Somu Veerraju: తొమ్మిది రత్నాలతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేశారు..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somu Veerraju: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఏలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామాలు అభివృద్ది చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ సర్పంచులకు నిధులు పెంచారన్నారు. అయితే కేంద్రం ఇచ్చిన నిధులు సర్పంచులకు ఇవ్వకుండా వాటిని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని సోము వీర్రాజు ఆరోపించారు. అక్టోబర్ 2 నుంచి సర్పంచులకు ఇవ్వాల్సిన నిధుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నామని తెలిపారు. మోదీ ఇచ్చిన నిధులతో రోడ్లు వేస్తున్నారని.. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు జీరో అని.. ఈ అంశంపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. స్థానిక సంస్థలకు ఇస్తున్న నిధులు ఎంతో చెప్పగలరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Read Also:China: ఉద్యోగుల టాయ్లెట్లలో సీసీ కెమెరాలు.. అందుకే అలా చేశామంటున్న కంపెనీ
Also Read
- Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
- Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
- CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
- APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
గ్రామాల్లో రోడ్లు వేసే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని సోము వీర్రాజు విమర్శలు చేశారు. సర్వ శిక్షా అభియాన్ ద్వారా ఇప్పటికే కేంద్రం నుంచి ఏపీకి రూ.80 వేల కోట్లు రాష్ట్రానికి అందాయని.. దానికి నాడు- నేడు ఇలా రకరకాల పేర్లు పెడుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పొత్తు జనంతో, జనసేనతో మాత్రమే ఉంటుందన్నారు. తొమ్మిది రత్నాలు ఇచ్చామంటూ రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల పాలు చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. పసుపు కుంకుమ పథకానికి 37వేల కోట్లు ఖర్చుపెట్టిన చంద్రబాబు.. టీడ్కో ఇళ్లు ఇవ్వలేకపోయారని సోము వీర్రాజు ఆరోపించారు. కుటుంబ పార్టీలతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. కుటుంబ పార్టీల మూలంగా మైండ్ గేమ్ రాజకీయాలు అమలవుతున్నాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ఎండగట్టి తీరుతామని స్పష్టం చేశారు. చిరంజీవి జనసేనతో కలిసొస్తే తమకు ఆనందమేనని తెలిపారు. 225 ఎమ్మెల్యే సీట్లకు పెరిగినా ఏ ఒక్క ఎమ్మెల్యే స్కూల్, హాస్పిటల్, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లరన్నారు. ఇసుక, మట్టి అమ్ముకోవడం మాత్రమే మన ఎమ్మెల్యే స్థాయి అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సీట్లు పెంచితే ఇవే పార్టీలు వస్తాయని.. ఇంకా అవే అమ్మేసుకోడానికి వస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ-జనసేన అధికారంలోకి వస్తాయని సోము వీర్రాజు జోస్యం చెప్పారు.
తాజావార్తలు
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Toxic Trailer: ‘‘టాక్సిక్’’ ట్రైలర్.. ఒక్క దెబ్బతో అంతా మార్చేశారు!
-
Lionel Messi: ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
-
UPI: యూపీఐ ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన..సామాన్యులకు ఊరట..
-
Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!