SomiReddy: మహానాడుపై వైసీపీకి కడుపు మంట ఎందుకు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒంగోలు సమీపంలో టీడీపీ ఈనెల 27, 28 తేదీల్లో మహానాడు కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ మేరకు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి బుధవారం మధ్యాహ్నం మహానాడు కార్యక్రమం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఒంగోలులో టీడీపీ మహానాడు నిర్వహిస్తుంటే వైసీపీకి కడుపు మంటగా ఉందని సోమిరెడ్డి ఆరోపించారు. రాష్ట్రాన్ని పరిపాలించడం చేతకాక గడపగడపకు వెళితే జనం మొహం మీద కొడుతున్నారని ఎద్దేవా చేశారు.
MLA Sudhakar: వైసీపీ ఎమ్మెల్యేను నిలదీసిన వృద్ధురాలు..!
Also Read
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
తెలుగోడు అంటే తల ఎత్తుకునే పరిస్థితి ఎన్టీఆర్ తెచ్చారని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు ఎవరైనా తమది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవాలంటే తలదించుకోవాల్సిన పరిస్థితిని జగన్ తెచ్చాడని ఆరోపించారు. భారత దేశ పౌరులకు ఉండే హక్కులు ఆంధ్రప్రదేశ్లో లేవా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఏపీలో ప్రత్యేక రాజ్యాంగం ఏమైనా ఉందా అని సోమిరెడ్డి నిలదీశారు. వైసీపీ తలకిందులుగా తపస్సు చేసినా పీకే లాంటి సన్నాసుల సలహాతో రాష్ట్రాన్ని నాశనం చేసినా టీడీపీ అధికారంలోకి వస్తుందని సోమిరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే చంద్రబాబు ఏకైక నాయకుడని ప్రజలు డిసైడ్ అయ్యారని పేర్కొన్నారు. మహానాడు కార్యక్రమం కోసం ఒంగోలులో మినీ స్టేడియానికి డబ్బులు కడితే పర్మిషన్ ఇవ్వలేదని.. తోరణాలు కడితే పీకేస్తున్నారని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Sudheer Joker: రాయల్ ఫ్యామిలీ దొంగ… ఆసక్తి రేపుతున్న ‘సుధీర్ జోకర్’ బ్యాంగర్!
-
Rahul Gandhi: మోడీ విదేశీ టూర్లపై రాహుల్ గాంధీ విసుర్లు
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!