అమరావతిలోనే బీజేపీ ఆఫీస్.. స్పష్టం చేసిన సోము వీర్రాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలో జరుగుతున్న బీజేపీ ప్రజాగ్రహ సభలో ఏపీ సర్కారుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు చేశారు. కేంద్రం డబ్బిస్తే గ్రామ సచివాలయాలు కట్టి స్తోత్రం.. స్తోత్రం అంటూ జగనన్న జపం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రజాగ్రహ సభ అంటే కొందరికి కాలాల్సిన చోట కాలిందని.. మంత్రి పేర్ని నాని ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. మరోవైపు జగన్ను ప్రసన్నం చేసుకునేందుకే ప్రజాగ్రహ సభ పెట్టారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అంటున్నారని.. ఈ సభ ద్వారా అందరికీ ఏం చూపించాలో.. అంతా చూపిస్తామన్నారు.
Read Also: బీజేపీలో చేరిన టీమిండియా మాజీ క్రికెటర్
Also Read
- Nara Lokesh: వాయిదాపడే ప్రసక్తే లేదు.. స్థానిక ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలి!
- Polavaram Rehabilitation: తాడువాయిలోనే ఇళ్లు కావాలి.. పోలవరం నిర్వాసితుల భారీ ధర్నా!
- Uravakonda Theft: విచిత్ర దొంగ.. చోరీకి ముందు వెంకన్నకు నమస్కారం.. ఆ తర్వాత..!
- Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
వైసీపీ, టీడీపీ నేతలు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయో అన్నీ తేలుస్తామని సోము వీర్రాజు హెచ్చరించారు. జగన్ పాదయాత్ర చేస్తే రోడ్లు అరిగిపోయాయి.. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక తట్టెడు మట్టయినా వేశారా అని నిలదీశారు. సర్పంచులకు కేంద్రం నిధులిస్తే.. వాటిని లాక్కుంటారా అని మండిపడ్డారు. బీజేపీ నేతలు దేశం అభివృద్ధి చేసే సంస్కారం ఉన్న వాళ్లు అని సోము వీర్రాజు స్పష్టం చేశారు. జగన్ హైదరాబాదులో ఓ లోటస్ పాండ్.. ఇక్కడో పాండ్ కట్టారని.. అధికారంలోకి రాకుండానే అమరావతిలో భవనం కట్టారన్నారు.
బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తే.. ఏపీ విషయంలోనూ పరిశీలిస్తారని సోము వీర్రాజు పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని తాము, పవన్ కళ్యాణ్ కేంద్రానికి చెప్పామన్నారు. పేదల కోసం.. ఆవేదన, ఆలోచన కలిగిన పార్టీ బీజేపీ అన్నారు. మడమ తిప్పని వాడు.. మాట తప్పని వాడు.. ఏపీకి రాజధాని లేకుండా చేశారని సోము వీర్రాజు ఆరోపించారు. ఆస్తులను దోచుకునేందుకు విశాఖ చుట్టూ వైసీపీ నేతలు గద్దల్లా తిరిగుతున్నారని విమర్శించారు. ప్రజలు బీజేపీకి అధికారం ఇస్తే మూడేళ్లల్లో రాజధానిని కడతామన్నారు. సింగపూర్లా రాజధానిని కడతామని చెప్పిన చంద్రబాబు… రాజధాని రైతులను తిరుపతి వరకు నడిపించాడని మండిపడ్డారు.
ఏపీలో కేంద్రం ఇచ్చే నిధులతోనే నాడు-నేడు అని అమలు చేస్తున్నారని, మధ్యాహ్న భోజనం, ఉచిత విద్యను కేంద్ర ప్రభుత్వమే అందిస్తోందని… కానీ జగన్ సర్కారు తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటోందని సోమువీర్రాజు విమర్శలు చేశారు. సంపూర్ణ మద్య నిషేధం చేస్తామన్నవాళ్లు సారా వ్యాపారం చేస్తున్నారని, ప్రభుత్వమే పచ్చి సారా కాస్తోందని సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నవరత్నాలు ఇస్తున్నారేమో కానీ తాము అయితే 90 రత్నాలు ఇస్తామని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Bethlehem Kudumba Unit : ‘బెత్లెహం కుడుంబ యూనిట్’ తెలుగు విడుదలకు అడ్డంకి
-
Nara Lokesh: వాయిదాపడే ప్రసక్తే లేదు.. స్థానిక ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలి!
-
Konda Surekha: కొండా సురేఖకు మంత్రి పదవి నుంచి ఉద్వాసన.. కీలక పదవుల్లో కొత్త నియామకాలు.!
-
ED Raids: దక్షిణాదిలో 30 చోట్ల ఏకకాలంలో తనిఖీలు.. గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడీ సోదాలు.!
-
Kamal : సిద్ధా’ డైరెక్టర్తో కమల్ హాసన్ పవర్ ప్యాక్డ్ ప్రాజెక్ట్..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!