొడిగించాడు. ఈ ప్రభుత్వంలో బ్రాందీలు వాళ్లకు వాళ్ళే తయారుచేసుకొని అమ్మేసుకుంటు ట్రేడింగ్ చేస్తున్నారు. చంద్రబాబు, జగన్ రాష్ట్రంలో రూలింగ్ చేయకుండా ట్రేడింగ్ చేస్తున్నారు. ఉద్యోగులకు పీఆర్సీ నిధులను ఇవ్వలేక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు సోము వీర్రాజు. 2024లో జనసేన, బీజేపీ ప్రత్యామ్నాయం. మేం కలిసి ముందుకెళ్తాం, అధికారంలోకి వస్తాం అని సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు.