Somu Veerraju: సీఎం జగన్కు సోము వీర్రాజు లేఖ.. భూ అక్రమాలపై సిట్ నివేదిక ఏమైంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somu Veerraju: ఏపీ సీఎం జగన్కు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మంగళవారం ఉదయం లేఖ రాశారు. ఈ సందర్భంగా 2004 నుంచి విశాఖలో, ఉత్తరాంధ్రలో జరిగిన భూ అక్రమాలపై సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని లేఖలో కోరారు. విశాఖ నగరం, పరిసర ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భూ అక్రమాలు జరుగుతున్నాయని.. ప్రభుత్వ, ప్రైవేటు, దేవాదాయ శాఖకు చెందిన భూములే కాదు సామాన్యుల భూములకు రక్షణ లేకుండా పోయిందని సోము వీర్రాజు ఆరోపించారు. స్వాతంత్ర్య సమరయోధులు, వారి కుటుంబాలకు, మాజీ సైనిక ఉద్యోగులకు కేటాయించిన భూములను కూడా కబ్జా చేస్తున్నారని విమర్శలు చేశారు.
Read Also: Reliance Jio: దేశవ్యాప్తంగా జియో సేవలకు అంతరాయం
Also Read
- Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
- Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
- Gadikota Srikanth Reddy: 'ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు'.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
విశాఖ భూ అక్రమాలపై దర్యాప్తు చేయాల్సిన అంశాలపై ప్రభుత్వం దోబూచులాడుతోందని సోము వీర్రాజు అన్నారు. విశాఖ భూ అక్రమాల్లో ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందన్నారు. 2004లో అప్పటి సీఎం వైఎస్ఆర్ హయాం నుంచి విశాఖలో భూదందా మొదలైందని.. చంద్రబాబు హయాంలో భూ అక్రమాలు జరిగాయని ప్రతిపక్షంగా వైసీపీ కూడా ఆరోపించిందని గుర్తుచేశారు. ఆ తర్వాత వైసీపీ హయాంలోనూ భూ అక్రమాలు జరిగాయన్నారు. విశాఖ భూ అక్రమాల్లో వైసీపీ ప్రభుత్వ పాత్ర లేకుంటే చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని.. విచారణకు సిద్ధపడాలని సీఎం జగన్కు సూచించారు.
వైఎస్ఆర్, చంద్రబాబు, జగన్ హయాంలలో కొందరు ప్రజా ప్రతినిధులు కలిసికట్టుగా ప్రజలను దోచుకున్నారనే ప్రచారం ఉందని.. నాటి తెలుగుదేశం ప్రభుత్వం భూ కబ్జాలపై విచారణకు ‘సిట్’ వేసింది కానీ కమిటీ నివేదిక బహిర్గతం కాకుండానే ఎన్నికలు వచ్చాయని సోము వీర్రాజు చెప్పారు. గత ప్రభుత్వ దురాక్రమణలపై వైసీపీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయిస్తుందని ప్రజలు వేచి చూశారన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చి మూడున్నరేళ్లు గడుస్తున్నా విచారణలోని అంశాలను ఎందుకు బహిర్గతం చేయట్లేదని ప్రశ్నించారు. నాటి సిట్ నివేదిక ఏమైందని.. ప్రభుత్వ విచారణ ఏమైందో చెప్పాలన్నారు. ఈ బహిరంగ లేఖను మీ స్పందనలో వచ్చిన అత్యవసర ఫిర్యాదుగా స్వీకరించాలని సోము వీర్రాజు కోరారు. తక్షణమే ఉత్తరాంధ్ర భూ కబ్జాల మీద స్పందించాలని డిమాండ్ చేశారు.
Read Also: Ex Russian Minister Arrest: డెహ్రాడూన్ ఎయిర్పోర్టులో రష్యా మాజీ మంత్రి అరెస్ట్.. ఎందుకంటే?
తాజావార్తలు
-
Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
-
WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
-
Vijayashanti: నటించాలని లేదు కానీ.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!