Somu Veerraju: కేంద్రం బియ్యాన్ని అమ్ముకుంటున్నారు.. నిధులను వాడుకుంటున్నారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. కేంద్రం సరఫరా చేసే ఉచిత బియ్యం రాష్ట్రం అందించట్లేదని ఆరోపించిన ఆయన.. నాలుగు నెలలుగా బియ్యం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సరైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.. కేంద్రం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని రాష్ట్రం పంపిణీ చేయకపోవడంలేదంటూ బీజేపీ కార్యాలయం వద్ద నిరసనకు కూర్చున్న సోము వీర్రాజు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం దిగిరకపోతే 18వ తేదీన అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతాం.. ఇంకా ప్రభుత్వం దిగిరకపోతే ఉద్యమం దిగువ స్థాయికి తీసుకెళ్తామని హెచ్చరించారు.. ప్రధాని నరేంద్ర మోడీ ఇస్తున్న బియ్యాన్ని రాష్ట్రం అమ్మేసుకుంటుందని.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ విషయంపై సరైన వివరణ ఇవ్వట్లేదని మండిపడ్డారు.. ఇక, కేంద్రం ఇచ్చే నిధులను కూడా రాష్ట్రం వాడేసుకుంటుందని ఆరోపించారు సోము వీర్రాజు.
Read Also: TDP : ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే విన్నపాలేంటి.? ఇంతలో మరో నాయకుడు కర్చీఫ్ వేస్తున్నారా.?
Also Read
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
ప్రజలు వైసీపీ నాయకులను బియ్యం ఇవ్వట్లేదు అని అడిగితే మోడీ ఇవ్వట్లేదు అని అబద్ధాలు చెబుతున్నారని.. కానీ, అందులో నిజం లేదన్నారు సోము వీర్రాజు.. కేజీ బియ్యానికి రాష్ట్రం ఇచ్చేది 2 రూపాయాలైతే.. కేంద్రం రూ.38.45 ఇస్తుందని తెలిపారు.. పేదలకు బియ్యం ఇవ్వకుండా బియ్యం అమ్మేసుకునే వాళ్లకు ఇస్తున్నారని ఆరోపించారు. ఇక, ఎన్నో ఏళ్ల నుంచి కాకినాడ పోర్ట్ నుంచి బియ్యం ఎగుమతి అయిపోతుంది… పెద్ద మోసం జరుగుతుంది రాష్ట్రంలో అన్నారు.. జగన్ ప్రభుత్వం మిల్లర్ల ప్రభుత్వమని విమర్శించిన ఏపీ బీజేపీ చీఫ్.. మిల్లర్ల చేత రైతుల నుంచి తక్కువకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మరోవైపు సీఎం వైఎస్ జగన్కు దమ్ముంటే, నిజాయితీ వుంటే సివిల్ సప్లై ఛైర్మెన్ భాస్కర్ రెడ్డిని తొలగించాలని డిమాండ్ చేశారు. పేదవాళ్లను మిల్లర్లు, సివిల్ సప్లై అధికారులు మోసం చేస్తున్నారు.. కేంద్రం గ్రామీణ అభివృద్ధికి సర్పంచ్ ల అకౌంట్లలలో డబ్బులు వేస్తుంటే ఇప్పటికి రిలీజ్ చేయలేదని నిలదీశారు.. దయచేసి రాష్ట్రాన్ని దివాళా తియించొద్దు అని విజ్ఞప్తి చేశారు సోము వీర్రాజు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్తో చెలరేగుతాడా..?
-
Pawan Kalyan: ‘పవన్ కళ్యాణ్’ నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
-
Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
-
SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!