Somu Veerraju: ఏపీలో జగన్ నవరత్నాల కంటే.. మోడీ సంక్షేమమే ఎక్కువ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somu Veerraju: ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ నవరత్నాల కంటే ప్రధాని నరేంద్ర మోడీ సంక్షేమమే ఎక్కువ అన్నారు భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిధిలుగా గుజరాత్ ఎమ్మెల్యే, ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి శంభు నాథ్ తొండియా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివ న్నారాయణ, సోము వీర్రాజు హాజరయ్యారు.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు వీర్రాజు.. సబ్ ప్లాన్ నిధుల కోసం బీజేపీ ఎస్సీ మోర్చా 48 గంటలుదీక్ష చెపట్టింది.. మిగిలిన పార్టీలు మీటింగ్ లు పెట్టి వెళ్లిపోవడమే కానీ, బీజేపీ మాత్రమే వారి సమస్యలపై పోరాడుతుందన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీయే.. ఏప్రిల్లో ఎస్సీల బహిరంగసభ విజయవాడ లో నిర్వహించబోతున్నాం అన్నారు.. జగన్ ప్రభుత్వం పైన గళమెత్తే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.. ఎస్సీల ను ప్రభుత్వం ఓటు బ్యాంకుగా వాడుకుటుందని ఆరోపించారు.
Read Also: Top Headlines @ 1 PM : టాప్ న్యూస్
Also Read
- Minister Payyavula Keshav: ఈ ఏడాది సాగు నీరు ఇవ్వలేం.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
- AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలకు కీలక అడుగు!
- Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
- Rythu Shankaravam: 'రైతు శంఖారావం'కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
ఇక, ఏపీలో అభివృద్ధి లేదు, తిరోగమనం పాలైంది. నాలుగు లక్షల కోట్లు రాష్ట్రం ప్రభుత్వం అప్పులు చేశారని విమర్శించారు సోము వీర్రాజు.. వైన్ మాఫియా, శాండ్ మాఫియా వైసిపి చేస్తుందని ఆరోపించారు. ఏపీని అభివృద్ధి చేయకుండా అవినీతి చేస్తూ ట్రేడింగ్ కంపెనీ మాదిరి రాష్ట్ర ప్రభుత్వం తయారైందన్నారు. వాలంటీర్ వ్యవస్ధ ద్వారా ప్రచారం చేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు.. 35 లక్షల ఇళ్లు , 1 లక్షా 80 వేల రుణం కేంద్రమే ఇస్తుందని గుర్తుచేశారు. విద్య ద్వారా ఎనిమిది రకాల సేవలను అందిస్తున్నాం.. జగన్ నవరత్నాలు కన్నా మోడీ సంక్షేమమే ఏపీలో ఎక్కువ అని తెలిపారు. ఇవేగాక 8 లక్షల కోట్ల రూపాయలు ఏపీకి అదనంగా కేటాయించి అభివృద్ధి చేస్తున్నాం.. వైసీపీ, టీడీపీ కేంద్రం చేసింది ఎందుకు చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. మేం సంక్షేమం చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం ప్రజలను చంపేస్తున్నారని విమర్శలు గుప్పించారు. 2024లో అధికారంలోకి రావడానికి అర్హత ఉన్న పార్టీ.. బీజేపీనే.. ఏపీ ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నా. కేంద్రమే ఏపీలో సంక్షేమం చేస్తుంది.. రాష్ట్ర ప్రభుత్వానిది ఏమీ లేదన్నారు సోము వీర్రాజు.
తాజావార్తలు
-
Supreme Court: CJP నిరసనకారులకు భారీ ఊరట.. ఎఫ్ఐఆర్లు కొట్టివేత.. వారికి మాత్రం షాక్
-
AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
-
SCO Summit 2026: సింధు జలాల ఒప్పందంపై షాబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు
-
CJP Protest: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్ రద్దు.. కారణమిదే!
-
Pujara Team: కోహ్లీ, సచిన్లకు మిడిల్ ఆర్డర్ బాధ్యతలు.. రహానేకు షాక్… లక్ష్మణ్కే ఓటు..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!