Somu Veerraju: దమ్ముంటే చర్చలకు రావాలంటూ.. చంద్రబాబుకు సోము వీర్రాజు సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somu Veerraju Challengers Chandrababu Naidu: ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు సీబీఐని రాష్ట్రంలోకి రావద్దన్నారని.. కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని ఏపీలోకి అనుమతించలేదని మండిపడ్డారు. శాంతి భద్రతలనేవి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంటాయని సూచించారు. తాను సీఎంగా ఉన్న సమయంలో అనుమతించకుంటే.. జగన్ పాదయాత్రలు చేసేవారా? అని చెప్పుకుంటున్న చంద్రబాబు.. ఐదేళ్లపాటు జగన్ని రోడ్లపై నడిపించారని అన్నారు. బెంగాల్లో ఐదు వందల మంది బీజేపీ కార్యకర్తలు హత్యకు గురైనా.. తాము ప్రజాస్వామ్యయుతంగానే పోరాటం చేస్తున్నామన్నారు.
Honey Health Benefits: తేనెను ఇలా తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- OTR: మేయర్ సీటుపై కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య కోల్డ్ వార్
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై సమగ్ర అధ్యయనం.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
- OTR : గంటా గేమ్ మారిందా..? భీమిలి సీటు వదులుకునేందుకు సిద్ధమా..?
చంద్రబాబు తన వైఖరిని మార్చుకోవాలని.. ప్రతీ విషయంలో కేంద్రాన్ని విమర్శించటం సరికాదని సోము వీర్రాజు హితవు పలికారు. దమ్ముంటే.. చంద్రబాబు ముందుకు వస్తే ఒకే వేదికపై చర్చకు సిద్ధమని ఛాలెంజ్ చేశారు. అప్పట్లో చంద్రబాబే ప్రత్యేక హోదా వద్దన్నారని.. ఇప్పుడు సభలు పెడుతున్న చంద్రబాబును అప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు వద్దన్నారో ప్రశ్నిస్తున్నారా? అని నిలదీశారు. చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పి, ఐదుగురు ప్రధానులను మార్చినప్పడు.. రైల్వే జోన్ తేవచ్చు కదా అని అన్నారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలిసొచ్చారని, పొత్తులపై వారే నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. తానే మాట్లాడే మాటల్లో తప్పులు ఉంటే చెప్పాలని.. చంద్రబాబు వస్తే ఆయన్నే అడుగుతానని చెప్పుకొచ్చారు.
Video Call: ఆమెకు 20.. ఆయనకు 79.. న్యూడ్ వీడియో కాల్.. కట్ చేస్తే!
అంతకుముందు.. నారా లోకేష్పై కూడా సోము వీర్రాజు ధ్వజమెత్తారు. తన పాదయాత్రలో రాయలసీమను అభివృద్ధి చేస్తామని లోకేష్ హామీలు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. 14 సంవత్సరాల పాటు చంద్రబాబు సీఎంగా ఉన్నా.. రాయలసీమకు ఏమీ చెయ్యలేదని దుయ్యబట్టారు. మళ్లీ రాయలసీమను అభివృద్ధి చేస్తామంటే, ప్రజలు నమ్మరని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో రోడ్లు వేసింది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమేనని, వైసీపీ ప్రభుత్వం ఒక్క కిలోమీటర్ రోడ్డు కూడా వేయలేదని విమర్శించారు. ఏపీలో తాము అభివృద్ధి చేస్తే.. జగన్ సర్కార్ తమ స్టిక్కర్లు వేసుకుందని ఆరోపణలు చేశారు.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!