Somu Veerraju: ఏపీలో జగన్ నవరత్నాల కంటే.. మోడీ సంక్షేమమే ఎక్కువ..!
Somu Veerraju: ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ నవరత్నాల కంటే ప్రధాని నరేంద్ర మోడీ సంక్షేమమే ఎక్కువ అన్నారు భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిధిలుగా గుజరాత్ ఎమ్మెల్యే, ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి శంభు నాథ్ తొండియా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివ న్నారాయణ, సోము వీర్రాజు హాజరయ్యారు.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు వీర్రాజు.. సబ్ ప్లాన్ నిధుల కోసం బీజేపీ ఎస్సీ మోర్చా 48 గంటలుదీక్ష చెపట్టింది.. మిగిలిన పార్టీలు మీటింగ్ లు పెట్టి వెళ్లిపోవడమే కానీ, బీజేపీ మాత్రమే వారి సమస్యలపై పోరాడుతుందన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీయే.. ఏప్రిల్లో ఎస్సీల బహిరంగసభ విజయవాడ లో నిర్వహించబోతున్నాం అన్నారు.. జగన్ ప్రభుత్వం పైన గళమెత్తే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.. ఎస్సీల ను ప్రభుత్వం ఓటు బ్యాంకుగా వాడుకుటుందని ఆరోపించారు.
Read Also: Top Headlines @ 1 PM : టాప్ న్యూస్
Also Read
- AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
- AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..
- Off The Record : ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ సైలెంట్ వార్.. సొంత నేతలే చెక్ పెడుతున్నారా?
- Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..
ఇక, ఏపీలో అభివృద్ధి లేదు, తిరోగమనం పాలైంది. నాలుగు లక్షల కోట్లు రాష్ట్రం ప్రభుత్వం అప్పులు చేశారని విమర్శించారు సోము వీర్రాజు.. వైన్ మాఫియా, శాండ్ మాఫియా వైసిపి చేస్తుందని ఆరోపించారు. ఏపీని అభివృద్ధి చేయకుండా అవినీతి చేస్తూ ట్రేడింగ్ కంపెనీ మాదిరి రాష్ట్ర ప్రభుత్వం తయారైందన్నారు. వాలంటీర్ వ్యవస్ధ ద్వారా ప్రచారం చేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు.. 35 లక్షల ఇళ్లు , 1 లక్షా 80 వేల రుణం కేంద్రమే ఇస్తుందని గుర్తుచేశారు. విద్య ద్వారా ఎనిమిది రకాల సేవలను అందిస్తున్నాం.. జగన్ నవరత్నాలు కన్నా మోడీ సంక్షేమమే ఏపీలో ఎక్కువ అని తెలిపారు. ఇవేగాక 8 లక్షల కోట్ల రూపాయలు ఏపీకి అదనంగా కేటాయించి అభివృద్ధి చేస్తున్నాం.. వైసీపీ, టీడీపీ కేంద్రం చేసింది ఎందుకు చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. మేం సంక్షేమం చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం ప్రజలను చంపేస్తున్నారని విమర్శలు గుప్పించారు. 2024లో అధికారంలోకి రావడానికి అర్హత ఉన్న పార్టీ.. బీజేపీనే.. ఏపీ ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నా. కేంద్రమే ఏపీలో సంక్షేమం చేస్తుంది.. రాష్ట్ర ప్రభుత్వానిది ఏమీ లేదన్నారు సోము వీర్రాజు.
తాజావార్తలు
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
-
OnePlus Realme Merger: విలీనం కానున్న వన్ప్లస్, రియల్మీ..!?
-
Muttiah Muralitharan: “ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?”.. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!