TDP : ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే విన్నపాలేంటి.? ఇంతలో మరో నాయకుడు కర్చీఫ్ వేస్తున్నారా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వారసుడిని చట్టసభల్లోకి పంపాలని చూస్తున్నారు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆ విన్నపాన్ని పార్టీ పెద్దలు పట్టించుకుంటారో లేదో తెలియదు. ఇంతలో మరో నాయకుడు అక్కడ కర్చీఫ్ వేసేందుకు పావులు కదుపుతున్నారట. ఈ ఎత్తుగడల మధ్య అధికారపార్టీ రాజకీయాలపై చర్చ స్పీడందుకుంది. ఇంతకీ ఎవరా నాయకులు? ఏమా నియోజకవర్గం? లెట్స్ వాచ్..!
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. మాజీ మంత్రి బీవీ మోహన్రెడ్డి అక్కడ పార్టీకి గట్టి పునాదులే వేశారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆ టీడీపీ కోటను దారుణంగా బద్దలు కొట్టేశారు. ఏకంగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో బివి మోహన్ రెడ్డి తనయుడు జయనాగేశ్వర్ రెడ్డి తిరిగి టీడీపీ వశం చేసినా.. 2019లో మళ్లీ కేశవరెడ్డే సత్తా చాటారు. రాజకీయ నాయకుల్లో ఆయన తీరే వేరు. ఎదుటి వారు ఎంతటివారైనా మనసులోని మాటను కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తారు. ప్రస్తుతం ఆయన వయసు పైబడింది. ఆ కారణంతో 2024 ఎన్నికల్లో చెన్నకేశవరెడ్డికి టికెట్ రాదనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారమే ఎమ్మిగనూరు వైసీపీ టికెట్పై నేతలు ఆశలు పెంచుకోవడానికి ఆస్కారం కల్పిస్తోంది.
Also Read
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మిగనూరు టికెట్ కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారట. వైసీపీ అధిష్ఠానం దగ్గర ఒక మాటేసి ఉంచినట్టు టాక్. అయితే ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆలోచనలు మరోలా ఉన్నాయి. ఆయన ఎప్పటి నుంచో తన కుమారుడు జగన్మోహన్రెడ్డిని అసెంబ్లీకి పంపాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లోనే టికెట్ తనకు వద్దని కుమారుడిని బరిలోకి దించితే గెలిపిస్తానని చెప్పారట. కానీ.. వైసీపీ అధినేత జగన్ అంగీకరించలేదని.. దాంతో పెద్దాయనే బరిలో దిగారని చెబుతారు. ఈ దఫా మాత్రం కుమారుడి కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట చెన్నకేశవరెడ్డి.
కోట్ల హర్ష ప్రస్తుతం కోడుమూరు వైసీపీ ఇంఛార్జ్గా ఉన్నారు. అది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అక్కడ నుంచి పోటీ చేయడానికి వీలు లేదు. అందుకే ఎమ్మిగనూరుపై కన్నేశారట హర్ష. పైగా కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్తో ఆయనకు పడటం లేదు. మారిన ఆలోచనలతో ఎమ్మెల్యే సుధాకర్తో సఖ్యతగా ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారట. సమస్య ఏదొచ్చినా ఎమ్మెల్యే సుధాకర్తో సర్దుకుపోతున్నారట. ఇదంతా ఎమ్మిగనూరు టికెట్ను దృష్టిలో పెట్టుకునే అన్నది వైసీపీలో ఓపెన్ టాక్. టీడీపీ నేత కోట్ల సుర్య ప్రకాష్రెడ్డికి హర్ష సోదరుడు. వీరిద్దరూ కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గోనెగండ్లకు ఇంఛార్జ్ ఉన్నారు హర్ష. ఆ నియోజకవర్గంతో రాజకీయంగా మంచి సంబంధాలు ఉన్నాయని వైసీపీ పెద్దలకు చెబుతున్నారట.
కుమారుడి కోసం ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి ఒకవైపు.. ముందుగానే కర్చీఫ్ వేస్తే.. ఛాన్స్ తప్పకుండా వస్తుందని కోట్ల హర్ష మరోవైపు ఎవరి స్థాయిలో వారు లాబీయింగ్ మొదలు పెట్టేశారు. దీంతో ఎమ్మిగనూరు వైసీపీ పంచాయితీ ఆసక్తిగా మారిపోతుంది. మరి.. వైసీపీ పెద్దలు ఎవరికి అవకాశం ఇస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
-
Aadi Saikumar : ఆది సాయికుమార్ కొత్త సినిమా అనౌన్స్మెంట్: ‘శంభల’ టీమ్తో మరో క్రేజీ ప్రయోగం!
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Akshay Kumar: దిల్ రాజు – అక్షయ్ కుమార్ మూవీ రిలీజ్ డేట్ ఖరారు..
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!