Reliance Jio: దేశవ్యాప్తంగా జియో సేవలకు అంతరాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Reliance Jio: దేశంలోని పలు ప్రాంతాల్లో రిలయన్స్ జియో సేవల్లో అంతరాయం కలిగింది. నెట్వర్క్ డౌన్ కావడంతో జియో ఇంటర్నెట్, కాల్స్, ఫైబర్ సేవలు నిలిచిపోయాయని పలువురు వినియోగదారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు జియో నెట్ వర్క్లో సమస్యలు ఎదురైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జియో నెట్వర్క్ నుంచి కాల్స్ చేసుకునేందుకు, మాట్లాడేందుకు కుదరట్లేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఎస్ఎంఎస్లు పంపించేందుకు నెట్వర్క్ పనిచేయడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నెట్ బ్రౌజింగ్లోనూ సమస్యలు ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో పలువురు ప్రత్యామ్నాయంగా వాట్సాప్ కాల్ వాడుకుంటున్నారు.
Read Also: NIA Raids: గ్యాంగ్స్టర్లు, ఉగ్రవాద ముఠాలకు లింక్.. దేశవ్యాప్తంగా ఎన్ఐఏ దాడులు
Also Read
- Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
- LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
- UPI Scam Alert : UPI ద్వారా డబ్బు పంపిన వెంటనే మోసపోయారా? మొదటి 30 నిమిషాల్లో ఏం చేస్తే నష్టం తగ్గే అవకాశం ఉంటుంది
- Money: జీతం పెరుగుతున్నా చేతిలో డబ్బు మిగలడం లేదా? మధ్యతరగతి ఎక్కువగా చేసే పొరపాటు ఇదే!
దేశంలోని ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతా ప్రాంతాలకు చెందిన యూజర్ల నుంచి ముఖ్యంగా జియో నెట్వర్క్లో సమస్యలు ఏర్పడాయి. డౌన్ డిటెక్టర్ పోర్టల్ వివరాల ప్రకారం.. 37 శాతం మంది యూజర్లు తమకు సిగ్నల్ రావడం లేదని.. 37 శాతం మంది కాల్స్, ఎస్ఎంఎస్లు చేసుకోలేకపోతున్నట్టు వివరించారు. అటు 26 శాతం మంది యూజర్లు మొబైల్ ఇంటర్నెట్లోనూ సమస్యలు ఉన్నట్లు వాపోయారు. కాగా సాధారణ కాల్స్కే దిక్కు లేదు కానీ 5జీ సేవలను అందించేందుకు ఎలా ప్లాన్ చేస్తారని జియో యాజమాన్యాన్ని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. ముందు నెట్వర్క్లో ఎలాంటి సమస్యలు లేకుండా జియో చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Read Also: Tammineni Sitaram: సుప్రీం తీర్పు భేష్.. ఆరునెలల్లో ఇల్లే కట్టలేం.. రాజధాని ఎలా కడతాం..?
తాజావార్తలు
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!